Thursday, March 12, 2026
25.3 C
Hyderabad

‘ఫీల్ గుడ్’ గుండు సున్నా కావద్దు!|EDITORIAL

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల అహంకారం, బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వంటి పరిణామాలతో ఏర్పడిన వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు కుమ్మక్కయ్యాయనే ప్రచారం కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చింది. ఇదే కొనసాగుతూ, గత రెండు ఉపఎన్నికలు కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చాయి. ఈ వాతావరణాన్ని సానూలంగా మలచుకున్న రేవంత్‌ వ్యూహాలు ఈ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాయి.
ఈ విజయాలను ప్రజాపాలనపై ‘ఫీల్ గుడ్’ గా తీసుకోవడానికి లేదు. ప్రభుత్వం పదేపదే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోంది. వాటి ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడంలేదు. ధరణి రద్దయి భూమాత వచ్చినప్పటికీ, భూ సమస్యలు అలాగే ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, 1బి రికార్డులు, సెటిల్మెంట్ సంబంధిత అయోమయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

దేవాదాయ శాఖ దైవాదీనంగా మారింది. వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కానీ ఆ శాఖ మంత్రి కొండా సురేఖ వాటి గురించి కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తుండటం ఆందోళనకరం. అటవీ భూముల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆక్రమణలు, పోడులు కొనసాగుతూనే ఉన్నాయి.

రోడ్ల పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. వరంగల్‌ హైవేపై పెద్దగా పనులు చేపట్టకపోవడం ప్రజలను విసిగిస్తోంది. పౌరసరఫరాలలో తెల్ల రేషన్‌ కార్డు దుర్వినియోగం, రేషన్‌ బియ్యంతో దొంగ వ్యాపారం వంటి అంశాలను మంత్రి పట్టించుకోవడం లేదు. తగిన దృష్టి పడకపోవడం సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.
ఉద్యోగుల పనితీరుపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. లంచం లేనిదే పనులు జరగడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దాడులతోనూ, ఉద్యోగుల్లో మార్పు కనిపించడం విచిత్రం, విడ్డూరం. ఫీ రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ దోపిడీలు ప్రభుత్వానికీ పెను సవాలుగా నిలుస్తున్నాయి. మంత్రులు, శాఖలు, ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంతోపాటు, అవినీతికి అలవాటు పడ్డారన్న భావన ప్రజల్లో కలుగుతోంది. పాలన ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. ప్రభుత్వ బాధ్యత సీఎం ది. రేపటి పరిణామాలన్నీ సీఎం యే ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచీ, చెడు ఆయన ఖాతాలోకే కాబట్టి ఆయన క్రియాశీలకంగా స్పందించకపోతే వాటి పర్యవసానాలను భరించాల్సి వస్తుంది.

ఒక ఉప ఎన్నిక రాష్ట్రం మొత్తం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. కొంత మేరకు ఆ ప్రభావాన్ని చూపుతుందంతే. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక గెలిచినంత మాత్రాన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భావించడం ప్రమాదకరం. ఉపఎన్నికల్లో పార్టీ, ప్రభుత్వం మొత్తం శక్తిని కేంద్రీకరించడం వల్లే సాధ్యం అయింది. సాధారణ ఎన్నికల్లో ఇలా జరగదు. వనరులు, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యతిరేకతను ఇప్పుడే గుర్తించకపోతే మూడేళ్ల తరువాత అది పెరిగి, పెద్దదై ప్రభుత్వాన్నే దగ్దె దించేయవచ్చు.

రేవంత్‌ ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలోనూ తన పట్టును ఒడిసిపట్టుకున్నారు. ప్రజాభిమానాన్ని పొందడానికి ఇంకా సుదూరం ప్రయాణించాల్సి ఉంది. సమస్యలను నేరుగా గుర్తించి వెంటనే పరిష్కరించడం తప్పనిసరి. మంత్రులు, అధికారులు సత్వరమే స్పందించి, బాధ్యతాయుతంగా మెలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సమీపిస్తున్న ఎన్నికల రీత్యా, స్థానిక, మున్సిపల్, జీహెచ్ఎంసీల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు.

బిహార్‌ ఫలితాలతో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి విజయం పార్టీకి ఊపిరి పోసింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఆయన ప్రతిష్ఠను పెంచింది. కానీ, ఈ విజయాలే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు తెచ్చేవేమీ కావు. రేవంత్‌ ఇకపై మరింత ప్రజల మధ్యకు వెళ్లి, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, పరిష్కరిస్తేనే, తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

Latest News

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం|EDITORIAL

పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ లో తిరుగులేని విజేతగా నిలవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ సాధన మాత్రమే కాదు. గత విశ్వకప్ ఆటల అనుభవాల...

10-03-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి సప్తమి రాత్రి 12.05 వరకు ఉపరి అష్టమి నక్షత్రం అనురాధ సాయంత్రం 05.42 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం హర్షణ ఉదయం 07.24 వరకు ఉపరి వజ్ర కరణం భద్ర ఉదయం 11.04...

09-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి షష్టి రాత్రి 10.03 వరకు ఉపరి సప్తమి నక్షత్రం విశాఖ పగలు 03.10 వరకు ఉపరి అనురాధ యోగం వ్యాఘాత ఉదయం 06.54 వరకు ఉపరి హర్షణ కరణం గరజి ఉదయం 09.04...

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN 3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News