Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

మానవత్వమా! నీ అడ్రసెక్కడ?|EDITORIAL

మానవత్వం మంటగలుస్తోంది. మానవ విలువలు మట్టిపాలవుతున్నాయి. మనిషి ప్రాణం త్రుణ ప్రాయంగా మారింది. నిత్యం ఏదో ఘోరం వినాల్సి రావడమో, చూడాల్సి రావడమో తప్పడం లేదు. అసాంఘిక, అత్యాచార, హత్యలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. నేరం-ఘోరం నిత్యకృత్యమైంది. విక్రుత విష రూపాలు తీసుకుంది. బయటకు వెళ్ళినవాళ్లు తిరిగి వస్తారా? అన్న భయం పోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఏమైనా జరగొచ్చు. ఎవరికి ఏమైనా కావచ్చు. ఏడడుగులు కలిసి నడిచిన భార్యాభర్తలు, అన్నా దమ్ములు, తల్లిదండ్రులు పిల్లలు అన్న రక్త సంబంధాలు కూడా రక్తమోడుతున్నాయి. కుటుంబ బంధాలు ఏనాడో మంటకలిశాయి. సమాజంలో మనుషుల సంబంధాలన్నీ అవసరాల మేరకో, ఆర్థికపరంగానో ముడి పడ్డాయి. దీంతో ఎవరన్నా, ఎవరికీ లెక్కలేదు. ఎవరిని ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒక కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో కలిసి ఉన్నా, మానసికంగా దూరమే. మరి సమాజంలో ఏం జరుగుతోంది? ఎందుకీ మారణ హోమం. అమానవీయతత్వం? బహుషా ఈ కలికాలం అంతరించిపోతుందంటే ఇదేనేమో? ఇలాగేనేమో?

ఒకప్పుడు ఎవరికి ఎవరి వల్లనైనా హాని ఉందంటే అది శ్రతువు వల్ల, ప్రక్రుతి ప్రకోపం వల్ల, ప్రమాదాల వల్ల అయి ఉండేది. ఇప్పుడా భయం అక్కరలేదు. మన పక్కనే మనతో నవ్వుతూ మాట్లాడే వారితోనో, మన కన్న కొడుకులు, బిడ్డలతోనో, భార్యా భర్తతోనో, అన్నాతమ్ముళ్ళతోనో, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన రక్త సంబంధీకులు, అంతా మన అనుకున్న వాళ్ళతోనే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

జాతీయ నేర నివారణ విభాగం గణాంకాల ప్రకారం.. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు నమోదవుతున్నాయి. ఇందులో 90 శాతం దారుణాలు తెలిసిన వ్యక్తుల ద్వారానే జరుగు తుండడం గమనార్హం. బాధితుల్లో 10 శాతం మంది 18ఏళ్ల లోపు వారు కాగా, 66శాతం మంది 18-30 ఏళ్ల లోపువారు. దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచార, హత్యాచార ఘటనలు, విద్యార్థినులపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాజికంగా, శాంతిభద్రతల, ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ఎదిగామని అనుకుంటున్న ఈ తరుణంలోనూ మన మానసిక దౌర్బల్యాన్ని, మన వెనుక బాటుతనాన్ని, మన సంకుచిత మనస్తత్వాన్ని, పెరుగుతున్న పగ, ప్రతీకారాలు, నేర ప్రవ్రుత్తిని, సమాజంలో పెరుగుతున్న అశాంతి ధోరణులను, మన భద్రతను, మన రక్షణను, మన పాలకుల నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణులను ఎత్తి చూపుతున్నాయి. మన మానసిక ఈ స్థితులే మనల్ని వెక్కిరిస్తున్నాయి.

భర్తలను వదిలించుకునే భార్యల సంఖ్య పెరుగుతోంది. ప్రియుడి మోజుల చంపేవారు కొందరు….ప్రియురాలి కోసం భార్యలను వధించే వారు మరికొందరు… సుపారీ హత్యలు, పరువు హత్యలు. ఆస్తుల పంచాయితీల్లో అన్నాతమ్ములమనే భావన పోతోంది. అన్నను తమ్ముడు చంపడమో..తమ్ముడిని అన్నను చంపడమో మామూలైంది. మద్యానికి బానిసలై తల్లిదండ్రులను కడతేరుస్తున్నారు. పోలీసులు అన్నా.. జైలు అన్నా భయం లేకుండా పోతోంది. జైలుకే కదా? కొన్ని రోజులు వెళ్లి వద్దాంలే! అన్న ధోరణి కనిపిస్తోంది. ఎక్కడైనా సరే, డబ్బులు పెడితే చాలు బయట పడొచ్చన్న నిర్లక్ష్యం కూడా వేళ్ళూనుకోవడమే కాదు, వట వ్రుక్షమైపోతోంది. అత్యాచార ఘటనలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కూతరు ప్రియుడితో కలసి తల్లిని హత్య చేయించింది. వరంగల్‌లో ప్రియురాలు మోజులో పడి భార్యను నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల ఓ డెంటిస్ట్‌ ఆత్మహత్య చేసుకుంది. సమాజంలో పడిపోతున్న విలువలు, పెరుగుతున్న విష సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోల్‌కతాలో వరుస హత్యాచార ఘటనలు..ఆందోళన కలిగించాయి. కోల్‌కత్తా లా కాలేజీ విద్యార్థినిపై సహ విద్యార్థుల అత్యాచారం, ఐఐఎం విద్యార్థినిపై కళాశాల హాస్టల్లోనే అఘాయిత్యం జరిగాయి. బెంగాల్‌లో అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకులు ఈ దుర్మార్గం వెనుక ఉన్నారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ హాస్పటల్లో జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారానికి, హత్యకు గురి కావడం దేశవ్యాప్త ఆందోళనలకు దారి తీసింది.

ఒడిషాలో బిఇడి విద్యార్థిని … తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకుడి విూద ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణం. భవిష్యత్తు లో ఉపాధ్యాయినిగా ఎదగాల్సిన విద్యార్థిని బలన్మరణానికి దారి తీసింది. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని కళాశాలకు వెళ్లి, గండికోటలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్‌ విద్యార్థినులు… తమను ల్యాబ్‌ అసిస్టెంటు, మరో ముగ్గురు సిబ్బంది లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు- ఫిర్యాదు చేశారు. ఏలూరులోని స్టోర్ట్స్‌ అధారిటీ- ఆఫ్‌ ఇండియా కేంద్రంలో క్రీడాకారిణుల పట్ల కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు- వచ్చిన వార్తలు సంచలనం కలిగించాయి. అలాగే, నేర నిరూపణ చేయటంలోనూ పోలీసు యంత్రాంగం తరచూ విఫలమ వుతోంది. సంచలనం కలిగించిన ఆయేషా, రిషితేశ్వరి ఉదంతాలలో నిందితులకు శిక్ష పడలేదు. దర్యాప్తులో వైఫల్యాలు కూడా నేర ప్రవర్తకులకు పరోక్ష ధైర్యాన్నిస్తాయి. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు విధించాల్సిందే. మరణశిక్షలకు సైతం వెనకాడరాదు. చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన చదువు, జీవితాన్ని మన పిల్లలకు అందించాలి. మన పాఠ్యాంశాలను కూడా మనం మార్చుకోవాల్సి ఉంది. మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనూ రావాలి. విలువైన మానవ జీవితానికి సార్థకతను తేవాలి.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News