Friday, July 17, 2026
26.4 C
Hyderabad

KALESHWARAM|కాళేశ్వరం అవినీతి కేసు CBI|సిబిఐకి

తీర్మానించిన TELANGANA|తెలంగాణ అసెంబ్లీ|ASSEMBLY

తెలంగాణ ఉసురు తీసిన వారిని
ఉరి తీసినా తప్పులేదు: సీఎం|CM REVANTH REDDY

నిందలకు తావు లేకుండా సిబిఐ కి అప్పగింత

TELANGANA|తెలంగాణ శాసనసభలో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన భారీ లోపాలు, అవినీతి, ప్రజా ధన దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో అనేక ఊహించని విషయాలు, అవినీతి వెలుగులోకి వచ్చాయని, మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాలంలో ప్రాజెక్టును అవినీతి పూరితంగా నిర్మించారని ఆయన ఆరోపించారు.

చరిత్రను గుర్తు చేసిన సీఎం

మొదటగా సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక ఉదాహరణలు గుర్తుచేశారు. 12వ శతాబ్దంలో కాకతీయులు 30 వేల గొలుసుకట్టు చెరువులను నిర్మించి, వ్యవసాయమే జీవనాధారం అని నిరూపించారని చెప్పారు. అలాగే నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ తాగునీరు, సాగునీరు అందిస్తున్నాయని వివరించారు. ఇటీవల కామారెడ్డి వరదల సమయంలో 14 గ్రామాలను రక్షించిన పోచారం ప్రాజెక్టును ప్రత్యేక ఉదాహరణగా ప్రస్తావించారు. శ్రద్ధగా, ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తే ఎలా ఉంటుందో పోచారం ప్రాజెక్టు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

నెహ్రూ వారసత్వం – కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు

ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా వర్ణించిన పండిట్ JAWAHARLAL NEHRU|జవహర్‌లాల్ నెహ్రూను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పాలనలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిందని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాల వల్లే పుట్టుకొచ్చింది. ఈ రాష్ట్రం ఆకలి కేకల నుండి వెలిసింది. కానీ ఆ ఆకాంక్షలను మోసం చేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

ప్రతిపక్ష వైఖరిపై విమర్శలు

సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులను ఉద్దేశించి మీకు పూర్తిస్థాయి సమయం ఇస్తున్నాం. కానీ మీరు దుర్వినియోగం చేస్తున్నారు. కాళేశ్వరం విచారణకు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు అడిగింది ఒకటి ఐతే, సాంకేతిక నిపుణుడు వేరొకటి ఇవ్వరు కదా అని ప్రశ్నించారు.

NDSA నివేదికలో మేడిగడ్డ లోపాలు స్పష్టం

ముఖ్యమంత్రి పేర్కొన్న దాని ప్రకారం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికే మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు. NDSA చెప్పింది. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని రిపోర్ట్ చెబుతోంది. కానీ అప్పటి ప్రభుత్వం దానిని దాచిపెట్టిందని సీఎం అన్నారు.

కేసీఆర్ దోపిడీ – హరీష్ సమాధానం చెప్పాలి

కేసీఆర్ నిజాం కంటే ధనవంతుడు కావాలని కలలు కనేశాడు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ధనవంతుడు అవ్వాలనే ఆశతో ప్రజల డబ్బును దోచుకున్నాడు. కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో దోపిడీ చేశారు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్ రమణారెడ్డి లేఖ రాశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి కేసీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మేడిగడ్డ చుట్టూ పోలీసులు – నిజాలను దాచిన గత ప్రభుత్వం

2020 అక్టోబర్ 21న మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంజనీర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోపాలు బయటపడ్డాయి. కానీ ఆయన పిట్టని కూడా రానీయకుండా మేడిగడ్డ చుట్టూ పోలీసులు పెట్టాడు. తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినవారు కేసీఆర్, హరీష్ రావు. సాంకేతికతను విస్మరించి, దోపిడీ చేశారని ఆయన ధ్వజమెత్తారు.

ప్రాణహితను ఉరి వేసిన కేసీఆర్ – ప్రజలపై అప్పుల భారం

ప్రాణహిత ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన అప్పటి సీఎం కేసీఆర్ దానిని ఉరి వేసాడని సీఎం అన్నారు. కాళేశ్వరం కోసం 85,449 కోట్ల అప్పులు తెచ్చారు. వాటిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 27,738 కోట్లు 11.5% వడ్డీకి, 30,536 కోట్లు 12% వడ్డీకి తీసుకున్నారు. ఇప్పటివరకు 49,835 కోట్లు ప్రిన్సిపల్, వడ్డీగా చెల్లించాం. ఇంకా 60,869 కోట్లు భారం మిగిలి ఉంది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మరో 47 వేల కోట్లు అవసరమని చెప్పారు.

ఢిల్లీలో రుణాల రీ-స్ట్రక్చరింగ్ – మోడీతో సంబంధాలు

తాను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నానని కేటీఆర్ లెక్కలతో సహా చెప్పి చిల్లర ప్రచారాలు చేస్తున్నాడని, కానీ తాను కేసీఆర్ తెచ్చిన 11.5% వడ్డీని 7.25%కి తగ్గించి రుణాలను రీ-స్ట్రక్చర్ చేశాను. మోడీ ప్రధానమంత్రి. మనకు కావలసిన నిధులు తెచ్చుకోవడమే నా బాధ్యత. అందుకే ప్రధానిని కలవడం తప్పా? అని అన్నారు. అలాగే కేసీఆర్, కుటుంబం ఆస్తులపై ప్రశ్నలు లేవనెత్తుతూ వందల ఎకరాల ఫార్మ్ హౌస్‌లు, టీవీలు, పత్రికలు ఎక్కడి నుండి వచ్చాయి? లక్షల కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది? అని ప్రశ్నించారు.

విచారణ కమిషన్ నివేదిక – కీలక అంశాలు

రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ 2025 జూలై 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న మంత్రి మండలి ఆ నివేదికను ఆమోదించింది. నివేదికలో:

  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ప్రణాళికా లోపాలు
  • డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు
  • ఆర్థిక అవకతవకలు, దురుద్దేశపూర్వక నిర్ణయాలు
  • ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టడం

వంటి అంశాలను స్పష్టంగా ప్రస్తావించిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థల పాత్ర, ఆర్థిక సంస్థల ప్రమేయం ఉన్నందున సీబీఐ విచారణ తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదు. కేంద్ర సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని సభలో ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల కలల ప్రాజెక్టుగా చెప్పబడినా, అవినీతి, లోపభూయిష్ట నిర్మాణం వల్ల అది భారీ కుంభకోణంగా మిగిలిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకున్నవారు శిక్షించబడతారని, పారదర్శక దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News