Friday, July 31, 2026
24.6 C
Hyderabad

పాశమైలార ఘటనకు ఎవరు బాధ్యులు!?|EDITORIAL

కంపెనీ సైరన్‌ మోగింది. యథావిధిగా కార్మికులంతా ఉత్సాహంగా తాము రోజూ చేసే పనుల్లో మునిగిపోయారు. వేగంగా పనులు ముగించుకొని, త్వరగా ఇళ్లకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోజులాగానే వీడ్కోలు పలికినా, సాయంత్రానికి మళ్లీ తిరిగి వస్తారన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఇదే వారికి ఆఖరి రోజని వారు ఊహించలేకపోయారు. అదే కడసారి చూపవుతుందని వారు అనుకోలేదు. అనుకోని ప్రమాదం తమ వారిని కబళిస్తుందని వారికేం తెలుసు? ఇప్పుడు తల్లికి పిల్ల, పిల్లలకు తల్లులు, తండ్రులు కాకుండా పోయారు. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోని స్థితిలో వారున్నారు. జరిగిన ఘటనను ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి ఇప్పటి లెక్క ప్రకారం 45 కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? తగు రక్షణ, భద్రత జాగ్రత్తలు తీసుకోకుండా యథాలాపంగా నడిపిన కంపెనీదా? కంపెనీ నిర్లక్ష్యాన్ని చూసీ చూడనట్లుగా వదిలేసిన అధికారులదా? ఇప్పుడు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా, కంటి తుడుపు సహాయాలు పోయిన వారిని తిరిగి ఇవ్వగలవా? అన్యాయమైన ఆ కుటుంబాలను ఆదుకోగలవా?

ఏ ప్రమాదం జరిగినా కంటితుడుపు చర్యలు తప్ప కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. పాశమైలారం ఒక్కటే కాదు, ఇండస్టియ్రల్‌ పార్కుల్లోనే భద్రత డొల్ల అని తేలిపోయింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండానే ఇలాంటి వందల కంపెనీలు నడుస్తున్నాయి. పేరుకే కార్మికశాఖ ఉంది. కార్మికుల గురించి వారు పెద్దగా స్పందించరు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఉన్న అంజయ్య భవన్‌కు వెళితే ఎన్నో దీనగాథలు కనిపిస్తాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందన్నది ప్రాథమిక విచారణ జరుగుతోంది. పేలుడు ధాటికి కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగ భవనం కూలిపోగా, మరో భవనానికి బీటలు వారాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఇక ఇక్కడ కార్మికులే కాదు, అందులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్‌ ప్లాంట్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకున్న మధుర జ్ఞాపకం మరువకుండానే అనంతలోకాలు పోయారు.

మొన్నటికి మొన్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన విషాదం మరువక ముందే ఈ ఘటన జరగడం విచారకరం. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని కార్మిక మంత్రి వివేక్‌ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తుందన్నారు. ఫిర్యాదు చేయడం కాదు…అలా జరుగుతుందా లేదా అన్న విషయం ఆరా తీయాల్సింది కార్మికశాఖనే. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే పౌడర్‌ తయారు చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు రసాయన పరిశ్రమల భద్రతపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడే యాజమాన్యాలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆతర్వాత కొద్ది రోజులకు అంతా మరచిపోతాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. రసాయనాల మధ్య చర్యల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లతో యంత్రాలను తనిఖీ చేయించాలి. జిల్లా అధికారులు పరిశ్రమలను నిర్ణీత తేదీల్లో తనిఖీ చేస్తుండాలి. కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలకు వెళ్తుంటారు. వీరు తనిఖీలు చేసి ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి అనుమతులు ఇస్తుంటారు. క్షుణ్నంగా పరిశీలన చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల నిర్వహణ ఉండాలి. ఇవి కాగితాల్లోనే కనిపిస్తాయి. ప్రతి పరిశ్రమలలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్‌ వాహనాలు, సిబ్బంది ఉండాలి. అంతేకాదు అగ్నిమాపక సిబ్బందిని వారే నియమించుకోవాలి. ఈ కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేయాలి. నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకోవట్లేదు. తక్కువ వేతనాలు ఇస్తూ ఇతర రాష్టాల్రకు చెందిన కూలీలనే పనిలోకి తీసుకుంటున్నారు. చిన్నచిన్న ప్రమాదాల బారినపడి కార్మికులు మృతిచెందిన విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇక నుంచి బంద్‌ కావాలి. క్షేత్ర స్థాయిలో ఒక్కో పరిశ్రమను అడుగడుగునా తనిఖీ చేయాలి. నిపుణుల బృందం పరిశీలించాలి. అప్పుడే ప్రమాదాలను కొంతయినా నివారించగలుగుతామని గుర్తించాలి.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News