Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన శైలి గలవారు. సంచార జాతులు. వలస జీవన శైలి, వాణిజ్యాల ద్వారా విస్తరించారు. ఆదివాసులు రాజ్యాంగ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 1950 ద్వారా గుర్తించబడ్డారు. లంబాడాలు షెడ్యూల్డ్ కులాలు, ట్రైబ్స్ చట్టం-1976 సవరణ ద్వారా ఎస్టీల జాబితాలో చేర్చబడ్డారు. ఈ 50ఏండ్లల్లో తమకు చెందాల్సిన అన్ని అవకాశాలను లంబాడాలు పొందారని ఆరోపిస్తూ, ఆదివాసీలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లిందని, తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. దాదాపు ఆదివాసీ అన్ని తెగలు, వాటిలోని ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజానీకం, ఆదివాసీ సంఘాలతో పాటు, అన్ని పార్టీల ఆదివాసీ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఆయా జిల్లాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇది చూడడానికి చిన్న సమస్యలాగే కనిపించినా, ఈ అగ్గిరవ్వే నిప్పు కణికలాగా మారి మొత్తం సమాజాన్నే తగులబెట్టేంతగా చెలరేగే ప్రమాదం కనిపిస్తున్నది.

ఇది ఆదివాసీల ఆత్మగౌరవ సమస్యగా పరిణామం చెందితే, తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లమల ఏజెన్సీ ప్రాంతాలలోని గూడేల నుంచి తొమ్మిది ఆదివాసీ తెగలు ‘చలో రాజ్‌భవన్‌’ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు డిసెంబర్ 9న విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనేది ఆందోళన ఉద్దేశ్యం. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. తమ హక్కులను లంబాడాలే కాల రాస్తున్నారని, తమ అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. ‘నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు, రాజకీయ లబ్ది కోసం సంచారజాతికి చెందిన లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చింది. దీంతో గత యాభై ఏళ్లుగా ఆదివాసులు అన్ని రంగాలలోనూ తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న’ది వారి ఆందోళనకు కారణంగా ఉంది.

పెద్దగా చదువుకోని, చట్టాలపట్ల అవగాహన లేని ఆదివాసీ రాజకీయ ప్రతినిధుల కారణంగా, ఆర్టికల్‌ 342 ప్రకారం పార్లమెంటరీ పక్రియలేవిూ నిర్వహించకుండా, ఏకపక్షంగా లంబాడా, ఇంకా దానితో సారూప్యత కలిగిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. అప్పటి నుంచీ నాటి ఆదివాసీ తెగలకు చెందాల్సిన 4శాతం రిజర్వేషన్లను గత యాభై ఏళ్ళుగా లంబాడా సామాజిక వర్గాలు యథేచ్ఛగా కొల్లగొడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆదివాసులకు న్యాయంగా దక్కాల్సిన భూమి, విద్య, ఉద్యోగ అవకాశాలను దోచుకోవడంతో పాటు, అక్రమ రిజర్వేషన్లు గంపగుత్తగా అనుభవించి ఆర్థికంగా, రాజకీయంగా లంబాడాలు బలపడుతున్నారని వీరు ఆందోళనలు చేపట్టారు. గతంలో అనేకమార్లు ఈ ఆందోళనలు సాగాయి. కానీ ఈసారి అవి కొత్త రూపంలో ముందుకు వస్తున్నాయి.

రాష్ట్రంలోని ఉన్నత వర్గాలకు చెందిన కులాలకు దీటుగా వారు అన్ని డిపార్టుమెంటుల్లోనూ, విశ్వవిద్యాలయాలలోనూ, రాజకీయ పార్టీలలోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత యాభై ఏళ్లుగా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడా సామాజిక వర్గాలు తమకు ఉన్న ఓటు బ్యాంకుతో అన్ని రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తూ ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ రాష్ట్రం లోని తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగ సంఘాలు 2017 డిసెంబర్‌ 9న లక్షలాదిగా హైదరాబాద్‌ తరలివచ్చి తమ నిరసన తెలియచేశాయి. యావత్‌ తెలంగాణ సమాజం మద్దతు పొందాయి. తర్వాత కూడా ఆదివాసీ సంఘాలు ప్రజాసామ్యయుతంగా పలు పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. 2018లో చలో ఢల్లీ పేరుతో ఆదివాసీ ప్రతినిధి బృందం ఢిల్లీలో నిరసనలు చేపట్టాయి. భారత రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాయి. 2019లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాంలీలా మైదానంలో ఆదివాసీ ప్రజానీకం లక్ష మందితో నిర్వహించింది. నాటి ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబూరావు ఆధ్వర్యంలో ఈ తొమ్మిది తెగల ప్రతినిధులు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. సుగాలీ, లంబాడా, బంజరాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342(2) ప్రకారం కలపలేదని అన్ని ఆధారాలను సమర్పించారు. దీని తరువాత కూడా అనేకసార్లు కేంద్ర హోం మంత్రి, గిరిజన సంక్షేమ, న్యాయశాఖ మంత్రులకు నివేదికలు అందజేశారు. అయినా నేటికీ న్యాయం జరగలేదన్నది వారి ఆరోపణ.

ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. లంబాడాల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీలు అటవీ ప్రాంతానికి, లంబాడాలు మైదాన ప్రాంతాలకు చెందిన వారు. క్రమంగా ఆదాసీయేతరులతోపాటు లంబాడాలు ఆదివాసీ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఆదివాసులకు చెందాల్సిన ఏజన్సీ భూములను ఆక్రమించారని తుడుందెబ్బ లాంటి సంస్థ ఆరోపిస్తూ వచ్చింది. ఇవన్నీ కాదనిమైదాన ప్రాంతానికి చెందిన లంబాడా తెగను ఎస్టీలో చేర్చడం రాజ్యాంగ విరుద్దంగా పోరాడుతున్నారు. ఆదివాసీల వాదనలను కూడా ప్రభుత్వాలు వినాలి. హేతుబద్ధమైన ఆలోచన చేయాలి. ఈ ఉద్యమం తీవ్రం కాకముందే ఓ నిర్ణయం తీసుకోవాలి.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News