Friday, July 17, 2026
24.5 C
Hyderabad

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ. పారదర్శక పాలన, అవినీతిపై కఠిన వైఖరి, అంతర్గత ప్రజాస్వామ్యం, అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి అవసరం. టీఎంసీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ అంశాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తున్నాయి. రాబోయే కాలమే టీఎంసీ భవితవ్యాన్ని నిర్దేశించగలదు. ఈ దశలో టీఎంసీ అధినేత్రి మమత ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు వామపక్షాల అజేయ ఎర్ర కోటగా భావించిన బెంగాల్‌లో 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా మూడు సార్లు అధికారాన్ని నిలబెట్టుకుని రాష్ట్ర రాజకీయాలను శిసిస్తూ వచ్చారు. అయితే దీర్ఘకాల పాలనలో ఎదురైన అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాల విమర్శలు, పార్టీ అంతర్గత అసంతృప్తులు, చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇప్పుడు టీఎంసీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.

2011లో 184 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన టీఎంసీ, 2016లో 211 స్థానాలు, 2021లో 213 స్థానాలు సాధించి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే ఎన్నికల విజయాలు మాత్రమే జనరంజక పాలనకు కొలమానం కాదు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, చట్టవ్యవస్థ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో టీఎంసీ ప్రభుత్వం వైఫల్యాలు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
ప్రత్యేకించి నందిగ్రామ్ ఉద్యమం ద్వారా రైతు హక్కుల పరిరక్షకురాలిగా గుర్తింపు పొందిన మమతా బెనర్జీ, అదే సమయంలో రాష్ట్రంలో భారీ పరిశ్రమల పెట్టుబడులకు ఆటంకాలు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. గత దశాబ్దంలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగా, బెంగాల్ ఆ స్థాయిలో ముందుకు సాగలేకపోయిందనేది పరిశ్రమల వర్గాల అభిప్రాయంగా ఉంది.

ఇదిలా ఉండగా, ఉపాధ్యాయ నియామక కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులు, బొగ్గు అక్రమ తవ్వకాల ఆరోపణలు టీఎంసీ ప్రభుత్వ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు, పలువురు నాయకులపై దర్యాప్తు సంస్థల విచారణలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీశాయి. ప్రతిపక్షాలు ఈ పరిణామాలను “వ్యవస్థీకృత అవినీతి”గా అభివర్ణిస్తుండగా, టీఎంసీ మాత్రం రాజకీయ కక్షసాధింపుగా కొట్టిపారేస్తోంది.

మరో కీలక అంశం సరిహద్దు భద్రత, అక్రమ వలసల సమస్య. బంగ్లాదేశ్‌తో 2,200 కిలోమీటర్లకు పైగా సరిహద్దు కలిగిన పశ్చిమ బెంగాల్‌లో అక్రమ చొరబాట్లు పెను సవాల్ గా మారాయి. కేంద్ర భద్రతా సంస్థలు సరిహద్దు భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా, మమత మాత్రం మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఈ అంశం ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ ఆయుధంగా మారింది.

రాష్ట్రంలో చట్టవ్యవస్థపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలపై నేరాలు, రాజకీయ హింస, స్థానిక స్థాయిలో పార్టీ ఆధిపత్యం వంటి అంశాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోటీ సహజమైనదే అయినప్పటికీ, హింసాత్మక ఘటనలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయనే చెప్పొచ్చు.

అసెంబ్లీ అధికారంతమున టీఎంసీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు, 20మంది లోక్ సభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. దీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజమే అయినప్పటికీ, అవి బహిరంగంగా బయటపడితే పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ పరిస్థితి అగమ్య గోచరంగా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పాత్రపై కూడా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్, గత రెండు దశాబ్దాల్లో తన ప్రభావాన్ని కోల్పోయింది. ప్రస్తుతం టీఎంసీ ఎదుర్కొంటున్న సవాళ్లు బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవన అవకాశాలను కల్పించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టీఎంసీ-కాంగ్రెస్ విలీనంపై వస్తున్న ఊహాగానాలకు ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల అలాంటి వార్తలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ఎంతో కీలకం. కానీ ఏ పార్టీ అయినా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే పారదర్శక పాలన, అవినీతిపై కఠిన వైఖరి, అంతర్గత ప్రజాస్వామ్యం, అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి అవసరం. టీఎంసీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ అంశాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు శాశ్వతం కాదు. ఎన్నికల విజయాలు ఎంత గొప్పవైనా, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం, అవినీతి ఆరోపణలు, నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి ఏ రాజకీయ శక్తినైనా బలహీనపరుస్తాయి. రాబోయే కాలమే టీఎంసీ భవితవ్యాన్ని నిర్దేశించగలదు. ఈ దశలో టీఎంసీ అధినేత్రి మమత ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News