Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

పార్లమెంటు ప్రజాస్వామిక ఔన్నత్యానికి వన్నె తేవాలి|EDITORIAL

కొత్త భవనంలో పార్లమెంటు ప్రారంభమై రెండేళ్ళైనా, మన పార్టీలు, పాలకులు, నేతల పాత విధానాలు ఏ మాత్రం మారినట్టు లేదు. సరైన చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. ముఖ్యమైన బిల్లులు కూడా మూజువాణి ఓటుతో అమోదమవుతున్నాయి. ఏ ఒక్క అంశంపై కూడా ప్రజాభిప్రాయం ప్రతింబించడం లేదు. ఏకాభిప్రాయం కుదరడం లేదు. సభ అంతా ఏకపక్షంగానే సాగుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఏకస్వామ్యం నియంత్రుత్వానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్యం పజీత అవుతుంది. ప్రస్తుతం సంకీర్ణ యుగమే నడుస్తోంది. ఎదురులేని మెజార్టీ వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇంత దాష్టీకాన్ని ప్రదర్శించలేదు. ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకంగా పని చేశాయి.

ఈ వానాకాలం పార్లమెంటు సమావేశాలు కూడా యథాలాపంగా మొదలయ్యాయి. బీహార్‌ ఓట్ల తొలగింపు, ఆపరేషన్ సిందూర్, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు వంటి అంశాలపై వాయిదా తీర్మాణాలతో సభ వాయిదా పడుతూ లేస్తూ నడుస్తోంది. అధికార పార్టీ చర్చకు అవకాశం ఇవ్వకపోవడం, విపక్షం వాకౌట్ చేయడం, బీహార్ క్షేత్రానికి విపక్షాలు వెళ్ళడం, ఇదే సమయంలో ఈ దేశానికి అతి ముఖ్యమైన బిల్లులు ప్రభుత్వం సభ ముందుకు తేవడంతో, సరైన చర్చ, సూచనలు, మార్పులు లేకుండానే బిల్లులు మూజువాణీ ఓటుతో ఆమోదం పొందడం చకచకా జరిగిపోతున్నాయి. పరస్పర విమర్శలు, సభ బుల్డోజింగ్ సరే, దూషణలు, దూసుకెళ్ళడాలు వంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా విరోధంగా నిరోధంగా మారుతున్నాయి.

ఐదేళ్ళకు మించి శిక్షపడే నేరారోపణలతో జైలులో వరసగా నెల రోజుల పాటు ఉంటే వారి పదవులు అటోమేటిక్ గా ఊడిపోతాయి. దీని పరిధిలోకి ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను తీసుకువస్తూ చేపట్టిన బిల్లు సభలో పెద్దగా చర్చే లేకుండా ఆమోదం పొందింది. ఇది చూడ్డానికి అందరికీ సంబంధించినదిగానే కనిపిస్తున్నది. కానీ దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమే ఎక్కువ. ఓట్ చోరీ ఆందోళనకు విరుగుడుగా, పైగా ప్రతిపక్షాలపై ప్రయోగించడానికే దీన్ని తెచ్చారన్న ఆరోణలు విపక్షాలు చేస్తున్నాయి. నిజానికి ఈ బిల్లు అత్యంత ఆవశ్యమే అయినప్పటికీ, రౌడీలు, నేరస్తులు, అవినీతిపరులు అంతా కలగలిసి పోయి, నేరారోపణలు లేని నేతలే లేకుండా పోయిన ఈ తరుణంలో దీన్ని విపక్షాలు వ్యతేకించడం సహజమే. ఈచట్ట పరిధిలోకి మొత్తం వ్యవస్థను తీసుకు వస్తే బాగుంటుంది. ముఖ్యంగా చట్టసభలు, ఉద్యోగస్వామ్యం, న్యాయవ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్ ను కూడా ఈ చట్ట పరిధిలోకి తెస్తే బాగుంటుంది.

మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టాక చరిత్ర సృష్టించే నిర్ణయాలు తీసుకుంటుందని అంతా ఆశించారు. మూడోదఫాలో మరింత సమర్థంగా, ఉత్సాహంగా పని చేస్తానన్న మోడీ వచనాలు ఎక్కడా ప్రతిఫలించడంలేదు. దేశంలో అభివృద్ది లక్ష్యంగా కార్యక్రమాలు సాగుతున్నాయన్న నమ్మకం కలిగించలేకపోయారు. ప్రజల సమస్యలను విస్తృతంగా చర్చించాలి. ఇందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వడం ద్వారా సమస్యలపై చర్చ జరిపి ఉంటే బాగుండేది. దేశంలో ప్రస్తుత రాజకీయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పటిష్టమైన ఎన్నికల విధానం కూడా అవసరం ఉంది. ఇవన్నీ చర్చించడం ద్వారా నవ భారతానికి శ్రీకారం చుట్టాలి. 370 ఆర్టికల్‌ను రద్ద చేయడం లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మీద ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు ఏమంత పెద్దవి కావు. గవర్నర్ల వ్యవస్థ వల్ల కేంద్ర ప్రభుత్వేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తున్నది. అత్యున్నత న్యాయస్థానంలో ఈ రభస నడుస్తున్నది. నలుగురు హర్షించే నిర్ణయాలు తీసుకోవాల్సిన మోదీ ప్రభుత్వం దానికి భిన్నంగా తమ పార్టీయేతర ప్రభుత్వాలని హరాష్ చేయడానికే ఈ విధంగా చేస్తోందన్న ఆరోపణల నుంచి బయటపడాలి.

దేశహితం కోసం మరిన్ని కఠిన చట్టాలను రూపొందించాలి. చర్చల్లో ప్రజాభిప్రాయం భాగస్వామ్యం రావాలి. ఎన్నికల్లో అక్రమాలు నిరోధించేలా నిర్ణయాలు రావాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలి. వారు అప్పుల్లో కూరుకుపోకుండా బతికేలా నిర్ణయాలు ఉండాలి. అలాంటి ప్రయత్నాలేవీ కానరావడం లేదు. పార్లమెంట్‌, అసెంబ్లీల సీట్ల సంఖ్యను పెంచడం అత్యావశ్యం. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఉన్న జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌ సీట్లు ఉన్నాయి. 542 సీట్లతోనే కొనసాగిస్తున్నాం. వాటిని ప్రస్తుత జనాభాకు అనుగుణంగా పెంచుకోవాల్సిందే. ఒకే దేశం, ఒకే చట్టం కోసం కసరత్తు జరుగుతున్న వేళ ఇలాంటి కీలక నిర్ణయాలు కూడా జరగాలి.

ఏపీలో కాకినాడను ఆనుకుని ఉన్న యానాంను పాండిచ్చేరిలో కాకుండా ఏపీలోనే విలీనం చేయడంపై ఇంత వరకు ఏ ఒక్కరూ ఎక్కడా ప్రస్తావించడం లేదు. పార్లమెంటులో చర్చలు ప్రజా వ్యవస్థలకు మేలు చేసేలా జరగాలి. ఒక సారి ఎన్నికైతే చాలు, ప్రజా ప్రతినిధులుగా కాకుండా, పార్టీల ప్రతినిధులుగా మాత్రమే వ్యవహరిస్తోన్న పార్టీలు, సభ్యుల తీరు మారాలి. సొంత ఎజెండాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలి. అధికారమే పరమావధి కాకుండా ప్రజాసేవ పరమావధిగా పాలన సాగాలి. అంతేగాని గుడ్డిగా వ్యతిరేకించడం విపక్షాలకు తగదు. అలాగే విపక్షాలకు మాట్లాడేందుకు సరైన సమయాన్ని అధికార పార్టీ కేటాయించాలి. అప్పుడే ప్రజాస్వామిక పార్లమెంట్‌ ఔన్నత్యం నిలుస్తుంది.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News