Monday, March 16, 2026
29.3 C
Hyderabad

ప్రజాస్వామ్యమా! వర్ధిల్లూ!! నూరేళ్ళూ!!!|EDITORIAL

ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యానంతరం దేశంలో, ఓటింగ్ వ్యవస్థపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తడం ఆశ్చర్యకరమే గాక, అభ్యంతరకరం, ఆలోచనాత్మకం. ‘ఓట్ చోరీ’ ఆరోపణలు ప్రజాస్వామ్యంపై అప నమ్మకాలను పెంచుతున్నాయి. మరికొన్ని సంశయాలను కలిగిస్తున్నాయి. ఇది నైతికంగానే గాక, రాజ్యాంగ పరంగా అత్యంత శోచనీయం!

ప్రజాస్వామ్యం పది కాలాలపాటు మనజాలాలంటే, ఎన్నికల వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పాదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం పెరిగి, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం పరిపుష్టంగా వర్ధిల్లుతుంది. మరి ఈ చిత్తశుద్ధి శాసనాలు చేసే రాజకీయ పార్టీలకు, అమలు చేసే అధికార యంత్రాంగానికి ఉందా?!

‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ ఎన్నికలు-సంశయాలు-సంస్కరణలు-పరిష్కారాలు!

ప్రజాస్వామ్యానికి మూలం స్వేచ్ఛాపూరిత, స్వచ్ఛంగా, పాదర్శకంగా జరిగే నిష్పాక్షిక ఎన్నికలు. ‘ప్రజలచే, ప్రజల కోసం, జరిగే పరిపాల’నే ప్రాథమిక సూత్రం. ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యానంతరం దేశంలో, ఇటీవలి కాలంలో, ఓటింగ్ వ్యవస్థపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తడం ఆశ్చర్యకరమే గాక, అభ్యంతరకరం, ఆలోచనాత్మకం. ‘ఓట్ చోరీ’ అనే ఆరోపణలు ప్రజాస్వామ్యంపై అప నమ్మకాలను పెంచుతున్నాయి. మరికొన్ని సంశయాలను కలిగిస్తున్నాయి. ఇది నైతికంగానే గాక, రాజ్యాంగ పరంగా అత్యంత శోచనీయం.

ఇటీవల రాహుల్ గాంధీ ఓట్ చోరీపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో 65 లక్షల ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లను చేర్చినట్లు ఆరోపించారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో తప్పుడు, రెప్లికేట్ అడ్రెస్సులు, ఏకమొత్తంలో రిజిస్ట్రేషన్లు, ఫారం -6 దోపిడీ వంటి విధానాలతో భారీగా ఓట్ల దోపిడీ జరిగిందన్నది రాహుల్ ఆరోపణ. అంతేగాక ఈ ఓట్ల చోరీ కోసం బీజేపీకి ఎన్నికల సంఘం సహకరిస్తున్నదని, దీనికి 2023లోనే చట్టం ద్వారా ఎలక్షన్ కమిషనర్లకు న్యాయ పరిరక్షణ కల్పించడం వల్ల అవినీతికి చట్టబద్ధత కల్పించినట్లైందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ చోరీపై బీహార్ నుంచి ఎన్నికల సంఘం, కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించారు. ఈ ఆరోపణలను సహజంగానే ఎన్నికల సంఘం ఖండించడమేగాక, ఆధారాలుంటే అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వాదిస్తోంది. బహుషా ఎన్నికల సంఘం రాహుల్ పై చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీజేపీ, ప్రధాని కూడా రాహుల్ పై విరుచుకుపడుతున్నారు. ఇంకోవైపు ఈ వ్యవహారం కాస్తా కోర్టు దాకా వెళ్ళింది. ఓట్ల చోరీ కేసులో చనిపోయారని ఓట్లు తొలగించిన పలువురిని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో హాజరు పరచడంతో, ఈ నెల 19వ తేదీ వరకు సవరించిన జాబితా, తొలగింపుల జాబితాలను 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ బీహార్ లో ఓట్ చోరీపై యాత్రను చేపట్టారు. ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

అసలు ఓట్ చోరీ అంటే ఏమిటి? ఓట్ చోరీ అనేది అనేక ప్రక్రియల్లో జరుగుతున్నది. ఓటర్ల పేర్లు తొలగించడం లేదా జాబితాలో ఉండకుండా చేయడం. బూత్ క్యాప్చరింగ్ అంటే ఓటింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని తప్పుడు ఓట్లు వేయడం. నకిలీ ఓటర్లు , మృతుల పేరుతో ఓటింగ్ చేయడం, ఒకరికి బదులుగా మరొకరు ఓటు వేయడం. ఈవీఎంలను టాంపరింగ్ చేయడం. ఓటర్లను బెదిరించడం లేదా ప్రలోభాలకు గురిచేయడం వంటివి. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది. ఇది ఒకటి రెండు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే ప్రభావం చూపుతుంది.

ఇక ఓట్ చోరీ జరగడానికి పలు సామాజిక, రాజకీయ, సాంకేతిక కారణాలున్నాయి. అధికార దాహంతో రాజకీయ పార్టీలు ఇలాంటి దుర్నీతికి ఒడిగడుతున్నాయి. ప్రజల్లో రాజకీయ అవగాహన లోపం. ప్రభుత్వ యంత్రాంగం తప్పిదాలు, కఠినమైన చట్టాల లేకపోవడం, పార్టీల ప్రాబల్యం అధికంగా ఉండటం వంటి కారణాల వల్ల ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి.

ఓట్ చోరీ వంటి ఆరోపణలు నిజమైతే ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతారు. తమ ఓటుకు విలువ లేదన్న భావనతో ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అసమర్థ నాయకత్వం ఎన్నిక అవుతుంది. రాజకీయ హింస పెరుగే వీలుంది. పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తే, ప్రజలు ప్రశ్నించలేని పరిస్థితులు ఏర్పడతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంస్కరణలు అవసరం. ప్రజల్లో ఓటుపై అవగాహన, చైనత్యం పెంచాలి. ఎన్నికల చట్టాలను పటిష్టంగా రూపొందించి అమలు చేయాలి. ఎన్నికల నిందితులను ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలి. ఫేస్ రీడింగ్ అథెంటికేషన్, బయోమెట్రిక్ ఓటింగ్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టాలి. వీవీ ఫ్యాట్ జాబితాలతో ఈవీఎంలపై అనుమానాలు తొలిగించాలి. పారదర్శకతను పెంచాలి. లేదంటే తిరిగి బ్యాలెట్ పద్ధతినే అవలంబించాలి. ఎన్నికల సంఘం ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా స్వత్రంతంగా, స్వేచ్ఛగా పని చేసే చట్టాలు తేవాలి. ఎన్నికల సంఘానికి సరిపడా నిధులు, విధులు కల్పించాలి.

ఇప్పటికైనా ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం చేసి, ఆలోచించాలి. ఇప్పటికే 1974లో తర్కుండే కమిటీ, 1998లో ఇంద్రజీత్ గుప్తా కమిటీ, 2001లో లాయా కమిటీలు ఇచ్చిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. వాటిని అమలు చేయాలన్న రాజకీయ చిత్తశుద్ధీ కరువైంది.

ప్రజాస్వామ్యం పది కాలాలపాటు మనజాలాలంటే, ఎన్నికల వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పాదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం పెరిగి, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం పరిపుష్టంగా వర్ధిల్లుతుంది. మరి ఈ చిత్తశుద్ధి శాసనాలు చేసే రాజకీయ పార్టీలకు, అమలు చేసే అధికార యంత్రాంగానికి ఉందా?!

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News