Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

భరత మాత నుదుట “సిందూరం”!

సగం ప్రపంచం నిద్రపోతున్నది. మిగా సగం తమ పనుల్లో నిమగ్నమై ఉంది. నిద్రలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలవదు. పనిలో ఉన్న మిగతా ప్రపంచం గుర్తించలేదు. సరిగ్గా పహల్గామ్‌ దాడి జరిగిన 15 రోజులకు అర్ధరాత్రి వేళ – భారత ప్రతీకారాగ్నికి ప్రత్యర్థి పాక్‌ గగన తలం “సింధూర” కాంతులతో ఎరుపెక్కింది. పాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో టెర్రరిస్టులు దాక్కున్న తొమ్మిది కలుగుల్లోకి దూరి భారతీయ విస్ఫోటక అస్త్రాల్రు నేలమట్టం చేశాయి. అర్ధరాత్రి చిమ్మచీకట్లో శత్రుభూమిలో కనీసం కాలు పెట్టకుండా, నిప్పులు కురిపిస్తూ భారత్‌ జరిపిన ఈ దాడి తెల్లారేసరికల్లా తెలిసి, యావత్తు ప్రపంచం ఉలిక్కి పడింది. పాక్ వెన్నులో వణుకే పుట్టింది. ఉన్మాదుల కాల్పుల్లో తమ భర్తల్ని కోల్పోయిన భారత స్త్రీలు- భారత అస్త్రాలు రగిల్చిన సింధూర కాంతుల్న చూసి గర్వంతో ఉప్పొంగే వుంటారు.

చరిత్రాత్మక ఈ భారత ప్రతీకార దాడికి ప్రపంచదేశాలన్నీ దన్నుగా నిలిచాయి. భారత్‌ ను దోషిగా నిలబెట్టాలని చివరి క్షణంలో పాకిస్తాన్‌ భద్రతాసమితిలో చేసిన దింపుడుకల్లం ప్రయత్నం బెడిసికొట్టింది. ఒక్కదేశం కూడా పాక్‌ తో కలిసి రాలేదు. రెండువారాల పాటు అందరి మద్దతు కూడగట్టి, పటిష్టమైన నిఘా, యుద్ధ వ్యూహం పన్ని, నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరు పెట్టారు. మిగతా కార్యాన్ని మన త్రివిధ దళ సేన అత్యంత పకడ్బందీగా నిర్వహించిన తీరు అభినందనయం. ఈ దాడితో, మతం పేరిట జరిపిన మారణహోమంలో నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందూ పర్యాటకుల ఆత్మలు శాంతించాయనే భావిద్దాం.

ఇంతటితో ఆగక ఇంకా దుస్సాహసానికి దిగితే సర్వనాశనం తప్పదని అమెరికా చేసిన హెచ్చరికతో కూడిన హితవుకి పాక్ తల ఒగ్గిందా సరే. లేదంటే మళ్ళీ కల్లో కూడా వూహించడానికి భయంతో చచ్చేలా గుణపాఠం చెప్పడానికి భారతీయ సేనలు సరిహద్దుల్లో మోహరించి సిద్ధంగా ఉన్నాయి. మతోన్మాదుల రక్తంతో బాధిత మహిళల నుదుట తిలకం దిద్దిన సైన్యం సాహసానికి వందనం.

మొత్తంగా కొందరు అనుకున్నట్లుగా ఆలస్యం లేకుండానే.. భారత్‌ గర్జించింది. తన సత్తా ఏమిటో లోకానికి చాటింది. మనమేంటో మరోమారు పాక్‌కు రుచి చూపింది. పాక్ పెంచుతున్న ఉగ్రమూకల పుట్టలను పటపటా పగులగొట్టింది. ఉగ్రస్థావరాలు లక్ష్యంగా చేసిన మెరుపుదాడితో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అయింది. 9చోట్ల జరిపిన దాడులతో వందకు పైగానే ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గత పాలకులు దూరదృష్టి లోపం వల్ల పాక్‌తో నిరంతరంగా ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తోంది. నాకేం తెలియదని నంగనాచి కబుర్లు చెబుతోంది. అప్పట్లో జరిగిన యుద్దాల్లో పాక్‌ను దయతలచి వదిలి పెట్టడం జరిగింది. ఏకుమేకు అయినట్లు పాక్‌ పక్కలో బల్లెంగా మారింది. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. ఆనాడే 90వేల మది సైన్యం భారత్‌ చేతికి చిక్కినా.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గురించి పట్టుబట్టలేదు. అనేక విషయాలను అలాగే వదిలేశాం. ఇలా చేయడంతో ఇంతకాలం మనం ఎన్నో ఉగ్రదాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోపక్క భారత్‌ను చీల్చుకుని పుట్టుకొచ్చిన పాక్‌, బంగ్లాలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన వ్యవహరిస్తున్నాయి. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ‘ఆపరేషన్‌ సింధూర్‌’ను అమలు చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు, పాక్‌ భూభాగంలోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడి దాడులు చేసింది. నిమిషాల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అందరూ నిద్రపోతున్న వేళ..ఎలాంటి అలజడి లేకుండా భారత సైన్యం పని పూర్తి చేసింది. కానీ, ఇది ఇంతటితోనే ఆగుతుందని అనడానికి లేదు. పాక్‌ నుంచి వచ్చే ప్రతిస్పందన ఆధారంగా మన దాడులు మరింతగా ఉండే అవకాశం లేకపోలేదు.

370 ఆర్టికల్‌ రద్దు తర్వాత కశ్మీర్ లో ప్రశాంత వాతావణం ఏర్పడి, పర్యాటకం మళ్లీ పురివిప్పింది. దీనిని చెడగొట్టే లక్ష్యంతో పాక్‌ కుట్రలు పన్నుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతోంది. ఉగ్రవాదాన్ని ఉసి గోల్పుతోంది. ఈ వరసలో జరిగిన దాడే పహల్గామ్‌ ఊచకోత. ఈ దాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని భారత్ జరిపిన ప్రతిదాడుల హెచ్చరికతో పాక్‌ దారికి రావాలి. లేకుంటే ప్రపంచ పటంలో పాక్‌ ఆనవాళ్లు కూడా ఉండవని గుర్తించాలి.

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News