Wednesday, June 10, 2026
25.8 C
Hyderabad

ఆత్మస్థుతి, పరనిందలేనా? ప్రజల మాటేమిటి!?|EDITORIAL

రాజకీయాల్లో సచ్చీలత సాధ్యం కాదు. స్వచ్ఛంగానే, స్వచ్ఛందంగానే పని చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప అలా చేయడం కూడా దుస్సాధ్యం. నూటికో కోటికో ఒక్కరు అలా కనిపించినా, వారు ఇంకా బతికున్న నీతికి, నిజాయితీకి ఆఖరి గుర్తుగా మిగిలిపోతారు. రాజకీయాలను ‘రాజీ’కీయాలుగా కూడా భావించవచ్చు. ఇందులో ‘ఆత్మ స్థుతి, పర నిందే’ అధికం. రాను రాను నేరగాళ్ళు కూడా రాజకీయాల్లో చొచ్చుకురావడం, లేదా రాజకీయాల్లో ఉన్న వారే నేరాలకు పాల్పడటం రివాజుగా మారింది. అధికారం ఉన్నంత వరకు ఏదైనా చెల్లుతుంది కాబట్టి, ఇష్టానుసారంగా వ్యవహరించడం కూడా అలవాటుగా మారింది.

అధికారంతమున చూడవలె అయ్యవారల ఆగడముల్ అన్నట్లుగా పదవులు పోగానే, కొత్తగా కొలువుల్లో చేరిన వారు పాత వారి పని పట్టడం, కనీసం పట్టినట్లుగా కనిపించడం, అలా ప్రతిపక్షాలను అదికార పక్షాలు నిలువరించడం, నియంత్రించడం కూడా మామూలైపోయింది. ఈ ధోరణి కాస్తా విపరీతమైనప్పుడు శత్రు భావనలకు వెళ్ళినప్పుడు, శ్రీ కృష్ణ జన్మస్థానాలు కూడా వారికి వరంగా మారిపోవడం లేదా మార్చుకోవడం చూస్తున్నాం.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. గతంలో మాజీ సీఎం జగన్ పై పలు కేసులు, జైలుకెళ్ళిన నేపథ్యంలో నిరంతరం అతడిని దొంగా దొంగా అంటున్నందుకు ప్రతీకారంగానో, ప్రత్యక్షంగా అవినీతితో సంబంధం ఉన్న కారణంగానో చంద్రబాబును కూడా జైలుకు పంపిన విధానాన్ని చూశాం. గతంలో ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని అప్పట్లో అనేక కేసులు వేధించాయి. ఆయనపై 180 పై చిలుకు కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన సీఎం అయ్యాక, గత ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు వంటి అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లాంటి వాళ్ళు నిందితులుగా ఉండటం గమనించాలి. కల్వకుంట్ల కవిత కూడా లిక్కర్ కేసులో నిందితురాలిగా జైలు జీవితం గడిపి వచ్చారు. ఇక బీజేపీ అగ్రనేతలు బీఎల్ సంతోశ్ వంటి వారు, వారి మధ్యవర్తిత్వంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నారని నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఏకంగా నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆరు నెలలు కూడా నిలవదని పలికిన ప్రగల్బాలు దాదాపు ఇదే కోవలోకి వచ్చే వ్యవహారాలే.

ఇక, అధికార పక్ష, విపక్ష రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తుంటే అసహ్యంగానే అనిపిస్తుంది. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరనే సామెత వీరికి సరిపోతుంది. ఐదేళ్ల పాటు జగన్‌, పదేళ్ల పాటు కేసీఆర్‌ కుటుంబం చేసిందేంటి? ఈ రెండు కుటుంబాలు, వీరిని నమ్ముకున్న వారి సామాజిక వర్గానికి చెందిన మరికొందరు మాత్రమే బాగు పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్ళ అవినీతి దోపిడీ రుజువవుతాయో లేదో కానీ, వారి పాలనలో రెండు రాష్ట్రాలు మాత్రం దివాళా తీసాయి.
ఇప్పుడా కేసులు, విచారణలు జరుగుతుండటంతో ఎదుటి పార్టీలపై రంకెలు వేస్తున్న వైనం ప్రజలకు కంపుకొడుతున్నది. మళ్లీ తమదే అధికారం మాదే ధీమా, రాజకీయాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ లోపాలను ఎత్తి చూపుతున్నది. కాంగ్రెస్ విఫలమైతే, బీజేపీకి ప్రజల్లో బలం లేదు కాబట్టి తమను ఎన్నుకోవడం తప్ప ప్రజలకు వేరే ప్రత్యామ్నాయమే లేదని బీఆర్ఎస్ దీమా. బీఆర్ఎస్ పనైపోతే, కాంగ్రెస్ ను విఫలం చేసైనా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పన్నాగం. ఇక ఆ రెండు పార్టీలకు దీటుగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అధికారం నిలుపుకోవాలన్న ఉబలాటం కాంగ్రెస్ ది. అలాగే ఏపీలో కూడా కూటమి విఫలమైతే తమదే అధికారం అన్న దీమాలో వైసీపీ ఉన్నది. కాంగ్రెస్ ఎలాగూ బలంగా లేదు కాబట్టి, జగన్ ను నిలువరిస్తే తమదే అధికారం, హవా అన్న దీమాలో అధికార కూటమి ఉంది. ఇక్కడా ప్రజలకు కూటమి, వైసీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

ఈ ప్రజలకు ప్రత్యమ్నాయం లేని పరిస్థితులను కల్పించి మరీ, తమ అధికార దాహం తీర్చుకోవడానికి, అన్ని పార్టీలు అవే ఎత్తుగడల్లో ఉన్నాయి. అయితే ఈలోగా, ఆయా పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తూ చేసుకుంటున్న ఆరోపణలే అసహ్యంగా ఉన్నాయి. జుగుప్సాకరంగా ప్రజలకు ఏవగింపు కలిగిస్తున్నాయి. దొంగలే దొంగా దొంగా అని అరచినట్లు, తమ తప్పులేవీ ప్రజలకు తెలియవని, తెలిసినా, ఎదురుదాడులతో జనం సానుభూతి పొంది, ప్రజల్ని మోసం చేయొచ్చనే పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు వారి వారి సొంత మీడియాల్లో చేస్తున్న ప్రచారం హేయంగా కనిపిస్తోంది. కొందరు తామే అధికారంలో ఉన్నట్లుగా, మరికొందరు తమకు తప్ప పాలించే అర్హత మరెవ్వరికీ లేనట్లుగా నీచంగా మాట్లాడుతున్నారు. హద్దుపద్దు లేకుండా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు.
ఇలాంటి సుద్దపూసలు సుద్దులు చెబుతున్నారు. ఆత్మ పరిశీలన ఆవగింజంతైనా ప్రదర్శించకుండా ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అబద్దాలను అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికి పార్టీ ఫిరాయింపులను బరితెగించి ప్రోత్సహిస్తున్నారు. అధికారం తమకు పేటెంట్ అయినట్లుగా వ్యవహరిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఏ పార్టీని ద్వేషించడమో, సమర్థించడమో కాదు కానీ, రాజకీయాల్లో కొంచెమైనా నీతి, నిజాయితీ, నిబద్ధత అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. లేదంటే నేపాల్ పరిస్థితే ఎదురవుతుంది.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News