Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. అభివృద్ధి పేరుతో అప్పులు పెంచడం, సంక్షేమం పేరుతో ఖర్చులు విస్తరించడం కలసి ఖజానాపై భారంగా మారుతున్నాయి.

భారత రాష్ట్రాల సగటు అప్పు-జీడీపీ నిష్పత్తి 25% నుంచి 30% మధ్యలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 35% దాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీగా అప్పులు తీసుకుని మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే సమస్య అప్పులు తీసుకోవడంలోనే కాదు, వాటిని ఎలా వినియోగిస్తున్నాం? ఎలా తీరుస్తామన్నదే కీలకం. ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆదాయం వస్తుంది. కానీ జీతాలు, సబ్సిడీలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తే అది నిరర్థకమై దీర్ఘకాలిక భారంగా మారుతుంది.

ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. కొన్ని అంచనాల ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో మొత్తం ఆదాయంలో 15% నుంచి 20% వరకు వడ్డీలకే ఖర్చవుతోంది. మరోవైపు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 30% నుంచి 40% వరకు వెళ్తున్నాయి. అంటే అభివృద్ధి పనులకు మిగిలేది పరిమితమే. ఇదే పరిస్థితి కొనసాగితే “డెట్ ట్రాప్”లో పడే ప్రమాదం ఉంది.

ఉచిత పథకాల అంశం కూడా ఈ నేపథ్యంలో ప్రస్థావనీయమే. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు వంటి పథకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటి వ్యయం అనేక రాష్ట్రాల్లో బడ్జెట్‌లో 10% నుంచి 15% వరకు చేరింది. సమస్య ఏమిటంటే, ప్రయోజనం లేకుండా అమలు చేస్తే అనర్హులకూ లబ్ధి చేరుతుంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది కానీ ఫలితం తక్కువగా ఉంటుంది.

ఇక రాజకీయ నియామకాలు, సలహాదారుల వ్యవస్థ కూడా ఖర్చులను పెంచుతున్న అంశమే. అవసరమైన నిపుణుల కంటే ఎక్కువగా నియామకాలు జరిగితే అది ఆర్థికపరంగా భారంగా మారుతుంది. ఒక సలహాదారికి నెలకు లక్షల రూపాయల జీతం, ఇతర భత్యాలు కలిపి సంవత్సరానికి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇలాంటి పదవులు పదుల సంఖ్యలో ఉంటే మొత్తం ఖర్చు ఎంతవుతుందో అంచనా వేయడం కష్టం కాదు.

రాష్ట్రాలు ఆదాయం పెంచుకునేందుకు భూముల విక్రయం, మద్యం ధరల పెంపు, పరోక్ష పన్నుల విధానం వంటి మార్గాలను అనుసరిస్తున్నాయి. అయితే ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. భూములు అమ్మడం ఒకసారి జరిగే ఆదాయం. మద్యం మీద ఆధారపడటం సామాజిక సమస్యలకు దారి తీస్తుంది. పన్నుల భారంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు.

అయితే, పరిష్కారం ఏమిటి? ఖర్చుల ప్రాధాన్యతను పునఃసమీక్షించాలి. అత్యవసర సంక్షేమం, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్ణీత సంక్షేమ పథకాలనే అమలు చేయాలి. డిజిటల్ డేటా ఆధారంగా అర్హులను గుర్తించి, అనర్హులను తొలగించాలి. దీనివల్ల 20% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పన్నుల ఆదాయం కూడా పెరుగుతుంది. సేవల రంగం ప్రత్యేకంగా ఐటీ, పర్యాటకం రాష్ట్రాలకు పెద్ద ఆదాయ వనరుగా మారగలదు. వ్యవసాయరంగంలో ప్రాసెసింగ్, ఎగుమతులు పెంచితే రైతుల ఆదాయం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

అప్పుల నిర్వహణలో క్రమశిక్షణ అవసరం. తీసుకునే అప్పులపై పరిమితి విధించడం, వడ్డీ భారాన్ని తగ్గించే విధంగా పునర్వ్యవస్థీకరణ చేయడం అవసరం. పారదర్శకత కూడా కీలకం. ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.

రాజకీయ సంకల్పమే అత్యంత ముఖ్యమైనది. ఎన్నికల లాభనష్టాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. తక్షణ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక నష్టాలను విస్మరించడం ప్రమాదకరం. అభివృద్ధి, సంక్షేమం రెండూ అవసరమే. కానీ, వాటి మధ్య సమతుల్యత ఉండాలి.

రాష్ట్రాలు ఆర్థికంగా బలపడాలంటే “అప్పులు తగ్గించడం” ఒక్కటే మార్గం కాదు. “సరైన విధంగా అప్పులు వినియోగించడం”, “ఆదాయం పెంచడం” జరగాలి. ఇదే నిజమైన ఆర్థిక సంస్కరణలకు పునాది.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News