Friday, May 29, 2026
33.2 C
Hyderabad

ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట లేదా!?|EDITORIAL

దేశంలో ఆర్థిక నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సరిహద్దులు దాటి ఇతర దేశాల నేరగాళ్ళు మన ప్రజలపై దోపిడీకి దిగుతున్నా సరిదిద్దుకోలేకపోతున్నాం. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన నేరగాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఎంజాయ్ చేస్తున్నా వారిని పట్టుకొచ్చే పనిలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించుకున్నది ఇంటా బయటా దోపిడీ అవుతున్నా రక్షణ లేకుండా పోయింది. చివరకు బ్యాంకులు కూడా తమ పూచీ లేకుండా ప్రవర్తించే తీరు అత్యంత దారుణం. తీసుకున్న అప్పులకు ఖాతాదారులు బాధ్యత వస్తున్న విధంగా ఆ ఖాతాదారులు దాచుకున్న డబ్బు, నగానట్రాకు ఆ బ్యాంకులు కూడా బాధ్యత వహించాలి కదా! సరే, ఆర్థిక నేరాల అదుపునకు ప్రభుత్వాలు చేస్తున్నదేంటి? ప్రజల విలువైన ప్రాణాలకు, వారు కూడబెట్టుకున్న ఆస్తులకు, దాచుకున్న డబ్బులకు రక్షణ, భద్రత లేకుపోతే మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? ప్రజాస్వామ్యంలోనేనా? పరస్పరం పీక్కుతినే ఈ దోపిడీకి అంతుపొంతు, అడ్డూ అదుపూ లేదా?

ప్రపంచంలో కొందరిలో, ఆ మాటకొస్తే ప్రజల్లో ‘ఈజీ మనీ’ అనే ఓ జాఢ్యం వేళ్ళూనుకుని, పెరిగి పెద్దదై తన విక్రుత రూపాలను రకరకాలుగా ప్రదర్శిస్తున్నది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. ఎంజాయ్ చేయాలి? అందుకు ఏ దారైనా ఫరవాలేదు. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు జరిగేవి. వస్తువులను ఎత్తుకుపోయేవారు. ఫలానా దోపిడీ జరిగిందంటే ఫలానా వాళ్ళే చేసి ఉంటారన్న క్లూ లు పోలీసులకు దొరికేవి. దొంగలు కూడా కన్నాలు వేసే వాడు డోర్లు బార్లా తెరిచి ఉన్నా కన్నాలు మాత్రమే వేసేవాడు. ఇప్పుడలా కాదు. పుట్టి, పెరిగి పెద్దదై పోయిన శాస్త్ర సాంకేతికతను నేరగాళ్ళు విరివిగా విస్తారంగా వినియోగిస్తున్నారు. అర చేతిలో వైకుంఠం లాగా వచ్చిన స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్నే ఆసరా చేసుకుని, ఇస్మార్ట్ గా దోపిడీలు చేసేస్తున్నారు. తెలియని నెంబర్ల ఫోన్ ఎత్తితే, మెస్సేజ్ లు, లింకులు ఓపెన్ చేస్తే, చేయకపోయినా బ్యాంకుల అక్కౌంట్లల్లో డబ్బులు ఇట్టే మాయం అవుతున్నాయి. వీళ్ళందరినీ సైబర్ నేరగాళ్ళంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుతూ, వాడు తినడానికి ఫోన్ బూచీని చేతిలో పెట్టి, అలవాటు చేసి, అదే చదవాలని ఒత్తిడి చేసి, లక్షలు, కోట్లు పోసి, చదివించి, అలాంటి ఉద్యోగాలే చేయాలని ప్రోత్సహించి, బాగా చదవుకోరా? గొప్పగా ఎదగరా? అంటూ మనం చదివించిన మన పోరగాళ్ళే, పోకిరీలే ఈ దోపిడీ ముఠాలుగా మారుతున్నారు. ఫోన్లు మాత్రమే కాదు, ఫోన్ల సమాచారం మాత్రమే కాదు, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు మాయం అవుతుంటే తెల్లబోవడం తప్ప చేయగలిగింది లేకుండా పోతోంది. పనిలోపనిగా కొందరు ప్రజల్లో ఈ ఈజీ మనీ బలహీనతలను కూడా సొమ్ము చేసుకుంటూ అనేకానేక యాప్ ల దాకా, కష్టపడి ఏదో చేద్దామనుకునే వారికి వర్క్ ఫ్రం హోం పేరుతో.. ఇలా అనేక కొత్త కొత్త దోపిడీ ఆవిష్కరణలు కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఇక బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేసిన మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వారంతా విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. దేశంలోనే ఉన్న మరికొందరు ఎగవేతదారులు రాజకీయాలను అడ్డం పెట్టుకుని దర్జాగా బతికేస్తున్నారు. రాజకీయాల్లో ఉంటూ అవినీతికి పాల్పడుతున్న వారు పదవులు వెలగబెడుతున్నారు. రాష్ట్రాల వనరులను లూటీ చేసిన వారు, దేశ సంపదను దోచిన వారు మన ఓట్లతో గెలిచి, మనమిచ్చిన పదవులతో మనలనే పరిపాలిస్తున్నారు. రాజకీయ నాయకుల, వ్యాపారుల అవినీతి కారణంగా దేశ వనరులు దెబ్బతింటున్నాయి. ఖజానా ఖాళీ అవుతోంది. వారి జీత భత్యాలు, వారి విలాసాల కారణంగా లక్షల కోట్లు ఏటా వృధా అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను మేపడానికి అవుతున్న లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలగమానదు. అధికారం, దర్పం అనుభవించడానికే చాలామంది రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నారు. కానీ సామాన్యులు, ఓట్లేసిన వారు మాత్రం అడుక్కునే పరిస్థితి కల్పించి వారికి ఉచిత పథకాల బిచ్చమేస్తున్నారు.

అవినీతి, అక్రమాల కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అవుతున్నారు. అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నా, అరికట్టడంలో విఫలం అవుతున్నారు. ఇక దేశంలో విరవివిగా రుణాలు ఇచ్చి, ఉపాధిరంగాలను ప్రోత్సహిస్తే యువత సమస్య తీరేది. నిరుద్యోగులకు ఉపాధి దక్కేది. భారతీయ బ్యాంకులు సామాన్యులకు రుణాలు ఇవ్వండంలో ఎంత కఠినంగా ఉంటున్నాయో సూటుబూటు వేసుకుని వచ్చే వారికి అప్పనంగా వేలకోట్లు కట్టబెట్టి రుణాలు ఇస్తున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వారు ఇలాగే బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో వీరిని పట్టుకుని తీసుకుని రావడంలో పూర్తిగా విఫలం అయ్యారు. విదేశీ నల్ల ధనాన్ని ధనా ధన్ మన దేశానికి తెచ్చేస్తేనానని చెప్పి ముచ్చటగా మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చేశారు. నిజానికి మన బ్యాంకులు సులభంగా పేద, మధ్య తరగతి ప్రజలకు రుణాలు ఇచ్చినట్లయితే ఉపాధి రంగం బలపడేది. పెట్టుబడుల కోసం మన పాలకులు విదేశాల చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చేది కాదు. ప్రభుత్వాల రుణ పథకాలు కూడా సామాన్యులకి అందడం లేదు. అలాగే ప్రజలు కూడా ఇచ్చిన రుణాలు చెల్లించాలన్న శ్రద్ధ కనబర్చడం లేదు. ప్రజల నుంచి ప్రభుత్వాల దాకా ఎగవేత ఆలోచనే. కనీసం ముక్కూ, ముఖం చూడకుండా లోన్‌ ఇస్తామంటే ఎవరు కాదంటారు? అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటారు! కానీ, ఆ తరువాతే అసలు సినిమా మొదలవుతుంది. ఫోన్లలోనే బెదిరింపులు, వేధింపులు, చావులు.

ఇక అప్పుల యాప్‌లు… చైనాకు చెందినవిగా పోలీసులు చెబుతున్నారు. కొందరు దేశంలోని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని, రుణాలిస్తున్నట్లు సైబర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొందరు ఆర్బీఐ మార్గదర్శకాలను పట్టించుకోకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడమే గాకుండా బ్యాంకుల రుణ పద్దతిని ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చాలి. బ్యాంకులు ప్రజల డబ్బుతో పెద్దలకు దోచిపెట్టడం గాకుండా బతికేందుకు అసవరమైన విధంగా రుణాలు ఇవ్వగలగాలి. సైబర్ నేరాలను అరికట్టాలి. మొత్తం నేరాల అదుపు కోసం ప్రత్యేక విధి విధానాలు అవసరం. దేశ రక్షణ వ్యవస్థ లాగే ఇవ్వాళ నేరాల రక్షణ కూడా అత్యవాశ్యం.

Latest News

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

28-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు.ద్వాదశి ఉదయం 08.17 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం చిత్త ఉదయం 08.50 వరకు ఉపరి స్వాతి యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.20 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 08.17...

గాలి మేడలు!?|ADUGU TRENDS

ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది?...

‘ఎబోలా’ మళ్ళీ ముప్పేనా!? ఎలా?|EDITORIAL

కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్‌లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో...

27-05-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం-శుక్లపక్షం తిధి శు ఏకాదశి ఉదయం 07.43 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం హస్త ఉదయం 07.33 వరకు ఉపరి చిత్త యోగం వ్యతీపాత రాత్రి తెల్ల 04.33 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం...

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News