Friday, July 17, 2026
24.5 C
Hyderabad

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR

హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చైర్మన్, సాంస్కృతిక, పర్యాటక, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ శాఖల మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఓఎస్డీ  డా. ఎస్.ఎం. రాజేశ్వర్ రావును తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా  సత్కరించి, పురస్కారం అందజేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో భారత రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. అనంత‌రం విశిష్ట సేవలందించిన వైద్యులు, అత్యధిక సార్లు రక్తదానం చేసిన దాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారత రెడ్‌ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖకు విశేష సహకారం అందించిన సంస్థల ప్రతినిధులను గవర్నర్ సత్కరించారు.

స్వచ్ఛంద రక్తదానోద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో, అవగాహన కల్పించడంలో డా. రాజేశ్వర్ రావు చేస్తున్న కృషికి, ఆయనను “హయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు–2026″కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.

డా. రాజేశ్వర్ రావు నాయకత్వంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. 2023 మార్చి నుంచి 2026 మే వరకు 113 రక్తదాన శిబిరాలను నిర్వహించి 8,279 యూనిట్ల రక్తాన్ని సేకరించగా, ఆ రక్తం తలసేమియా, క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగపడింది. అలాగే 467 ఉచిత వైద్య శిబిరాల ద్వారా 24,142 మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 20 సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమాల ద్వారా 1,865 మందికి శిక్షణ కల్పించారు. శామీర్‌పేటలో వృద్ధుల కోసం ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్, బోయిన్‌పల్లిలో మిస్రీలాల్ మంగీలాల్ మాతా-శిశు వైద్యశాలని నిర్వహిస్తూ పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. వీటితో పాటు టీబీ ముక్త్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకం నమోదు, వరద బాధితులకు సహాయక చర్యలు, యువ రెడ్ క్రాస్ వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, శాంతి భద్రతల విభాగం డైరెక్టర్ జనరల్  మహేష్ భగవత్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి, సీఈఓ ప్రొఫెసర్ శ్రీరాములు, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, లార్వెన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ విహార్, సీఈఓ  రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News