రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల కోసమే తపిస్తున్నారు
ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రజా పాలన పథకాలను పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో తొర్రూరు మండలంలో ఖానాపూర్ గ్రామంలో, రాయపర్తి మండలంలో మహబూబ్ నగర్ గ్రామంలో, కొడకండ్ల మండలంలో నీలి బండ తండా, పాలకుర్తి మండలంలో తీగారంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, తొర్రూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పథకాలను లబ్ధిదారులకు అందజేసి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ … రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డుల పథకాలు. ఇవి పేద ప్రజల అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యంగా అమలు చేయబడ్డాయన్నారు. “ఈ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు సహాయం అందిస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే, “ఇందిరమ్మ ఇండ్లు అనగా నిరాశ్రయులను గృహ పరిరక్షణకు లక్ష్యంగా రూపొందించబడ్డాయి, ఇది లక్షలాది పేద ప్రజల జీవితాల్లో కొత్త ఆశలను నింపుతుంది” అని అన్నారు.

రేషన్ కార్డులు కూడా ప్రజల కోసం ప్రభుత్వ పెద్ద ఆహార భద్రత పథకంగా రూపుదిద్దాయన్నారు. ఈ పథకం ప్రతి పేద కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని, వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాలు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చినట్లు, రాష్ట్రీయ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందడుగు వేసినట్లు చెప్పారు. వారు చెప్పినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ తమ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడంతోపాటు, సమాజంలో సామాజిక సమానత్వాన్ని కూడా పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


