Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

ప్రకృతితో పోరాటం కాదు సహజీవనం చేయాలి!|EDITORIAL

ప్రకృతే మానవాళికి జీవనాధారం. సకల జీవరాసులను పోషించేది ప్రకృతే. కానీ నేడు, అదే ప్రకృతి మనిషిని మటాశ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వర్షాభావాలు, తుపాన్లు, వరదలు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, హిమపాతాలు, వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్షలాది మంది మనుషులు, జీవరాసులు బలవుతున్నాయి. తాజాగా క్లౌడ్‌ బరస్ట్‌ వచ్చి చేరింది. క్యుములో నింబస్‌ మేఘాలు ఉరుము ఉరిమినట్లుగా కురియడంతో ఒక్కసారిగా ఒకేచోట కుండపోత వానగా వస్తోంది. దీంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది.

ఉమ్మడి ఏపీలో క్యుములో నింబస్‌ మేఘాల వల్లనే అప్పటి సీఎం రాజశేర్‌ రెడ్డితో పాటు, పలువురు నల్లమలలో హెలీక్యాప్టర్ క్రాష్ లో మృత్యువాత పడ్డారు. ఇదంతా ప్రకృతి విధ్వంసం వల్ల జరుగుతున్న విపరిణామం. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హానికర వాయువుల ఉద్గారాల వలన గ్రీన్‌హౌస్ ప్రభావం పెరిగింది. దాంతో భూమి ఉష్ణోగ్రత పెరిగింది. ఫలితంగా మంచు కరగడం, సముద్ర మట్టం పెరగడం, తుఫానుల తీవ్రత పెరగడం వంటి సంఘటనలు సంభవిస్తున్నాయి. పైగా మనం నిత్యం కొండలను, గుట్టలను కొట్టేస్తున్నాం. అడవులను నరికేస్తున్నాం. పారిశ్రామీకరణ, పట్టణీకరణ, నగరాల విస్తరణ, పర్యావరణంపై నిర్లక్ష్యం వెరసే ఈ వైపరీత్యాల విష పరిణామాలు.

ఈ వర్షాకాల సీజన్ లో కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, హిమాచల్‌, ఏపీ, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ లు జరిగాయి. జమ్మూలో గురువారం మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఫలితంగా మచైల్‌ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన వరదలకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయాల పాలయ్యారు. చాలామంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్‌ మాతా దేవి యాత్రను నిలిపివేశారు. ఉత్తరాఖండ్‌లో ఖీర్‌గంగా నది మెరుపు వరదతో ధరాలీ పట్టణంపై విరుచుకుపడింది. ఎగువ ప్రాంతాల్లో జరిగిన క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా అనూహ్య వరద ధాటికి ధరాలీ పట్టణం దాదాపు సగం కొట్టుకుపోయింది. కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన బురద తప్ప ఏవీ కనిపించడం లేదు. వరద ధాటికి మూడు నాలుగు అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. యాత్రికుల కోసం నిర్మించిన 20-25 హోటళ్లు, పలు హోం స్టేలు ప్రస్తుతం కనపడటం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఐదుగురు మరణించారు. ఉత్పాతం సమయంలో పర్యాటకులు, స్థానికులందరూ క్షేమంగా ఉన్నారా అన్న అంశంపై కూడా స్పష్టత రావడం లేదు. సహాయక చర్యలు చేపట్టిన సైనిక బృందాల్లో 10 మంది వరద ధాటికి గల్లంతు కావడం గమనార్హం. ఈ దుర్ఘటన తర్వాత కూడా ఆ ప్రాంతంలో అధిక వర్షపాతం కురిసింది. ఖీర్‌గంగ ఇలా ఉప్పొంగడం ఇదే మొదటిసారేం కాదు. ఇటీవల కాలంలో 2018లో, 2021లో కూడా ఈ నదికి భారీగా వరదలు వచ్చి, తీవ్ర నష్టం వాటిల్లింది. 1835లో కూడా ఇలాంటి వరద ఈ నదికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటి మాదిరే బురద వరద అప్పుడు కూడా ధరాలీని ముంచెత్తిందని, దాంతో అప్పటి పట్టణం పూర్తిగా ధ్వంసం అయిందని చెబుతున్నారు. ఆ శిధిలాలపైన ప్రస్తుత పట్టణం నిర్మాణమైంది.

అభివృద్ధి పేరుతో పెద్దఎత్తున సాగుతున్న అడవుల విధ్వంసం కూడా ఉత్తరాఖండ్‌లో కొనసాగుతోంది. ఒక్క గత సంవత్సరంలోనే 998 హెక్టార్ల మేర అడవి తరుక్కుపోయింది. 2021-24 మధ్య దేశంలోని అటవీ ప్రాంతాల్లో 41 శాతం చెట్లను కోల్పోయినట్లు తాజాగా విడుదలైన ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. విచ్చలవిడిగా సాగుతున్న ఈ తరహా విధ్వంసం కూడా ప్రకృతి ప్రళయాలకు కారణమౌతోంది. అదే విధంగా ఖీర్‌గంగా పొడవునా రక్షిత గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు కొన్ని సంవత్స రాలుగా కోరుతున్నారు. అధికార యంత్రాంగం ఈ విషయాలపై దృష్టి సారిస్తే స్థానిక ప్రజలకు కొంత మేర ఊరట లభిస్తుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో, ఏపీలోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంకోవైపు వర్షం నీరు వస్తే పోయే దారులను ఆక్రమించి ఇళ్లు కట్టుకుంటున్నాం. దీంతో చిన్న పాటి వర్షాలకే రోడ్ల నదుల్లా, లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారుతున్నాయి. ఇక ఆకస్మిక వరదలు వస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్న హైదరాబాద్ లో చూశాం. వరంగల్‌లోనూ మరోమారు వర్షం బీభత్సం సృష్టించింది. ఖమ్మంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. చెరువులను మాయం చేసిన పాపానికే హైదరాబాద్‌ ఓ పెద్ద చెరువైంది.

హైదరాబాద్‌లో పురానాఫూల్‌ శ్మశాన వాటిక మునిగి పోయింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాంతాలు మళ్లీ వరద ముంపులకు గురవుతున్నాయి. వివిధ జిల్లాల్లో చిన్నా పెద్దా జలపాతాలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న వరదలు, వానలు సకాలంలో కురవక పోవడం, క్లౌడ్‌ బరస్ట్ లు అన్నీ కూడా ప్రకృతి విధ్వంసం కారణంగానే. వాటినుంచి మనం గుణపాఠం నేర్చుకోవడం లేదు. అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పర్యావరణంపై ప్రజల్లాగే పాలకులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావడం లేదు. పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. అప్పటిదాకా ఇలాంటి విధ్వంసాలను భరించాల్సిందేనా? బలవ్వాల్సిందేనా? అందరమూ ఆలోచించుకోవాలి.

ఈ భూమి మన వారసత్వం కాదు, మన భవిష్యత్ తరాలకు అప్పగింత. దాన్ని పరిరక్షించడం మన బాధ్యత. ప్రకృతితో పోరాడటం కాకుండా, దానితో సహజీవనం చేసుకోవాలన్న తత్త్వాన్ని అవలంబించాల్సిన సమయం ఇది.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News