Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ

మన ప్రజా పాలనకు ప్రజల ఆదరణ

నిజామాబాద్‌ రైతు మహోత్సవ సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

#congress #telangana #tpcc

నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన రైతు మహోత్సవ సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా నిలుస్తుందని, రైతుల కోసం సమర్పిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తోందని వెల్లడించారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, లక్షన్నర కోట్లు గోదావరిలో పోసిన పాపం పూర్తిగా కేసీఆర్‌దే అని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్వ వైభవాన్ని పునరుద్ధరించగల పార్టీ కాంగ్రెస్‌ మాత్రమెనని పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులపై ఉందని పేర్కొంటూ, వారి నైతిక, పాలనాపరమైన బాధ్యతను గుర్తు చేశారు.

నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలకు, సామరస్యానికి మారుపేరుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నాటికే పార్టీ భిన్నతలు ఉంటాయని, కానీ ఎన్నికల అనంతరం జిల్లా అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు రావలసిన నిధులు, ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకోవాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు.

రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది రైతులను ఎంపిక చేసి విదేశాలకు తీసుకెళ్లి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించేలా మంత్రి చొరవ తీసుకోవాలని సూచించారు.

ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే, సన్న బియ్యం పంపిణీ వంటి చారిత్రాత్మక పథకాలను కొనసాగిస్తోందని తెలిపారు. దీనిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ముందుండి అమలు చేస్తున్నారు. ధనిక, పేద తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఈ పథకం లబ్ధి చేకూరుస్తోందని వివరించారు.

రానున్న రోజుల్లో ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ లాగా మాట ఇచ్చి మోసం చేసే పద్ధతికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాంగ్రెస్ ధర్మమని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ డీ-సెడ్మెంటేషన్ ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్‌ అయిన శ్రీరాంసాగర్‌ను కూడా డీ-సెడ్మెంటేషన్ చేస్తే అదనంగా రెండు లక్షల ఎకరాలకు పైగా నీరు లభిస్తుందని వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలంగా మారిందని, ఆంధ్ర ప్రాంత రైతులు వలసలు కూడా వచ్చారని గుర్తు చేశారు.

ఈ విధంగా సస్యశ్యామలానికి పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాకు పునరుత్థానం, పూర్వవైభవం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News