CM REVANTH REDDY| సీఎం రేవంత్ కు KTR| కేటీఆర్ సవాల్
Telangana| తెలంగాణ politics|రాజకీయాలలో మరోమారు heat|హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై BRS| బీఆర్ఎస్ WORKING PRESIDENT| వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమంపై ఎవరు ఎంత చేశారో ఓపెన్ డిబేట్కు సిద్ధమని ప్రకటించిన కేటీఆర్, రేవంత్ రెడ్డికి చర్చకు రావాలని సవాలు విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు SOMAJI GUDA| సోమాజీగూడ PRESS CLUB| ప్రెస్ క్లబ్లో ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి 72 గంటల |HOURS సమయం ఇస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి తగిన PREPERATION| ప్రిపరేషన్తో చర్చకు రావాలని స్పష్టం చేశారు.
రైతు సమస్యలపై సీఎం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టిన కేటీఆర్, “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శూన్యం పెట్టింది. రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టే దిశగా ముందుకెళ్తోంది. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసిన వ్యక్తి అయితే, రేవంత్ రెడ్డి దానికి గుణపాఠమే చెప్పలేని నాయకుడు అని విమర్శించారు. రైతుల హక్కులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం కాదని, ఆయన కేంద్రంలోని చంద్రబాబు నాయుడు కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు, చంద్రబాబు పాలన సాగుతోంది. సీఎం కుర్చీలో రేవంత్ కూర్చొన్నా, మాటల వెనుక నడుస్తున్నది ఆంధ్ర పరిపాలనే అని అన్నారు. రేవంత్ రెడ్డిను ‘పేటీఎం’ మాదిరిగా పేర్కొంటూ, పే-సీఎం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అందించిన ఉద్యోగాలను తానే ఇచ్చినట్లు మాట్లాడడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
ఉద్యోగాలపై అసలైన చర్చకు రావాలంటే, అశోక్ నగర్లో నిరుద్యోగుల మధ్య రేవంత్ సిద్ధంగా రావాలని కేటీఆర్ సవాలు విసిరారు. అలాగే, రైతు సమస్యలపై చింతమడక, కొండారెడ్డిపల్లె అయినా సరే.. ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. నిజం ఒప్పుకోని వాడిని నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారు. ఆయన మాటలకు గాను తెలంగాణ ప్రజలతో మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా, కేవలం వాగ్దానాలతోనే నిలిచిపోయిందని, నాలుగు వేల రూపాయల పెన్షన్, రూ.2,500 ఆర్థిక సహాయాన్ని ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ కూడా గెలవలేని కాంగ్రెస్ ప్రభుత్వం వంద సీట్లు గెలవగలదా? అని ప్రశ్నించారు. వంద గెలవాలంటే ప్రజలు ఓట్లు వేయాలనేదే పెద్ద ప్రశ్నని అన్నారు.
రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని చెప్పే రేవంత్ బేసిన్ తెలియని వ్యక్తి. బెండకాయ, ఎరువుల గురించి కూడా తెలియదు అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, మత్స్యసంపదలో కేసీఆర్ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ నేతలు హారతులు పట్టి ఆంధ్రకు నీరు పంపారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

