Monday, July 13, 2026
29.3 C
Hyderabad

అవినీతిలో దొందూ దొందే!|EDITORIAL

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రజల ఆశలు, ఆకాంక్షలు రానురున తీవ్ర నిరాశగా మారుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయ, పార్టీల, ప్రభుత్వాల ప్రయాణాలు సాగించినప్పటికీ, పాలనల ఫలితాలు మాత్రం ఒకేలా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలే కేంద్రంగా పాలన సాగుతోందన్న భావన బలపడుతోంది. అప్పుడు కేంద్రీకృతంగా, ఇప్పుడు వీకేంద్రీకరణ అవినీతి సాగుతున్నట్లుగా ఉంది. అధికార మార్పులు జరిగినా, పాలన ధోరణిలో మార్పు లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం.

తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అప్పులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అభివృద్ధి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్న ఆరోపణలు నేటికీ కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతి అజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవలి నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బొగ్గుగని కోసం ఇద్దరు మంత్రులు కోట్లాడుకుంటున్నారని విమర్శలు చెలరేగాయి. కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, భట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారని చివరకు తేలింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వచ్చిన ఆరోపణలు, ఆపై సింగరేణి నైనీ బొగ్గు టెండర్ల ప్రక్రియ రద్దు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అవినీతి జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తే, మరి టెండర్లు ఎందుకు రద్దయ్యాయి? ప్రజాపాలనలో పారదర్శకతంటే ఇదేనా?

ఒక్క నైనీ టెండర్లే కాదు, రాష్ట్రంలో పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, వీడియోల యుద్ధం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, లాభదాయకమైన శాఖలు, కాంట్రాక్టుల కోసం జరుగుతున్న కుమ్ములాటలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుక్కాని లేని నావలా మారుస్తున్నాయి. పాలన కంటే రాజకీయ అంతర్గత పోరాటాల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తున్నది.

మేడారం అభివృద్ధి పనుల టెండర్ల కాంట్రాక్టులపై మంత్రుల మధ్య విభేదాలు ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చాయి. దేవాదాయ శాఖ పనుల్లో ఇతర శాఖల మంత్రుల జోక్యంపై ఎఐసీసీ వరకు ఫిర్యాదులు వెళ్లడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉండాల్సిన దేవాలయాల అభివృద్ధి కూడా రాజకీయ లాభనష్టాల లెక్కల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కణతకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ గన్ను గురిపెట్టిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సష్టించిన విషయం తెలిసిందే.
మంత్రుల బాధ్యత కేవలం విమర్శలు చేయడం, గత ప్రభుత్వాన్ని నిందించడమే కాదు. తమ శాఖల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షించడం కూడా. అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే విచారణకు ఆదేశించాలి. మంత్రులే ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం, అనుకూల మీడియా ద్వారా ఆరోపణలు చేయించుకోవడం, అధికారులను బలిపశువులుగా మార్చడం పరిపాటిగా మారింది.

ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పుకుంటున్న రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, పెన్షన్లు, ఉచిత బస్సు సౌకర్యాలు సంక్షేమంలో భాగమే కానీ, అవి సంపూర్ణ అభివృద్ధికి ప్రత్యామ్నాయాలు కావు. పాలనలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యోగ సృష్టి, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాల్లో స్పష్టమైన దృక్పథం కనిపించడం లేదు. అప్పులు చేసి సంక్షేమం చూపించడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం ఎప్పటికీ కాదు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అదే తప్పులు పునరావృతం చేస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ‘కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగి’తే ఎవరికీ కనిపించకుండా పోదు. అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చకుండా, రాజకీయ కుమ్ములాటలతో కాలం గడిపితే తెలంగాణ మరింత భ్రష్టు పట్టడం ఖాయం.

చివరికి నష్టపోయేది ప్రజలే. అభివృద్ధి పక్కకు పోయి, అప్పుల భారం పెరిగితే భవిష్యత్ తరాలకు భారమవుతుంది. అవినీతిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది తీర్పు చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని, పారదర్శక పాలన దిశగా అడుగులు వేయకపోతే, ప్రజల చేతిలో పరాభవం తప్పదన్నది రాజకీయ సత్యం.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News