Wednesday, May 6, 2026
33.2 C
Hyderabad

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. అభివృద్ధి పేరుతో అప్పులు పెంచడం, సంక్షేమం పేరుతో ఖర్చులు విస్తరించడం కలసి ఖజానాపై భారంగా మారుతున్నాయి.

భారత రాష్ట్రాల సగటు అప్పు-జీడీపీ నిష్పత్తి 25% నుంచి 30% మధ్యలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 35% దాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీగా అప్పులు తీసుకుని మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే సమస్య అప్పులు తీసుకోవడంలోనే కాదు, వాటిని ఎలా వినియోగిస్తున్నాం? ఎలా తీరుస్తామన్నదే కీలకం. ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆదాయం వస్తుంది. కానీ జీతాలు, సబ్సిడీలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తే అది నిరర్థకమై దీర్ఘకాలిక భారంగా మారుతుంది.

ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. కొన్ని అంచనాల ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో మొత్తం ఆదాయంలో 15% నుంచి 20% వరకు వడ్డీలకే ఖర్చవుతోంది. మరోవైపు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 30% నుంచి 40% వరకు వెళ్తున్నాయి. అంటే అభివృద్ధి పనులకు మిగిలేది పరిమితమే. ఇదే పరిస్థితి కొనసాగితే “డెట్ ట్రాప్”లో పడే ప్రమాదం ఉంది.

ఉచిత పథకాల అంశం కూడా ఈ నేపథ్యంలో ప్రస్థావనీయమే. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు వంటి పథకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటి వ్యయం అనేక రాష్ట్రాల్లో బడ్జెట్‌లో 10% నుంచి 15% వరకు చేరింది. సమస్య ఏమిటంటే, ప్రయోజనం లేకుండా అమలు చేస్తే అనర్హులకూ లబ్ధి చేరుతుంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది కానీ ఫలితం తక్కువగా ఉంటుంది.

ఇక రాజకీయ నియామకాలు, సలహాదారుల వ్యవస్థ కూడా ఖర్చులను పెంచుతున్న అంశమే. అవసరమైన నిపుణుల కంటే ఎక్కువగా నియామకాలు జరిగితే అది ఆర్థికపరంగా భారంగా మారుతుంది. ఒక సలహాదారికి నెలకు లక్షల రూపాయల జీతం, ఇతర భత్యాలు కలిపి సంవత్సరానికి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇలాంటి పదవులు పదుల సంఖ్యలో ఉంటే మొత్తం ఖర్చు ఎంతవుతుందో అంచనా వేయడం కష్టం కాదు.

రాష్ట్రాలు ఆదాయం పెంచుకునేందుకు భూముల విక్రయం, మద్యం ధరల పెంపు, పరోక్ష పన్నుల విధానం వంటి మార్గాలను అనుసరిస్తున్నాయి. అయితే ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. భూములు అమ్మడం ఒకసారి జరిగే ఆదాయం. మద్యం మీద ఆధారపడటం సామాజిక సమస్యలకు దారి తీస్తుంది. పన్నుల భారంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు.

అయితే, పరిష్కారం ఏమిటి? ఖర్చుల ప్రాధాన్యతను పునఃసమీక్షించాలి. అత్యవసర సంక్షేమం, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్ణీత సంక్షేమ పథకాలనే అమలు చేయాలి. డిజిటల్ డేటా ఆధారంగా అర్హులను గుర్తించి, అనర్హులను తొలగించాలి. దీనివల్ల 20% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పన్నుల ఆదాయం కూడా పెరుగుతుంది. సేవల రంగం ప్రత్యేకంగా ఐటీ, పర్యాటకం రాష్ట్రాలకు పెద్ద ఆదాయ వనరుగా మారగలదు. వ్యవసాయరంగంలో ప్రాసెసింగ్, ఎగుమతులు పెంచితే రైతుల ఆదాయం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

అప్పుల నిర్వహణలో క్రమశిక్షణ అవసరం. తీసుకునే అప్పులపై పరిమితి విధించడం, వడ్డీ భారాన్ని తగ్గించే విధంగా పునర్వ్యవస్థీకరణ చేయడం అవసరం. పారదర్శకత కూడా కీలకం. ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.

రాజకీయ సంకల్పమే అత్యంత ముఖ్యమైనది. ఎన్నికల లాభనష్టాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. తక్షణ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక నష్టాలను విస్మరించడం ప్రమాదకరం. అభివృద్ధి, సంక్షేమం రెండూ అవసరమే. కానీ, వాటి మధ్య సమతుల్యత ఉండాలి.

రాష్ట్రాలు ఆర్థికంగా బలపడాలంటే “అప్పులు తగ్గించడం” ఒక్కటే మార్గం కాదు. “సరైన విధంగా అప్పులు వినియోగించడం”, “ఆదాయం పెంచడం” జరగాలి. ఇదే నిజమైన ఆర్థిక సంస్కరణలకు పునాది.

Latest News

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News