Friday, April 10, 2026
26.7 C
Hyderabad

Greenary| పచ్చదనం, Women empowerment| మహిళా సాధికారత మా telangana government| ప్రభుత్వ బాధ్యత

వన మహోత్సవం–2025 ప్రారంభోత్సవంలో CM|సీఎం Revanth Reddy| రేవంత్ రెడ్డి

Rangareddy District| రంగారెడ్డి జిల్లా, rajendranagar|రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో|university వన మహోత్సవం–2025ను రుద్రాక్ష మొక్క నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణపై ప్రజల బాధ్యతను గుర్తుచేస్తూ, మహిళల సాధికారతపై ప్రభుత్వ కృషిని గురించి వివరించారు. వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పినట్లుగా ప్రకృతి మన జీవనంలోని అంతర్భాగమని సీఎం అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుననుసరించి, ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని, అలాగే అమ్మలు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలి. వాటిని మీ పిల్లల్లా సంరక్షించండి. అప్పుడు మాత్రమే తెలంగాణ పచ్చదనంతో నిండుతుంది అని సీఎం అన్నారు.

మహిళా సాధికారత విషయానికొస్తే, రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యత, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామని తెలిపారు. ఇది మహిళలకు ఆర్థిక, సామాజిక స్వావలంబనకు దోహదం చేస్తుందన్నారు. ఆర్టీసీ ప్రయాణాల్లో ఉచిత సౌకర్యం కల్పించడం ద్వారా మహిళల చలనం పెరిగిందని, అదే సమయంలో 1,000 బస్సులను మహిళల చేత అద్దెకు తీసుకుని, వారిని యజమానులుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించామన్నారు. హైటెక్ సిటీలో ఉన్న విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉన్న ప్రాంతాల్లో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. పట్టణాల్లో నివసించే మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు గౌరవంగా బతకేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ అమలు కానుందనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు మహిళలకు కేటాయించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని సీఎం ప్రకటించారు. సమాజానికి మంచి జరగాలంటే ప్రకృతితో పాటు మహిళల స్థానం అభివృద్ధి చెందాలన్నదే ఈ వనమహోత్సవం సందేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత పరంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంగా తెలిపారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News