Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు, నేతల ప్రవర్తన, వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలపై మరోసారి చర్చకు దారితీశాయి.
గత కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఉంది. ఇంతకాలం తరువాత సహజంగానే ప్రజల్లో ఆశలు, అసంతృప్తులు రెండూ పెరుగుతాయి. ఎన్నికల్లో ఓడిన లేదా ఫలితాలపై సందేహం ఉన్న పార్టీలు ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం కొత్త విషయమేమీ కాదు. భారత ఎన్నికల సంఘంపై విమర్శలూ కొత్తేమీ కాదు. అయితే ఆ ఆరోపణలకు సరైన రుజువులు అవసరం. లేదంటే ప్రజల్లో అపోహలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఇటీవల దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున “ఓటు చోరీ”, “ఈవీఎంల దుర్వినియోగం”, “సీట్ల లూటీ” వంటి పదజాలాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇలాంటి వాదనలను నిర్ధారించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కోర్టులున్నాయి.

ఇక ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వంటి నేతలు కూడా ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తతున్నారు. ఏదో ఒక చోట జరిగినదాన్ని, అనుమానాలను దేశవ్యాప్తంగా రుద్దడం రాజకీయంగా ఆ పార్టీకి లాభదాయకంగా కనిపించినా, మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తుంది.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఓడిన నాయకుడు వెంటనే రాజీనామా చేయాలా? లేక చట్టపరమైన పోరాటం చేయాలా? అనే ప్రశ్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రజల తీర్పును గౌరవించడం అన్నది ప్రతి నాయకుడి ప్రాథమిక బాధ్యత. అదే సమయంలో, ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోవడం కూడా హక్కే. ఓడినా సరే, రాజీనామానే చేయం అనడం ఎంత వరకు సమంజసం? బహుషా మమత రాజీనామానే చేయననడం ఒక నిరసనగా భావించాలి.

ఇక “ప్రజల తీర్పు ఎంత శక్తివంతం?” అన్నది మరో ప్రశ్న. 60%, 70% లేదా అంతకంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైతే, అది ప్రజల్లో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. ఓటింగులో మహిళలు, యువత భాగస్వామ్యం కూడా పెరుగుతున్నది. ఇది సానుకూలాంశం. ప్రాంతీయ రాజకీయాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు తరచూ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ఎన్నుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిపక్వతకు సంకేతం. ఒక పార్టీపై అసంతృప్తి పెరిగితే, ప్రజలు మార్పు కోరుకోవడం సహజం. అదే సమయంలో, కొత్త రాజకీయ శక్తులకు అవకాశాలు రావడం కూడా ఇదే ప్రక్రియలో భాగం.

ఇక రాజకీయ నాయకుల భాష బరితెగింపులా ఉంది. ఎన్నికల తరువాత భావోద్వేగంతో మాట్లాడటం సహజమే అయినప్పటికీ, వ్యక్తిత్వ హననానికి దిగడం, వ్యక్తిగత దూషణలు చేయడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళని తూలనాడటం, రాజ్యాంగ సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయాలకు, నాయకులకు కూడా ఆరోగ్యవంతం కాదు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి సంస్థలపై నమ్మకం దెబ్బతింటే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం.

ప్రజాస్వామ్యంలో అసలు శక్తి ప్రజలదే. అత్యంత శక్తివంతులు ప్రజలే. నాయకులు వస్తారు, పోతారు. కానీ వ్యవస్థ నిలబడాలి. ఎన్నికలు కేవలం అధికార పోరాటం కాదు.అది బాధ్యత, జవాబుదారీతనం, నితి నిజాయితీ, నమ్మకాలనే నాలుగు స్తంభాలపై నిలిచే ప్రజాస్వామిక ప్రక్రియ. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శలు ఏది పడితే అది విమర్శించడం, ఇష్టానుసారంగా, ఆధారరహితంగా ఆరోపించడం కాకుండా, పరిష్కార మార్గాలను కూడా సూచించాలి.

ప్రజల విశ్వాసం కోల్పోతే ఏ నాయకుడైనా నిలబడలేడు. అదే సమయంలో, ప్రజల తీర్పును గౌరవిస్తూ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలం.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

07-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 06.31 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం సాధ్య రాత్రి 10.59 వరకు ఉపరి శుభ కరణం తైతుల ఉదయం 06.31...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News