Wednesday, June 10, 2026
23.8 C
Hyderabad

మానవత్వమా! నీ అడ్రసెక్కడ?|EDITORIAL

మానవత్వం మంటగలుస్తోంది. మానవ విలువలు మట్టిపాలవుతున్నాయి. మనిషి ప్రాణం త్రుణ ప్రాయంగా మారింది. నిత్యం ఏదో ఘోరం వినాల్సి రావడమో, చూడాల్సి రావడమో తప్పడం లేదు. అసాంఘిక, అత్యాచార, హత్యలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. నేరం-ఘోరం నిత్యకృత్యమైంది. విక్రుత విష రూపాలు తీసుకుంది. బయటకు వెళ్ళినవాళ్లు తిరిగి వస్తారా? అన్న భయం పోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఏమైనా జరగొచ్చు. ఎవరికి ఏమైనా కావచ్చు. ఏడడుగులు కలిసి నడిచిన భార్యాభర్తలు, అన్నా దమ్ములు, తల్లిదండ్రులు పిల్లలు అన్న రక్త సంబంధాలు కూడా రక్తమోడుతున్నాయి. కుటుంబ బంధాలు ఏనాడో మంటకలిశాయి. సమాజంలో మనుషుల సంబంధాలన్నీ అవసరాల మేరకో, ఆర్థికపరంగానో ముడి పడ్డాయి. దీంతో ఎవరన్నా, ఎవరికీ లెక్కలేదు. ఎవరిని ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒక కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో కలిసి ఉన్నా, మానసికంగా దూరమే. మరి సమాజంలో ఏం జరుగుతోంది? ఎందుకీ మారణ హోమం. అమానవీయతత్వం? బహుషా ఈ కలికాలం అంతరించిపోతుందంటే ఇదేనేమో? ఇలాగేనేమో?

ఒకప్పుడు ఎవరికి ఎవరి వల్లనైనా హాని ఉందంటే అది శ్రతువు వల్ల, ప్రక్రుతి ప్రకోపం వల్ల, ప్రమాదాల వల్ల అయి ఉండేది. ఇప్పుడా భయం అక్కరలేదు. మన పక్కనే మనతో నవ్వుతూ మాట్లాడే వారితోనో, మన కన్న కొడుకులు, బిడ్డలతోనో, భార్యా భర్తతోనో, అన్నాతమ్ముళ్ళతోనో, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన రక్త సంబంధీకులు, అంతా మన అనుకున్న వాళ్ళతోనే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

జాతీయ నేర నివారణ విభాగం గణాంకాల ప్రకారం.. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు నమోదవుతున్నాయి. ఇందులో 90 శాతం దారుణాలు తెలిసిన వ్యక్తుల ద్వారానే జరుగు తుండడం గమనార్హం. బాధితుల్లో 10 శాతం మంది 18ఏళ్ల లోపు వారు కాగా, 66శాతం మంది 18-30 ఏళ్ల లోపువారు. దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచార, హత్యాచార ఘటనలు, విద్యార్థినులపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాజికంగా, శాంతిభద్రతల, ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ఎదిగామని అనుకుంటున్న ఈ తరుణంలోనూ మన మానసిక దౌర్బల్యాన్ని, మన వెనుక బాటుతనాన్ని, మన సంకుచిత మనస్తత్వాన్ని, పెరుగుతున్న పగ, ప్రతీకారాలు, నేర ప్రవ్రుత్తిని, సమాజంలో పెరుగుతున్న అశాంతి ధోరణులను, మన భద్రతను, మన రక్షణను, మన పాలకుల నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణులను ఎత్తి చూపుతున్నాయి. మన మానసిక ఈ స్థితులే మనల్ని వెక్కిరిస్తున్నాయి.

భర్తలను వదిలించుకునే భార్యల సంఖ్య పెరుగుతోంది. ప్రియుడి మోజుల చంపేవారు కొందరు….ప్రియురాలి కోసం భార్యలను వధించే వారు మరికొందరు… సుపారీ హత్యలు, పరువు హత్యలు. ఆస్తుల పంచాయితీల్లో అన్నాతమ్ములమనే భావన పోతోంది. అన్నను తమ్ముడు చంపడమో..తమ్ముడిని అన్నను చంపడమో మామూలైంది. మద్యానికి బానిసలై తల్లిదండ్రులను కడతేరుస్తున్నారు. పోలీసులు అన్నా.. జైలు అన్నా భయం లేకుండా పోతోంది. జైలుకే కదా? కొన్ని రోజులు వెళ్లి వద్దాంలే! అన్న ధోరణి కనిపిస్తోంది. ఎక్కడైనా సరే, డబ్బులు పెడితే చాలు బయట పడొచ్చన్న నిర్లక్ష్యం కూడా వేళ్ళూనుకోవడమే కాదు, వట వ్రుక్షమైపోతోంది. అత్యాచార ఘటనలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కూతరు ప్రియుడితో కలసి తల్లిని హత్య చేయించింది. వరంగల్‌లో ప్రియురాలు మోజులో పడి భార్యను నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల ఓ డెంటిస్ట్‌ ఆత్మహత్య చేసుకుంది. సమాజంలో పడిపోతున్న విలువలు, పెరుగుతున్న విష సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోల్‌కతాలో వరుస హత్యాచార ఘటనలు..ఆందోళన కలిగించాయి. కోల్‌కత్తా లా కాలేజీ విద్యార్థినిపై సహ విద్యార్థుల అత్యాచారం, ఐఐఎం విద్యార్థినిపై కళాశాల హాస్టల్లోనే అఘాయిత్యం జరిగాయి. బెంగాల్‌లో అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకులు ఈ దుర్మార్గం వెనుక ఉన్నారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ హాస్పటల్లో జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారానికి, హత్యకు గురి కావడం దేశవ్యాప్త ఆందోళనలకు దారి తీసింది.

ఒడిషాలో బిఇడి విద్యార్థిని … తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకుడి విూద ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణం. భవిష్యత్తు లో ఉపాధ్యాయినిగా ఎదగాల్సిన విద్యార్థిని బలన్మరణానికి దారి తీసింది. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని కళాశాలకు వెళ్లి, గండికోటలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్‌ విద్యార్థినులు… తమను ల్యాబ్‌ అసిస్టెంటు, మరో ముగ్గురు సిబ్బంది లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు- ఫిర్యాదు చేశారు. ఏలూరులోని స్టోర్ట్స్‌ అధారిటీ- ఆఫ్‌ ఇండియా కేంద్రంలో క్రీడాకారిణుల పట్ల కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు- వచ్చిన వార్తలు సంచలనం కలిగించాయి. అలాగే, నేర నిరూపణ చేయటంలోనూ పోలీసు యంత్రాంగం తరచూ విఫలమ వుతోంది. సంచలనం కలిగించిన ఆయేషా, రిషితేశ్వరి ఉదంతాలలో నిందితులకు శిక్ష పడలేదు. దర్యాప్తులో వైఫల్యాలు కూడా నేర ప్రవర్తకులకు పరోక్ష ధైర్యాన్నిస్తాయి. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు విధించాల్సిందే. మరణశిక్షలకు సైతం వెనకాడరాదు. చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన చదువు, జీవితాన్ని మన పిల్లలకు అందించాలి. మన పాఠ్యాంశాలను కూడా మనం మార్చుకోవాల్సి ఉంది. మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనూ రావాలి. విలువైన మానవ జీవితానికి సార్థకతను తేవాలి.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News