Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

‘ఫీల్ గుడ్’ గుండు సున్నా కావద్దు!|EDITORIAL

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల అహంకారం, బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వంటి పరిణామాలతో ఏర్పడిన వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు కుమ్మక్కయ్యాయనే ప్రచారం కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చింది. ఇదే కొనసాగుతూ, గత రెండు ఉపఎన్నికలు కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చాయి. ఈ వాతావరణాన్ని సానూలంగా మలచుకున్న రేవంత్‌ వ్యూహాలు ఈ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాయి.
ఈ విజయాలను ప్రజాపాలనపై ‘ఫీల్ గుడ్’ గా తీసుకోవడానికి లేదు. ప్రభుత్వం పదేపదే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోంది. వాటి ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడంలేదు. ధరణి రద్దయి భూమాత వచ్చినప్పటికీ, భూ సమస్యలు అలాగే ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, 1బి రికార్డులు, సెటిల్మెంట్ సంబంధిత అయోమయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

దేవాదాయ శాఖ దైవాదీనంగా మారింది. వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కానీ ఆ శాఖ మంత్రి కొండా సురేఖ వాటి గురించి కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తుండటం ఆందోళనకరం. అటవీ భూముల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆక్రమణలు, పోడులు కొనసాగుతూనే ఉన్నాయి.

రోడ్ల పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. వరంగల్‌ హైవేపై పెద్దగా పనులు చేపట్టకపోవడం ప్రజలను విసిగిస్తోంది. పౌరసరఫరాలలో తెల్ల రేషన్‌ కార్డు దుర్వినియోగం, రేషన్‌ బియ్యంతో దొంగ వ్యాపారం వంటి అంశాలను మంత్రి పట్టించుకోవడం లేదు. తగిన దృష్టి పడకపోవడం సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.
ఉద్యోగుల పనితీరుపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. లంచం లేనిదే పనులు జరగడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దాడులతోనూ, ఉద్యోగుల్లో మార్పు కనిపించడం విచిత్రం, విడ్డూరం. ఫీ రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ దోపిడీలు ప్రభుత్వానికీ పెను సవాలుగా నిలుస్తున్నాయి. మంత్రులు, శాఖలు, ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంతోపాటు, అవినీతికి అలవాటు పడ్డారన్న భావన ప్రజల్లో కలుగుతోంది. పాలన ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. ప్రభుత్వ బాధ్యత సీఎం ది. రేపటి పరిణామాలన్నీ సీఎం యే ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచీ, చెడు ఆయన ఖాతాలోకే కాబట్టి ఆయన క్రియాశీలకంగా స్పందించకపోతే వాటి పర్యవసానాలను భరించాల్సి వస్తుంది.

ఒక ఉప ఎన్నిక రాష్ట్రం మొత్తం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. కొంత మేరకు ఆ ప్రభావాన్ని చూపుతుందంతే. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక గెలిచినంత మాత్రాన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భావించడం ప్రమాదకరం. ఉపఎన్నికల్లో పార్టీ, ప్రభుత్వం మొత్తం శక్తిని కేంద్రీకరించడం వల్లే సాధ్యం అయింది. సాధారణ ఎన్నికల్లో ఇలా జరగదు. వనరులు, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యతిరేకతను ఇప్పుడే గుర్తించకపోతే మూడేళ్ల తరువాత అది పెరిగి, పెద్దదై ప్రభుత్వాన్నే దగ్దె దించేయవచ్చు.

రేవంత్‌ ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలోనూ తన పట్టును ఒడిసిపట్టుకున్నారు. ప్రజాభిమానాన్ని పొందడానికి ఇంకా సుదూరం ప్రయాణించాల్సి ఉంది. సమస్యలను నేరుగా గుర్తించి వెంటనే పరిష్కరించడం తప్పనిసరి. మంత్రులు, అధికారులు సత్వరమే స్పందించి, బాధ్యతాయుతంగా మెలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సమీపిస్తున్న ఎన్నికల రీత్యా, స్థానిక, మున్సిపల్, జీహెచ్ఎంసీల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు.

బిహార్‌ ఫలితాలతో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్‌రెడ్డి విజయం పార్టీకి ఊపిరి పోసింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఆయన ప్రతిష్ఠను పెంచింది. కానీ, ఈ విజయాలే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు తెచ్చేవేమీ కావు. రేవంత్‌ ఇకపై మరింత ప్రజల మధ్యకు వెళ్లి, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, పరిష్కరిస్తేనే, తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి. కానీ, అహంకారానికి తావివ్వకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పని చేయడం, ప్రగతి ప్రభావాన్ని ప్రజల అనుభవంలోకి తేవడం ప్రభుత్వం, సీఎం ప్రథమ కర్తవ్యం కావాలి.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News