Friday, April 10, 2026
26.7 C
Hyderabad

ఈ ప్రశ్నలకు బదులేవీ!?

యుద్ధాన్ని ఆదిలోనే ఎందుకు అపారు? ఎవరిని అడిగి కాల్పుల విరమణ చేశారు? ఎందుకు పాకిస్తాన్ పై పూర్తిస్థాయి దాడికి పూనుకోలేదు. పాక్‌ జుట్టు మన చేతికి అందే సమయంలో మోడీ ఎందుకు లొంగిపోయారు. మధ్యలో అమెరికా పెత్తనమేంటి? గత పాలకులు ఆ మాటకు వస్తే పాక్ పాలకుల మాదిరిగానే పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీకి, మోడీకి కూడా ఇష్టం లేదా? నేను దాడి చేసినట్లు చేస్తా? నీవు ధ్వంసం జరిగినట్లు గగ్గోలు పెట్టాలని ఏమైనా ముందే నిర్ణయించుకున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు భారత ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై దూసుకు వస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌, ఆనాడు ఇందిరా గాంధీ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదని, నాటి ఆమె ప్రసంగాలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి మోడీ అమెరికా ఒత్తిడికి లేదా పాక్‌కు తలొగ్గారా? ఎందుకు? రాజకీయంగా అంతా అనుమానిస్తున్నట్లు మోడీకి కూడా కలిసి వస్తే మరిన్ని సార్లు అధికారంలో ఉంటే చాలన్న ఆలోచనలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నల పరంపర కొనసాగుతున్నది.

భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండే పాక్ కు భారత్ పట్ల వ్యతిరేకత ధోరణి వేళ్ళూనుకుని, విస్తరించి, వికటించి, విద్రోహంగా మారి ఉగ్రవాద రూపానికి చేరింది. అది పహల్గాం ఉగ్రదాడితో మరోసారి బయటపడింది. అత్యంత అమానవీయంగా, హేయంగా, దయనీయంగా కుటుంబ సభ్యుల ముందే మతం పేరుతో మారణహోమం స్రుష్టించారు. ఇది భారత ప్రజలను ఎంతగానే కలచివేసింది. పాక్ పని పట్టాలన్న కసి పెరిగింది. దీనికి తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వం పాక్ లోని ఉగ్రవాదులును మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. అయితే, పాకిస్తాన్, మన భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను తిప్పి కొడుతూనే, ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూనే, పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలతోపాటు, పాక్ ఎయిర్ బేస్ లను విధ్వంసం చేసింది. త్రివిధ దళాలు ముప్పేట పాక్ పై దాడులు జరిపారు. దీంతో రెండు రోజుల్లోనే పాక్ దిమ్మ తిరిగి, మైండ్ బ్లాక్ అయింది. అమెరికా జోక్యంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు దారి తీసింది. అయినప్పటికీ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉంది.

పాక్ పై ప్రతీకార దాడులు, మన మహిళల పసుపు కుంకుమలను కాలరాసిన ఉగ్రవాదులను అంతం చేయాలన్న పట్టుదల, దేశ భక్తి, దేశాభిమానం, జాతీయత, ఐక్యత, జరుగుతున్న దాడులు వంటి అనేక అంశాలు మరికొన్ని ప్రశ్నలను మరుగున పడేస్తున్నాయి. సందర్భం కాకపోవడంతోపాటు జాతి మొత్తం ఏకతాటిపై ఉండాల్సిన ఈ సమయంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవడమేంటి? మంచో చెడో మనమంతా మన దేశం కోసం నిలవాల్సిన తరుణం ఇది. ఈ దశలో మరుగున పడుతున్న కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం.

పహల్గాం ఘటన మన ఇంటలీజెన్స్ వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతంలో అంత స్వేచ్ఛాయుతంగా ఎందుకు వదిలేశారు? యధేచ్చగా ఉగ్రవాదులు దేశంలోకి జొరబడుతుంటే ఇంటలీజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ అధునాతన ఆయుధ, కమ్యూనికేషన్, సాంకేతిక వ్యవస్థ అప్పుడు ఎందుకు పని చేయలేదు? పహల్గాం ఘటనను ముందే పసిగట్టలేకపోవడం అటుంచితే, ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరిన మన భద్రతాదళాలు ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయాయి? అంతెందుకు ఆ ఉగ్రవాదులు దేశం విడిచిపోయే పరిస్థితి వరకు ఏం చేసినట్లు?

ఇక ఘటన జరిగిన తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల్లో జరిపిన దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని మనం చెప్పుకుంటున్నాం. సరే, ఆ చనిపోయిన 100 మంది ఉగ్రవాదుల్లో పహల్గాం దాడికి బాధ్యులైన నలుగురు ఉన్నట్లా? లేనట్లా? మన ప్రతీకారం మొదటగా పహల్గాం ఘటనకు బాధ్యులైన ఆ నలుగురు ఉగ్రవాదులపై, తర్వాత ఉగ్రవాదంపై లేదా ఉగ్రవాదులపై, ఆ తర్వాత ఆ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై. ఇప్పుడు జరిపిన దాడులు, తర్వాత పరిణామాలు మన మొదటి టార్గెట్ ని మిస్సైనట్లుగా అనిపిస్తున్నది. పోనీ, ఉగ్రవాదులు చనిపోయినప్పటికీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ను కట్టడి చేయడానికి చేసిన దాడుల్లో పాక్ ఏమైనా పరివర్తనను పొందిందా? అంటే అదీ లేదు. యుఎస్ జోక్యం కోసం కాళ్ళు పట్టుకున్న పాకిస్తాన్, కాల్పుల విరమణ ప్రకటించిన మరు క్షణం నుంచే తిరిగి భారత్ పై డ్రోన్ తదితర దాడులకు పాల్పడుతున్నది. అంటే ఇంత జరిగినా పాక్ లో మార్పులేదు. పాకిస్తాన్ మారలేదు. సరికదా, అదే తెగబాటు వ్యక్తమవుతున్నది. స్పష్టంగా కనిపిస్తున్నది.

అంతర్జాతీయ ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారిన పాక్ లో ఏ మార్పూ లేనప్పుడు, రానప్పుడు దానికి తగిన గుణపాఠం చెప్పితీరాలన్నదే ప్రస్తుతం సగటు భారతీయుడి ఆవేదన. కానీ, యుద్ధ రీతి, నీతి, అంతర్జాతీయ నిబంధనలు, నియమాలు, ఒత్తిడిలు, అవసరాలు, మర్యాదలు… ఇలా అనేక అంశాలపై ముడిపడి అంతర్జాతీయ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఆ రకమైన కాల్పుల విరమణపై సగటు భారతీయుడికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, భారత్ నుండి పాక్ విడి వడినప్పటి నుండీ ముడి వీడని పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్యకు పరిష్కారమే లేకపోవడంపై భారత పౌరుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పీఓకే కారణంగా అశాంతి, అల్లర్లు, ఉగ్రవాదం, మానవ హోమం కేవలం భారత్, పాక్ విభజన రేఖ వెంటే గాక, భారత దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు దారి తీస్తున్నది. ఇప్పటిలాగే, గతంలోనూ చేతికి అందివచ్చిన అవకాశాలు చే జారిపోతున్నాయి. తరతరాలుగా ఇది ఇంకెంత కాలం?

ఇది మన సైన్యానికి మద్దతుగా నిలవాల్సిన సమయం. ఆరోపణలు, విమర్శల సందర్భం కాదు కానీ, ఇటు భారత, అటు పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, అపనమ్మకాలకంటే కూడా అనుమానాలెక్కువగా ఉన్నాయి. ఈ రెండు దేశాల రాజకీయ వ్యవస్థలకు ఓట్లు కురిపించే కల్పతరువుగా పీఓకేకు ముద్ర పడింది. దేశభక్తి, జాతీయత, ఐక్యత, భావోధ్వేగాలతో కూడిన ఈ సున్నిత సమస్య కాస్త రెచ్చితే చాలు ఆ సాకుతో ప్రజల ఓట్లు అనుకూలంగా రాలుతాయని రాజకీయ పార్టీల, ప్రజలకు కూడా ఏర్పడిన నమ్మిక. అందుకని పీఓకే సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాల్లో రాజకీయపార్టీలకు అస్సలు ఇష్టం ఉండదని ప్రజల్లో బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. నిజానికి రాజకీయ పార్టీల, నాయకుల ఆరోపణలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు పట్టించుకోవాల్సింది పార్టీల ఆరోపణలను కాదు. ప్రజల అనుమానాలను. వాటిని నివృత్తి చేయడం ఎలా? అన్నదానిపై దృష్టి సారించాలి. ఆ విధంగా ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News