Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు, నేతల ప్రవర్తన, వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలపై మరోసారి చర్చకు దారితీశాయి.
గత కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఉంది. ఇంతకాలం తరువాత సహజంగానే ప్రజల్లో ఆశలు, అసంతృప్తులు రెండూ పెరుగుతాయి. ఎన్నికల్లో ఓడిన లేదా ఫలితాలపై సందేహం ఉన్న పార్టీలు ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం కొత్త విషయమేమీ కాదు. భారత ఎన్నికల సంఘంపై విమర్శలూ కొత్తేమీ కాదు. అయితే ఆ ఆరోపణలకు సరైన రుజువులు అవసరం. లేదంటే ప్రజల్లో అపోహలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఇటీవల దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున “ఓటు చోరీ”, “ఈవీఎంల దుర్వినియోగం”, “సీట్ల లూటీ” వంటి పదజాలాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇలాంటి వాదనలను నిర్ధారించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కోర్టులున్నాయి.

ఇక ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వంటి నేతలు కూడా ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తతున్నారు. ఏదో ఒక చోట జరిగినదాన్ని, అనుమానాలను దేశవ్యాప్తంగా రుద్దడం రాజకీయంగా ఆ పార్టీకి లాభదాయకంగా కనిపించినా, మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తుంది.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఓడిన నాయకుడు వెంటనే రాజీనామా చేయాలా? లేక చట్టపరమైన పోరాటం చేయాలా? అనే ప్రశ్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రజల తీర్పును గౌరవించడం అన్నది ప్రతి నాయకుడి ప్రాథమిక బాధ్యత. అదే సమయంలో, ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోవడం కూడా హక్కే. ఓడినా సరే, రాజీనామానే చేయం అనడం ఎంత వరకు సమంజసం? బహుషా మమత రాజీనామానే చేయననడం ఒక నిరసనగా భావించాలి.

ఇక “ప్రజల తీర్పు ఎంత శక్తివంతం?” అన్నది మరో ప్రశ్న. 60%, 70% లేదా అంతకంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైతే, అది ప్రజల్లో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. ఓటింగులో మహిళలు, యువత భాగస్వామ్యం కూడా పెరుగుతున్నది. ఇది సానుకూలాంశం. ప్రాంతీయ రాజకీయాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు తరచూ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ఎన్నుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిపక్వతకు సంకేతం. ఒక పార్టీపై అసంతృప్తి పెరిగితే, ప్రజలు మార్పు కోరుకోవడం సహజం. అదే సమయంలో, కొత్త రాజకీయ శక్తులకు అవకాశాలు రావడం కూడా ఇదే ప్రక్రియలో భాగం.

ఇక రాజకీయ నాయకుల భాష బరితెగింపులా ఉంది. ఎన్నికల తరువాత భావోద్వేగంతో మాట్లాడటం సహజమే అయినప్పటికీ, వ్యక్తిత్వ హననానికి దిగడం, వ్యక్తిగత దూషణలు చేయడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళని తూలనాడటం, రాజ్యాంగ సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయాలకు, నాయకులకు కూడా ఆరోగ్యవంతం కాదు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి సంస్థలపై నమ్మకం దెబ్బతింటే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం.

ప్రజాస్వామ్యంలో అసలు శక్తి ప్రజలదే. అత్యంత శక్తివంతులు ప్రజలే. నాయకులు వస్తారు, పోతారు. కానీ వ్యవస్థ నిలబడాలి. ఎన్నికలు కేవలం అధికార పోరాటం కాదు.అది బాధ్యత, జవాబుదారీతనం, నితి నిజాయితీ, నమ్మకాలనే నాలుగు స్తంభాలపై నిలిచే ప్రజాస్వామిక ప్రక్రియ. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శలు ఏది పడితే అది విమర్శించడం, ఇష్టానుసారంగా, ఆధారరహితంగా ఆరోపించడం కాకుండా, పరిష్కార మార్గాలను కూడా సూచించాలి.

ప్రజల విశ్వాసం కోల్పోతే ఏ నాయకుడైనా నిలబడలేడు. అదే సమయంలో, ప్రజల తీర్పును గౌరవిస్తూ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలం.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News