Friday, May 29, 2026
33.2 C
Hyderabad

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే అప్రతిష్ట!|EDITORIAL

వారం రోజులుగా పార్లమెంటులో అదే తంతు. చర్చ లేకుండానే రచ్చ రచ్చై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. సమస్యలపై చర్చించాలన్న ఆసక్తి అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీలకు లేకుండా పోయింది. సభ ప్రారంభం కాగానే చర్చకు పట్టుబట్టి గొడవ చేయడం విపక్షాల వంతైతే, చర్చకు అవకాశమే లేకుండా చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారింది. వాయిదా వేయడం స్పీకర్‌ విధిగా మారింది. సోమవారం కూడా ఇదే తరహాలో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారులమన్న సంగతిని మరిచిన సభ్యులు, పార్లమెంటును అధికార ప్రతిపక్షాల పట్టువిడుపులు లేని యుద్ధ వేదికగా చూస్తున్నట్లుగా ఉంది. పార్లమెంటులో అధికార, విపక్షాలు కాదు ప్రజలను గెలిపించాలి. ప్రజల మనసులు గెలిచే విధంగా ప్రవర్తించాలి. సమస్యలను చర్చించి పరిష్కరించాలి. ప్రజా సమస్యలను చర్చించి, పరిష్కరించే పవిత్ర వేదిక పార్లమెంటు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ పార్లమెంటు. కానీ ప్రతిష్టంభనల వేదికగా మారుతోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్కటంటే ఒక్క సమస్యపై కూడా చర్చ జరగని దుస్థితి నెలకొంది.

ఈ నెల 21న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమ య్యాయి. ఎలాంటి అంశమైనా సరే, చర్చించడానికి సిద్దమని అధికార పక్షం చెబుతున్నా, విపక్షాలకు మాత్రం ఆ అవకాశమే ఇవ్వడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పార్లమెంట్‌ సమావేశాలు అధికారంలో ఉన్న ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. ఇదేదో అధికార, విపక్షాల సమస్యగా చూస్తున్నారు. 140 కోట్ల భారత ప్రజలంతా ఆందోళనలతో ఉన్నా పట్టించుకోవం లేదు. వరదలతో దేశం అతలాకుతలం అవుతోంది. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా మారింది. భారత ప్రజాస్వామిక రాజకీయాల్లో వ్యక్తి స్వామ్యం, నిరంకుశత్వం రోజురోజుకు ప్రబలిపోతోంది. పార్లమెంట్‌, అసెంబ్లీల్లో ప్రజల సమస్యల పై చర్చ జరగడం లేదు. అధికార విపక్షాలు ఇదేదో తమ సొంత జాగీరుగా భావించి.. సమావేశాలను నడుపుకుంటున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇదే తంతు సాగుతోంది. బీజేపీ అధికారం చేపట్టిన తరవాత ఈ వ్యవహారం బాగా ముదిరింది. సమస్య ఏదైనా పార్లమెంటులో చర్చకు రావడం లేదు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఇదే పద్ధతి సాగుతోంది.

అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎజెండాతో పనిచేయడం వల్లనే ఇలా జరుగుతోంది. పార్లమెంటు ప్రజలు ఎజెండాగా పని చేయాల్సిన వేదిక. అయితే అది రాజకీయ పార్టీల జెండాల ఎజెండాగా మారిపోతోంది. దేశంలో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ పెంపు, వరదలు, నిరుద్యోగం లాంటి అంశాలపై చర్చించి జవాబివ్వాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రవేశ పెడుతున్న వాయిదా తీర్మానాలను సభాపతులు బుట్టదాఖలు చేస్తున్నారు. కనీసం సభా వ్యవహారాల కమిటీ సమావేశాల్లో కూడా కీలక అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం మనస్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తొలి రోజు నుంచీ ప్రధాని మోడీ కూడా సభ సజావుగా సాగాలని, ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఉందని అంటున్నారు. అయితే పార్లమెంట్‌ సమావేశమైన తర్వాత అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం కనపడడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగినప్పుడల్లా అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎక్కడుందన్న అనుమానం కలుగుతుంది.

నిజానికి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకునే వీలున్న అద్భుతమైన ప్రచార, ప్రసార వేదిక పార్లమెంటు. అదే పార్లమెంటు వేదికగా ప్రజల సమస్యలను లేవనెత్తి, వాటికి సమాధానాలు రాబట్టి, పరిపాలనను సరైన గాడిలో పెట్టేందుకు ప్రతిపక్షాలకు అరుదైన వేదిక కూడా. ప్రజల తరపున ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపి, ప్రజాకోర్టులో నిలిపే వేదిక. కానీ భారత ప్రజాస్వామ్యంలో అధికారు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటును తమ సొంత అభిప్రాయాలకు వేదికగా మలచుకుంటున్నారు. సభా నిబంధనలను తమకనుగుణంగా, అనుకూలంగా వాడుకుంటున్నారు. నిజానికి చట్టసభల్లో ప్రజా సమస్యలను చర్చించేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వారు సమస్యలను ప్రస్తావిస్తే చర్చించాలి. చర్చల ద్వారా ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే చట్టసభలకు విలువ ఉంటుంది. గతంలో ఎప్పుడూ చర్చలకు ప్రాధాన్యం ఉండేది. సమస్యలపై తక్షణ చర్చలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టసభల గౌరవం ఇనుమడించేలా అధికార విపక్షాలు పని చేయాలి. చట్టసభలను పాలకులే ఎక్కువగా గౌరవించాలి. ప్రజల సమస్యలపై చర్చించడం అలవాటు చేసుకోవాలి. పార్లమెంట్‌ను నడిపించేందుకు రాజనీతిజ్ఞత అవసరం. మనం ఉన్నదే ప్రజల కోసం అన్న కోణంలో అధికార పక్షం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా నిరంకుశంగా వెళితే ఎంతటి వారికైనా ప్రజలు శిక్ష వేయక మానరు. మళ్లీ మాదే అధికారం అన్న అహంకార ధోరణి పనికిరాదు. పదేళ్లపాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ అదే రీతిలో ప్రవర్తించి ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయింది. బీజేపీ కూడా ఇదే ధోరణితో సాగితే ప్రజలు కాంగ్రెస్ కు పట్టిన గతినే పట్టిస్తారని గుర్తించాలి. అధికార ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.

Latest News

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

28-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు.ద్వాదశి ఉదయం 08.17 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం చిత్త ఉదయం 08.50 వరకు ఉపరి స్వాతి యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.20 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 08.17...

గాలి మేడలు!?|ADUGU TRENDS

ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది?...

‘ఎబోలా’ మళ్ళీ ముప్పేనా!? ఎలా?|EDITORIAL

కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్‌లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో...

27-05-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం-శుక్లపక్షం తిధి శు ఏకాదశి ఉదయం 07.43 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం హస్త ఉదయం 07.33 వరకు ఉపరి చిత్త యోగం వ్యతీపాత రాత్రి తెల్ల 04.33 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం...

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News