Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

మోడీ ఇమేజ్‌ పెరిగిందా? తగ్గిందా! | NARENDRAMODI |

|NARENDRAMODI|OPERATION SINDHOOR|

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో పాకిస్తాన్‌ బెంబేలెత్తింది. ఎంతగానో బెదిరిపోయింది. కాల్పుల విరమణకు ప్రపంచం చుట్టూతా తిరిగింది. చివరకు అమెరికా కాళ్ళు పట్టుకుంది. యుద్ధతంత్రమో, రాజకీయ కుతంత్రమో కానీ, కాల్పుల విరమణ అనివార్యమైంది. ఫలితంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, యుద్ధభూమిలో దాయదిపై పూర్తిగా పై చేయి సాధించిన భారత్‌, మరోమారు అది వికృత చేష్టలకు పాల్పడకుండా ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుంది? అనేది ప్రధాన ప్రశ్న. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాకిస్తాన్‌ని భయపెట్టగలిగాం. కానీ, అది ఎంతో కాలం నిలవలేదనేది మరో ప్రశ్న.

ఒకవైపు కాల్పుల విరమణ మరుక్షణమే మరోవైపు ఎప్పటిలాగే ఎల్‌ఓసీ వద్ద పాక్ దుశ్చర్యలు. పైగా ‘నేనే యుద్ధాన్ని ఆపా?’ అంటూ అమెరికా అధ్యక్షుడు ‘ట్రంప’రితనపు మాటలు మోడీని మరింత ఇరుకున పెట్టాయి. ఇంతలోనే ‘మాదే విజయమ’ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. పాక్‌ సైనికులు మిఠాయిలు పంచుకొంటూ సంబురాలు చేసుకొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో మోడీ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ఇంతలోనే ‘కాల్పుల విరమణ’ నిర్ణయాన్ని పక్కనబెట్టి సరిహద్దుల్లో పాక్‌ మళ్లీ డ్రోన్ల దాడులతో కవ్వింపులకు పాల్పడుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈలోగా ఉగ్ర ప్రతిదాడుల్లో హతమైన ప్రతి ఒక్కరికి రూ.కోటి చొప్పున పాక్ ప్రధాని ప్రకటించారు. ఇంత దారుణ మారణకాండ జరుగుతుండగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ నుంచి తెచ్చిన అప్పుల ప్యాకేజీలోంచి ఉగ్రవాదుల కుటుంబాలకు అంత పెద్ద మొత్తం ప్రకటించడం భారత్ ని కవ్వించడం, మోసం చేయడం, నయవంచన కాక మరేమిటి? అలాగే ఆ దాడుల్లో భవహల్ పూర్ ఉగ్ర శిబిరంలో హతమైన మరో 14 మందికి కూడా పరిహారం ప్రకటించింది. ఆ హతుల్లో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టు, భారత్ లో జరిగిన ఉగ్ర చర్యలన్నింటికీ మూలం జైష్ ఎ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది, మరో నలుగురు కూడా ఉన్నారు. వారికి అందాల్సిన ఆ మొత్తం రూ. 14 కోట్లను మసూద్ అజార్ కే ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించడం, వారి అంత్యక్రియల్లో పాక్ సైన్యం, పోలీసులు పాల్గొనడం వంటి చర్యలు మరింత కవ్వింపుగా ఉన్నాయి. ఇలా ఇచ్చే ప్రతి పైసా, తిరిగి పాక్ లో ఉగ్రవాదుల పెంపునకు దోహదం చేయడమేగాక, ఉగ్రవాదులకు బలం చేకూర్చి, తిరిగి అది భారత్ పై ప్రయోగానికి దారి తీస్తుందన్నది నిస్సందేహం.

1971 యుద్ధంలోనే అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని కాంగ్రెస్ ను, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని విమర్శిస్తున్న కమలనాథులు, ఇప్పుడు మోడీ చేసిందానికి ఏం సమాధానం చెబుతారు? ఏ విధంగా సమర్ధించుకుంటారు? అందుకే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇప్పుడు మోడీని, బీజేపీని వేలెత్తి చూపిస్తున్నాయి. ఏ ఒత్తిడులకు తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకున్నారో ప్రధాని మోడీ ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం రాజకీయ రాజీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలంత ఈజీగా ఈ విమర్శలను తిప్పికొట్టడం కష్టం. అయితే ఈ నిర్ణయం మోడీ దీర్ఘకాల వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుందని అంటున్నారు. కానీ, ఈ వ్యూహాన్ని ఏవిధంగా భారత ప్రజలను నమ్మిస్తారు. ప్రతి పక్షాలను ఒప్పిస్తారు? విచిత్రంగా విమర్శకులే కాదు మోడీని సమర్ధించేవారు కూడా మోడీ స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఇమేజ్‌కు ఎదురు దెబ్బగానే చూస్తున్నారు. ఏదేమైనా, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో ప్రధాని మోడీ ఇమేజ్‌ ఒక్కసారిగా పైకెళ్లి, ఆ తర్వాత ఆయన భక్తులు కూడా ఉస్సూరుమనే దీనస్థితికి దిగజారింది. రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, రక్షణరంగ నిపుణులు, కళాకారులు, జర్నలిస్టులు.. అంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఆత్మరక్షణలో పడిన మోడీ తన ఇమేజీ డ్యామేజీ కంట్రోల్‌కు దిగినట్టు కనిపిస్తోంది. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించడం, ఆ మరుసటి రోజే పంజాబ్‌లోని అధంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కాల్పుల విరమణ’పై ఆగ్రహంతో ఉన్న వారిని తన ప్రసంగంతో తన దారికి తెచ్చుకోవాలని మోడీ ఎంతో ప్రయత్నించారు. భావోద్వేగపూరిత సంభాషణలు జోడించారు. అయితే, మోడీ తన ప్రసంగంలో ‘కాల్పుల విరమణ’ నిర్ణయానికి గల కారణాలను మాత్రం కనీసం ఉటంకించలేకపోయారు. ‘ట్రంప్‌ వాణిజ్య బెదిరింపుల వ్యాఖ్యల’పై కూడా ఆయన స్పందించలేదు. దీంతో మోడీ వైఖరిపై అందరూ మండిపడ్డారు.మోడీ ప్రసంగం నిస్తేజంగా సాగిందని ధ్వజమెత్తారు. ‘జాతినుద్దేశించి మాట్లాడటం పార్లమెంట్‌ సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదని, బాధ్యతల నుంచి ప్రధాని తప్పించుకోలేర’ ని ప్రముఖ జర్నలిస్ట్‌ రాజు పార్లేకర్‌ వంటి వారు బహిరంగంగానే విమర్శించారు. అమెరికాతో చర్చల్లో వాణిజ్యం ప్రస్తావనే రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓ మొక్కుబడి ప్రకటనను ఆ తర్వాత విడుదల చేశాయి. దీంతో నెటిజన్లు మరింతగా మండిపడ్డారు.

మొత్తంగా తన ప్రసంగం కూడా ప్రభావం చూపలేదని గ్రహించిన మోడీ మంగళవారం పంజాబ్‌లోని అధంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించి జవాన్లతో ముచ్చటించారు. పనిలోపనిగా సైనికుల్లో ధైర్యాన్ని నింపేలా మాట్లాడారు. ‘భారత ఆడపడుచుల సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశామం’టూ మాట్లాడారు. భారత్‌ను, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకొంటామన్నారు. ఈ సందర్శన కూడా బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. జవాన్లతో మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘పహల్గాం మహిళల సిందూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులను, వారిని ఎగదోసిన పాక్‌ను విడిచిపెట్టడమేనా మీరు చెప్తున్న ఆ పెద్ద నిర్ణయం’ అంటూ నెటిజన్లు మోడీ వీడియోను ట్యాగ్‌ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. యుద్ధానికి ముందు లేదా యుద్ధం జరుగుతున్నప్పుడు నాయకుడు సైన్యంలో ధైర్యాన్ని నూరిపోయడం చూశాంగానీ, యుద్ధం పూర్తయ్యాక వెళ్లడమేంటని మోడీని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. విచిత్రమేంటంటే, లైవ్‌ స్టీమ్రింగ్‌, యూట్యూబ్‌, ఎఫ్‌బీ, ఎక్స్‌ లైవ్‌ వీడియోల్లో మోడీ ప్రసంగాలకు వ్యూయర్‌షిప్‌ భారీగా తగ్గింది.

మొత్తంగా ’కాల్పుల విరమణ’ ప్రకటన, దాని తదనంతర పరిణామాలపై ప్రధాని మోడీ ఆత్మరక్షణలో పడి ఇమేజ్‌ మేకోవర్‌ కోసం ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయని చెప్తున్నారు. రాబోవు రోజులలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News