Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

ప్రభుత్వ సంక్షోభ హాస్టళ్ళు!|EDITORIAL

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అమ్మాయిలైతే బలవంతపు అత్యాచారాలకు గురవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం మండల కేంద్రంలోగల గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇద్దరు బాలికలు చనిపోవడం, 138 మంది పచ్చ కామెర్లతో హాస్పిటల్ పాలు కావడం సంక్షేమ హాస్టళ్ళలోని పరిస్థితులకు, నిర్వహణా తీరుకు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు అద్దం పడుతున్నది. క్వాంటం కంప్యూటింగ్‌, ఎఐ అంటూ నిత్యం వల్లె వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ హాస్టళ్ళ దుస్థితి కనిపించకపోవడం దురదృష్టకరం.

గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో ఎక్కువ శాతం కనీస సౌకర్యాల లేవు. బాలికల వసతి గృహాలు సరిపడినన్ని లేక, ఉన్నవి అత్యంత దయనీయంగా వున్నాయి. బోధన, వసతి, సదుపాయాలు అన్నింటికీ ఒకటి రెండు గదులతో సరిపుచ్చు తున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎ.ఎన్‌.ఎం లు లేరు. గురుకులాలలో ఉన్నప్పటికీ తగిన మందులు, సౌకర్యాలు లేవు.

పాలకులు మారుతున్నా పరిస్థితులు మారడం లేదు. వార్డెన్‌ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన లేనందున ఉపాధ్యాయులే ఒకవైపు బోధన మరోవైపు, పిల్లల బాధ్యత చూస్తున్నారు. మెడికల్‌ ఖర్చు భరించేందుకు తగిన నిధిని సమకూర్చడం లేదు. పిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు గాని, టీచర్లు గాని ప్రత్యేకంగా లేకపోవడం వల్ల పిల్లల మానసిక, శారీరక, విద్యా, వైద్య తదితర అంశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
సరైన ఆహారం ఉండదు. సరైన వసతి ఉండదు. నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలతో పిల్లలు హాస్పిటల్స్ పాలు కావడం, అందులో కొందరు మృత్యువాత పడడం, తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు అధ్వాన్నంగా ఉన్నాయి. గత పాలన, పదేళ్ళ పాలన, ప్రస్తుత పాలనలో చర్విత చరణంగా అవే తప్పులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, ప్రతిపక్షంలోకి రాగానే గగ్గోలు పెట్టడం మన పాలకులకు అలవాటైపోయింది. ఏపీలోనూ ఇదే తతంగం నడుస్తోంది. విద్య, వైద్యానికి పెద్దపీట వేయాల్సిన పాలకులు ఓట్‌ బ్యాంకు రాజకీయాలతో సంక్షేమ, ఉచిత పథకాలను కొనసాగిస్తున్నారు.

మారుమూల అటవీ ప్రాంత గిరిజనులకు అక్షరాస్యత అందించాలనే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 గిరిజనులకు విద్య, రక్షణ, సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. గిరిజనుల విద్య కోసం ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పి గాలికి వదిలేస్తున్నారు. గిరిజనుల వైద్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. నేటికీ డోలీల్లో సుదూర ప్రాంతాలకు వైద్యానికి గిరిజనులు వెళుతున్నారు. మన్నానికి జ్వరమొచ్చిందనే వార్తాలు ఇంకా వస్తూండటం పాలకులకు సిగ్గుచేటు. షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రకటించింది. అయినా వారి గూడాలకు నేటికీ రోడ్డు లేదు. చదువు, వైద్యం లేదు. ఈ నిర్లక్ష్యం సంక్షేమ హాస్టళ్ళపై కూడా కొనసాగుతున్నది. ఆశ్రమ పాఠశాలల్లో తాగునీరు లేక, మరుగుదొడ్లు లేక రోగాల బారినపడి చనిపోయిన ఘటనలను చూస్తున్నాం.

నిజానికి గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందివ్వాలి. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టాలి. బడులు లేక, ఉన్నా బడుల్లో టీచర్లు లేక, అసంపూర్ణ భవనాలు, చాలీచాలని వసతుల దుస్థితికి స్వస్తి పలకాలి. విష జ్వరాలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి అనారోగ్యాలతో పిల్లలు పిట్టల్లా రాలిపోవడాన్ని తక్షణమే అరికట్టాలి. ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పోషక విలువలతో కూడిన మెనూ చార్జీల పెంపునకు నిధులు ఇవ్వాలి. భావి భారత ఆశాకిరణాలైన పిల్లల భవిష్యత్తుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆ భావి భారతాన్ని నేటి నుంచే తీర్చిదిద్దడం మొదలు పెట్టాలి.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News