Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా!?|EDITORIAL

2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగి, ఏపీ- తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాలు కూడా భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. 2014-15లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లుగా కాగ్‌ తేల్చింది. ఒకవైపు ఆదాయ మార్గాలు పెరుగుతున్నా, అంతకంతకూ పెరుగుతున్న ఉద్యోగులు, పాలకుల జీత భత్యాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రాలకు పెను భారంగా మారుతున్నాయి. విధానాల లోపాలు, ఆదాయ సముపార్జనలో వ్యూహాత్మక తప్పిదాలు, అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులు, అమలుకు అలవికాని ఉచిత సంక్షేమ పథకాలు, అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి దాపురించడానికి కారణం పాలకుల, అధికారుల అసమర్థతే. ఈ పరిస్థితిలో రాష్ట్రాలు అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా? వ్యూహాత్మక పరిష్కారాలు ఏంటి?

ప్రస్తుతం ప్రభుత్వమే బడ్జెట్ లో చెప్పిన విధంగా తెలంగాణ అప్పు భారం రూ.6.85 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 26.2%. సమానం. అప్పుల్లో ఎక్కువగా మంచినీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, వడ్డీ భారాలు, జీత భత్యాలు, పెన్షన్లు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ఖర్చులే ఎక్కువ. బడ్జెట్ లో సగం జీత భత్యాలకుపోను, రూ.56వేల కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయి. 2024 25 లో తెలంగాణ ఆదాయాల్లో 78% స్వంత వనరుల నుంచి వస్తోంది, మిగతా 22% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికికు పన్నుల వాటాగా 12%, గ్రాంట్ల రూపంలో 10% నిధులు వస్తున్నాయి.
ఏపీ లో అప్పులు రూ.4.86 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 34.7% కు సమానం. ఇందులో ఉచిత, సంక్షేమ పథకాలకు 55వేల కోట్లు ఖర్చవుతున్నాయి. దీనికి గత ప్రభుత్వాల అధిక ఖర్చులు, ప్రాజెక్టుల మేనేజ్‌మెంట్ లోపాలు, ఆదాయ వృద్ధి తక్కువ ఉండటం, కేంద్ర సాయం గ్రాంట్లు తక్కువగా అందడం కారణాలు. 2023 24 లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ఆదాయాల్లో 57% స్వంత వనరుల నుంచి, మిగతా 43% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికి పన్నుల వాటాగా 20%, గ్రాంట్ల రూపంలో 23% నిధులు వస్తున్నాయి.

తాజాగా తెలంగాణ 16వ ఫైనాన్స్ కమిషన్ ముందు అప్పులను పునర్వ్యవస్థీకరించాలని, వడ్డీ తగ్గింపు, చెల్లింపు ప్రీమియం తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. కొన్ని అప్పులను కమర్షియల్ కాని బ్యాంకులకు బదలాయించాలని కూడా కోరింది.

అలాగే, ప్రస్తుత రాష్ట్రాల ఆదాయంలో కేంద్రం వాటా 41% ఉన్నా, తెలంగాణ ఆ పన్నుల వాటాను 50%కి పెంచాలని కోరుతోంది. ఇందువల్ల రాష్ట్రాలకు స్వతంత్ర వ్యయం నిలుపుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. కేంద్ర పథకాలను రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అమలు చేసే స్వేచ్ఛని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, సహాయ నిధులు అనుకున్న స్థాయిలో రాష్ట్రాలకు చేరడం లేదు.
అయితే, ఇవన్నీ కలిసి రాష్ట్రాలకు పెను సవాళ్ళను విసురుతున్నాయి. అప్పుల పెరుగుదల సంక్షేమ పథకాలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టుల్లో ఖర్చు పెరిగిపోవటం, వాటిని బడ్జెట్ లో స్పష్టంగా తెలపడకపోవటం. ఆదాయ వృద్ధి తక్కువగా ఉండటం, ఉత్పాదకత, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి ఆలస్యం కావటం. పన్నుల వసూలు, ప్రభుత్వ ఆస్తులను వదిలేయడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లోపాలు ఉండటం వంటి సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి.

మరి వీటి పరిష్కార మార్గాలు ఏమిటి? అంటే రాష్ట్రాలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. దినసరి వేతనాలు, సామాజిక రంగ పంపిణీ పథకాలను సమీక్షించాలి. కొన్ని ఉచిత పథకాలు ప్రభుత్వానికి పెను భారాన్ని కలిగిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెంచుకోవాలి. పన్నుల వసూలును సరళం చేయాలి. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం కాకుండా, వాటిని, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించాలి. ఆయా పథకాలను పున: పరిశీలించాలి. ప్రతి పథకం లాభ నష్టాలను బేరీజు వేయాలి. నష్టం చేసే పథకాలకు తిలోదకాలివ్వాలి. ప్రభుత్వ పథకాలు, ఆదాయ వ్యయాల్లో పారదర్శకతను పాటించాలి. ప్రతి పథకానికి ఆడిట్ ఉండాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సహాయం సహా, ఆర్థిక సంక్షేమ నివేదికలు రూపొందిస్తూ దశల వారీగా అప్పులను తగ్గించుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలి. కేంద్ర గ్రాంట్లు, ప్యాకేజీలు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం చూపేవిగా ఉండాలి. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే, కేంద్ర సహాయం, ప్యాకేజీలు పెరిగి, పన్నులు తగ్గి పురోగతికి ఆస్కారం ఏర్పడుతుంది.

అప్పులు అధికమైతే, అది రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను దెబ్బతీస్తాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు పార్టీలిచ్చే వాగ్దానాలు ప్రశ్నార్థకమవుతాయి. కేంద్రం ఇచ్చే సహాయం తాత్కాలికమే. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు స్వీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News