Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

పాశమైలార ఘటనకు ఎవరు బాధ్యులు!?|EDITORIAL

కంపెనీ సైరన్‌ మోగింది. యథావిధిగా కార్మికులంతా ఉత్సాహంగా తాము రోజూ చేసే పనుల్లో మునిగిపోయారు. వేగంగా పనులు ముగించుకొని, త్వరగా ఇళ్లకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోజులాగానే వీడ్కోలు పలికినా, సాయంత్రానికి మళ్లీ తిరిగి వస్తారన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఇదే వారికి ఆఖరి రోజని వారు ఊహించలేకపోయారు. అదే కడసారి చూపవుతుందని వారు అనుకోలేదు. అనుకోని ప్రమాదం తమ వారిని కబళిస్తుందని వారికేం తెలుసు? ఇప్పుడు తల్లికి పిల్ల, పిల్లలకు తల్లులు, తండ్రులు కాకుండా పోయారు. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోని స్థితిలో వారున్నారు. జరిగిన ఘటనను ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి ఇప్పటి లెక్క ప్రకారం 45 కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? తగు రక్షణ, భద్రత జాగ్రత్తలు తీసుకోకుండా యథాలాపంగా నడిపిన కంపెనీదా? కంపెనీ నిర్లక్ష్యాన్ని చూసీ చూడనట్లుగా వదిలేసిన అధికారులదా? ఇప్పుడు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా, కంటి తుడుపు సహాయాలు పోయిన వారిని తిరిగి ఇవ్వగలవా? అన్యాయమైన ఆ కుటుంబాలను ఆదుకోగలవా?

ఏ ప్రమాదం జరిగినా కంటితుడుపు చర్యలు తప్ప కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. పాశమైలారం ఒక్కటే కాదు, ఇండస్టియ్రల్‌ పార్కుల్లోనే భద్రత డొల్ల అని తేలిపోయింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండానే ఇలాంటి వందల కంపెనీలు నడుస్తున్నాయి. పేరుకే కార్మికశాఖ ఉంది. కార్మికుల గురించి వారు పెద్దగా స్పందించరు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఉన్న అంజయ్య భవన్‌కు వెళితే ఎన్నో దీనగాథలు కనిపిస్తాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందన్నది ప్రాథమిక విచారణ జరుగుతోంది. పేలుడు ధాటికి కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగ భవనం కూలిపోగా, మరో భవనానికి బీటలు వారాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఇక ఇక్కడ కార్మికులే కాదు, అందులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్‌ ప్లాంట్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకున్న మధుర జ్ఞాపకం మరువకుండానే అనంతలోకాలు పోయారు.

మొన్నటికి మొన్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన విషాదం మరువక ముందే ఈ ఘటన జరగడం విచారకరం. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని కార్మిక మంత్రి వివేక్‌ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తుందన్నారు. ఫిర్యాదు చేయడం కాదు…అలా జరుగుతుందా లేదా అన్న విషయం ఆరా తీయాల్సింది కార్మికశాఖనే. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే పౌడర్‌ తయారు చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు రసాయన పరిశ్రమల భద్రతపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడే యాజమాన్యాలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆతర్వాత కొద్ది రోజులకు అంతా మరచిపోతాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. రసాయనాల మధ్య చర్యల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లతో యంత్రాలను తనిఖీ చేయించాలి. జిల్లా అధికారులు పరిశ్రమలను నిర్ణీత తేదీల్లో తనిఖీ చేస్తుండాలి. కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలకు వెళ్తుంటారు. వీరు తనిఖీలు చేసి ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి అనుమతులు ఇస్తుంటారు. క్షుణ్నంగా పరిశీలన చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల నిర్వహణ ఉండాలి. ఇవి కాగితాల్లోనే కనిపిస్తాయి. ప్రతి పరిశ్రమలలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్‌ వాహనాలు, సిబ్బంది ఉండాలి. అంతేకాదు అగ్నిమాపక సిబ్బందిని వారే నియమించుకోవాలి. ఈ కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేయాలి. నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకోవట్లేదు. తక్కువ వేతనాలు ఇస్తూ ఇతర రాష్టాల్రకు చెందిన కూలీలనే పనిలోకి తీసుకుంటున్నారు. చిన్నచిన్న ప్రమాదాల బారినపడి కార్మికులు మృతిచెందిన విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇక నుంచి బంద్‌ కావాలి. క్షేత్ర స్థాయిలో ఒక్కో పరిశ్రమను అడుగడుగునా తనిఖీ చేయాలి. నిపుణుల బృందం పరిశీలించాలి. అప్పుడే ప్రమాదాలను కొంతయినా నివారించగలుగుతామని గుర్తించాలి.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News