Friday, April 10, 2026
26.7 C
Hyderabad

Bjp|బీజేపీ New Presidents|కొత్త అధ్యక్షుల బాధ్యతలు స్వీకరణ

Party|పార్టీ Future|భవిష్యత్తు లక్ష్యాలకు మార్గ నిర్దేశం

నూతన అధ్యక్షులు Ramchandra rao| రాంచంద్రరావు, madhav| మాధవ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుల నియామకం అనంతరం పార్టీ నేతల ప్రసంగాలు మార్గ నిర్దేశకంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్. రాంచంద్రరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ చేసిన కీలక వ్యాఖ్యలు, బీజేపీ కార్యకర్తలను ఉత్సాహపరిచేలా… ఉన్నాయి.

తెలంగాణలో జరిగిన రాష్ట్ర అధ్యక్ష ప్రమాణ స్వీకార సభలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, కొత్త అధ్యక్షుడు రాంచంద్రరావు పార్టీకి కట్టుబాటుతో సేవలందించిన నాయకుడిగా కొనియాడారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌కి రామచంద్రరావు ఘనత భరించగలిగే నాయకుడని, గతంలో మోదీగారిపై కూడా ట్రోలింగ్ జరిగిందని గుర్తు చేశారు. ఏబీవీపీ రోజుల్లో రాడికల్స్ దాడుల వల్ల కాళ్లు వంకరైన రామచంద్రరావు చరిత్ర ఆయన త్యాగాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. రామచంద్రరావు నాయకత్వంలో కాషాయ పతాకాన్ని గోల్కొండపై ఎగరేయాలన్నది తమ లక్ష్యమన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ, తాను పేరుకే అధ్యక్షుడు అయినా, హృదయపూర్వకంగా పార్టీకి కార్యకర్తేనని, కార్యకర్తలే బీజేపీకి అసలైన నేతలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి ఓట్లు వచ్చిన రోజుల్లో కూడా కార్యకర్తలు పోరాడారని, ఇప్పుడు పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారన్నది మన పార్టీ విజయానికి నిదర్శనమన్నారు. పార్టీని అగ్రనాయకులు, కార్యకర్తలు, అందరితో చర్చించి ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేస్తానని, బీజేపీ ప్రభుత్వాల వల్ల దేశంలో ఎన్నో మార్పులు జరిగాయని అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల సభ్యుల నమోదు జరిగిందని, 937 మండలాల్లో 911 మండలాలకు అధ్యక్షులను ఎన్నిక చేశామని వివరించారు. రాష్ట్రంలో 20 వేల బూత్ కమిటీలతో పాటు 5610 శక్తి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బీజేపీనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాటించే పార్టీగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం ప్రజల ఆస్తిని దోచుకున్నాయని విమర్శించారు.

ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడిగా బాధ్యతలు పూర్తిచేసుకున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు గతంలో పని చేసిన నేతల కృషిని గుర్తు చేస్తూ, రాంచంద్రరావుతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ త్యాగాలతో నిలిచిన పార్టీగా గుర్తింపు పొందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ మాట్లాడుతూ, తనకు కుటుంబం, పార్టీ రెండూ ఒక్కటేనని, బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఏపీలో అధికారంలోకి రాగల శక్తి బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జెండా, కూటమి అజెండాతో ముందుకు వెళ్తామని, పార్టీకి బలోపేతం చేసి రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని దక్కించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ నూతన నాయకత్వం బీజేపీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మున్ముందు మరింత బలాన్ని అందించనుంది. కార్యకర్తల ఐక్యత, నేతల కృషి, మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఆశయాల నెరవేర్చే పోరాటమే బీజేపీ విజయ మార్గమని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత బలంగా ఎదగడానికి ఈ కొత్త నేతల నాయకత్వం కీలకం కానుంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News