Tuesday, June 9, 2026
28.2 C
Hyderabad

KCR|కేసీఆర్ ‘గూడు’ పుఠాణి !?

అధికార దాహం ! ఆధిపత్య పోరాటం !!
KCR|కేసీఆర్ అసమర్థతా?
KTR|కేటీఆర్ ఆధిపత్యమా?
పార్టీపై పెత్తనమా?
పంపకాల పేచీనా?
KAVITA KALVAKUNTLA|కవిత ఆరోపణల్లో ఔచిత్యమేమిటి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌|ANDHRA PRADESH లో కూడా తెలంగాణ|TELANGANA ఎప్పుడూ ఇంతగా దోపిడీకి గురికాలేదు. ఉమ్మడి ఏపీని పాలించిన నేతలు కూడా ఎప్పుడూ ఇంతగా తెలంగాణను దగా చేయలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి కూడా మిగులు బడ్జెటే తప్ప అప్పుల కుప్ప కాలేదు. ఎప్పుడూ పదేళ్ళపాటు ఒక్క కుటుంబం గుప్పిట్లోనే అధికారం ఉండిపోలేదు. ప్రజల ప్రాణాల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దగాపడ్డది. దోపిడీకి గురైంది. ఇది ముమ్మాటికీ గణాంకాలు చెబుతున్న నిజం. కళ్ళ ముందే కనిపిస్తున్న సత్యం. ‘అప్పులు తెచ్చాం ఆస్తులు పెంచాం’ అంటున్న వాళ్ళ ఆస్తులు పెరిగి, అప్పులు ఎందుకు తగ్గాయి? కుటుంబానికి ఒక నీతి, ప్రభుత్వానికి ఒక నీతి ఉంటుందా? కుటుంబానికి కంటే కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి కదా? విచిత్రమేంటంటే, ఇదంతా ఒక్క కల్వకుంట్ల కుటుంబం వల్లే జరిగిందని ఢంకా బజాయిస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ…రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, మరి కేసీఆర్ కుటుంబ అవినీతిని వెలికి తీసే పనికి నేటికీ ఎందుకు పూనుకోలేదు? కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని, దాచుకున్నదనే ఆ రెండు పార్టీలు ఆ ఆరోపణలను రుజువు చేసే పనికి ఏనాడూ ఎందుకు ఉపక్రమించలేదు. అంటే వాళ్ళంతా ఒక్కటే. ఆ బీఆర్ఎసే కాదు, బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఆ తాను ముక్కలే? పరస్పరం దూషించు కుంటాయే తప్ప దోషిత్వాన్ని నిరూపించవు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవు.

ఉద్యమకారులు, ప్రజాదరణతో నిలిచిన బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీగానే మిగిలిందన్నది అంగీకరించి తీరాల్సిందే. ఆ పార్టీకి కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలే మూడు మూల స్తంభాలు. HARISH RAO|హరీశ్ రావు, SANTOSH KUMAR|సంతోశ్ రావులు సపోర్ట్ పిల్లర్లు.

కేసీఆర్ కుటుంబ అంతర్గత తాజా ఎపిసోడ్‌ కేవలం రాజకుటుంబాల్లో జరిగే అధికారం, ఆధిపత్యం, పంపకాల పోరాటం లాంటిదే. ఈ కుట్రలు, కుతంత్రాల తెగబాటు కూడా అందులో భాగమేనని భావించాల్సి వస్తున్నది. అధికారం లేకపోతే ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి కేసీఆర్ కుటుంబం చేరిందని, అందుకోసం ఎంతకైనా తెగిస్తారనే అభిప్రాయం తాజా పరిణామాలను బట్టి బలపడుతోంది.

అధికార దాహం ! ఆధిపత్య పోరాటం !!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణ ఎప్పుడూ ఇంతగా దోపిడీకి గురికాలేదు. ఉమ్మడి ఏపీని పాలించిన నేతలు కూడా ఎప్పుడూ ఇంతగా తెలంగాణను దగా చేయలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి కూడా మిగులు బడ్జెటే తప్ప అప్పుల కుప్ప కాలేదు. ఎప్పుడూ పదేళ్ళపాటు ఒక్క కుటుంబం గుప్పిట్లోనే అధికారం ఉండిపోలేదు. ప్రజల ప్రాణాల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దగాపడ్డది. దోపిడీకి గురైంది. ఇది ముమ్మాటికీ గణాంకాలు చెబుతున్న నిజం. కళ్ళ ముందే కనిపిస్తున్న సత్యం. విచిత్రమేంటంటే, ఇదంతా ఒక్క కల్వకుంట్ల కుటుంబం వల్లే జరిగిందని ఢంకా బజాయిస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ… ఆరోపిస్తున్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, కేసీఆర్ కుటుంబ అవినీతిని వెలికి తీసే పనికి నేటికీ పూనుకోలేదు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని, దాచుకున్నదనే ఆ రెండు పార్టీలు ఆ ఆరోపణలను రుజువు చేసే పనికి ఏనాడూ ఉపక్రమించలేదు. ఆ బీఆర్ఎసే కాదు, బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఆ తాను ముక్కలే?

కాళేశ్వరం ప్రాజెక్టు నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌కు ఎటిఎం లాగా మారిందని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పదేపదే ఆరోపించిన వారు, ఏ చర్యా తీసుకోలేదు. అసెంబ్లీ సాక్షిగా అప్పుల లెక్కలు చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏ చర్యా చేపట్టలేదు. అంటే రాజకీయ పార్టీలన్నీ ఒక్కటే. పరస్పరం దూషించు కుంటాయే తప్ప దోషిత్వాన్ని నిరూపించవు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవు.

కేసీఆర్‌ కుటుంబం ఉద్యమకారులకు, త్యాగాలు చేసిన కుటుంబాలకు ద్రోహం చేసిందని ఉద్యమకారులే పదే పదే అంటున్నారు. అప్పులు చేసి ప్రజలను కూడా దగా చేసిందని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తున్నది. మరి ఇంతగా తెలంగాణను దగా చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఆపార్టీలో కూడా కాదు కేవలం ఆ కుటుంబంలోనే అధికారం, ఆధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరాటమే తప్ప మరేమీ కాదని, కవిత తిరుగుబాటు తర్వాత పరిణామాలను బట్టి ప్రజలకు అర్థమవుతున్నది. అందుకే ఇదంతా తమకు సంబంధం లేని అంశంగా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇక ఎదుటి పార్టీల్లో చిచ్చుపెట్టి, విలీనం చేసుకోగలిగిన కేసీఆర్, సొంత ఇల్లునే చక్కబెట్టుకోలేని స్థితిలో ఉన్నారా? ఆయన అంతగా అసమర్థ నేతా? ఉద్యమ సమయంలోనే చీటికి మాటికి అలిగి ఇల్లు కదలని కేసీఆర్, సీఎం అయ్యాక సెక్రటేరియట్ కు కూడా రాకుండా, ప్రగతి భవన్ నుంచి పాలన చేశారు. పదవి పోయాక ఇప్పుడు ఎర్రవెల్లి ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. ఇదంతా కేటీఆర్ వల్లే జరుగుతుందా? బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కేటీఆర్ తమ గుప్పిట్లోకి తీసుకున్నారా? ఆ కారణంగానే కవిత తిరుగుబాటు చేశారా? పార్టీ పెత్తనమా? లేక పంపకాల పేచీనా? ఉమ్మడి ఆస్తుల విషయంలోనే పంచాయితీ ఉన్నట్లుగా కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. అధికారం కోల్పోయాక అసెంబ్లీకి రాకుండా, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకుండా కేసీఆర్‌ చేసిన తప్పిదాల వల్లే, పార్టీపై పట్టు కోల్పోయారా? కేటీఆర్‌ ఆధిపత్యాన్ని చెల్లి కవిత సహించలేకపోతున్నారా? అంటే, కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసీలు ఇస్తే ఎక్స్ లో పోస్టుతో సరిపెట్టి, కేటీఆర్ కు సిబిఐ నోటీసులు ఇస్తే పార్టీ మొత్తం స్పందించడాన్ని కవిత ప్రశ్నించడాన్ని బట్టి ఇదే అర్థమవుతున్నది.

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర తాను జైలుకు వెళ్ళిన నాటి నుండే జరుగుతోందని కవిత వెల్లడించారు. అంతకుముందే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైలెంట్‌ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటే చేయలేదు. కేసీఆర్ కుటుంబం తప్పిదాల, మోసాల, దోపిడీల చిట్టా బీజేపీ వద్ద ఉందని, ఆ కేసుల భయంతోనే ఇదంతా చేస్తున్నారని, ప్రజలు చర్చిస్తున్నారు. లిక్కర్‌ కేసులో అడ్డంగా బుక్కయిన కవిత కోసం కూడా బీఆర్ఎస్, బీజేపీ ముందు మోకరిల్లిందనేది కాదనలేని నిజం.

తమ కులం వారికే పదవులు ఇవ్వటం, తెలంగాణతో, ఉద్యమంతో సంబంధం లేని వారికి అధికార అందలాలు ఎక్కించడం, కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఉద్యమకారులను దూరం పెట్టడం వంటి అనుభవంలోకి వచ్చిన నిర్ణయాలన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నాయి. వివక్ష, ఏకపక్ష, బంధు ప్రీతి, ఆత్మ స్థుతి, పర నిందలకు అలవాటు పడి, ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’ అంటే ఏ ‘సామాజిక తెలంగాణ’? ప్రజలు నమ్ముతారా? కవిత ఆలోచించాలి.

జయశంకర్‌ సార్‌ నుంచి కోదండరామ్‌ సార్‌ వరకు అందరూ దగాపడ్డవారే. ఉద్యమకారులు, ప్రజాదరణతో నిలిచిన బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీగానే మిగిలిందన్నది అంగీకరించి తీరాల్సిందే. ఆ పార్టీకి కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలే మూడు మూల స్తంభాలు. హరీశ్ రావు, సంతోశ్ రావులు సపోర్ట్ పిల్లర్లు.

తనకు, తన తండ్రి కేసీఆర్‌ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని కవిత అంటున్నారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసునని, కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కూడా కవిత భగ్గుమన్నారు. వెన్నుపోట్లకు అలవాటు పడిన వారు చివరకు కుటుంబ సభ్యులనైనా పొడవడానికి వెరవరని కవిత వ్యాఖ్యలే చెబుతున్నాయి.

కేసీఆర్‌ కుటుంబం అజమాయిషీలో అప్పుల కుప్పైన తెలంగాణ వందేళ్లు వెనక్కి పోయింది. ‘బంగారు తెలంగాణ’ నినాదంగానే మిగిలి, కేసీఆర్‌ కుటుంబం మాత్రం ‘24 క్యారట్ల గోల్డ్’ గా మారిందన్న అభిప్రాయం సర్వత్రా నిలిచిపోయింది. ఈ దశలో కేసీఆర్ కుటుంబ అంతర్గత తాజా ఎపిసోడ్‌ కేవలం రాజకుటుంబాల్లో జరిగే అధికారం, ఆధిపత్యం, పంపకాల పోరాటం లాంటిదే. ఈ కుట్రలు, కుతంత్రాల తెగబాటు కూడా అందులో భాగమేనని భావించాల్సి వస్తున్నది. అధికారం లేకపోతే ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి కేసీఆర్ కుటుంబం చేరిందని, అందుకోసం ఎంతకైనా తెగిస్తారనే అభిప్రాయం తాజా పరిణామాలను బట్టి బలపడుతోంది.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News