Wednesday, July 29, 2026
23.1 C
Hyderabad

అటా? ఇటా? వేటా!?|SUPREME COURT|JUDGEMENT

ముచ్చటగా మూడే దారులు!
గతంలో హైకోర్టు తిరస్కరణ!
తీర్పేదైనా ప్రభావం తీవ్రమే!
రాజకీయాలను ప్రభావితం చేసేదే!
‘కీ’లకం కానున్న అత్యున్నత తీర్పు!
‘సుప్రీం’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలేది నేడే!

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తేంటి? ఉంటారా? ఊడుతారా? వారిపై అనర్హత వేటు పడనుందా? లేక వారి బంతి తిరిగి స్పీకర్ కోర్టులోకే రానుందా? అటా? ఇటా? వేటా!? నేడే తేలనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్లపై గెలిచి, కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం నేడే తేలనుంది. రిజర్వు చేసిన తుది తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు చెప్పనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పునకు సంబంధించిన మూడే దారులున్నాయి. అందులో సుప్రీం దేన్ని ఎంచుకుంటుందన్ని ఆసక్తిగా మారింది. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, తీర్పేదైనా తెలంగాణతోపాటు దేశ రాజకీయాలనే మలుపు తిప్పనున్నది. ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయనున్నది.

న్యూఢిల్లీ, జులై 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, 119 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ – ఖైరతాబాద్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల, కడియం శ్రీహరి – స్టేషన్ ఘనపూర్, తెల్లం వెంకట్రావ్ – భద్రాచలం, గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్ చెరువు, కాలే యాదయ్య – చేవెళ్ల, టి. ప్రకాష్ గౌడ్ – రాజేంద్ర నగర్, డా. ఎం సంజయ్ కుమార్ – జగిత్యాల, అరికేపూడి గాంధీ – శేరిలింగంపల్లి, పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది రాజ్యాంగంలో గల 10వ షెడ్యూల్ లోని యాంటీ-డిఫెక్షన్ లా కింద అనర్హతకు దారితీసే అక్రమ ఫిరాయింపుగా బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఒక ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా, లేదా పార్టీ విప్‌ను ఉల్లంఘించినా అనర్హత వేటు పడుతుంది. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్‌లు దాఖలు చేసినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

హై కోర్టు తిరస్కరణ

దీంతో బీఆర్ఎస్ ఆ పది మంది ఎమ్మెల్యేలపై హై కోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్ తన రాజ్యాంగ బాధ్యతల నుండి తప్పించుకోవడమేనని బీఆర్ఎస్ వాదించింది. అయితే వాదనలు విన్న తర్వాత నవంబర్ 2024లో, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బీఆర్ఎస్ పిటిషన్‌లను తిరస్కరించింది. అనర్హత పిటిషన్‌లపై నేరుగా తీర్పు ఇవ్వడానికి బదులు, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

సుప్రీం కోర్టుకు

ఈ తీర్పు తర్వాత కూడా స్పీకర్ నుండి ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ కింద దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది. అలాగే రిట్ పిటిషన్ కింద పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, ఎం. సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలని కోరింది. అనర్హత పిటిషన్‌లను నాలుగు వారాలలోపు పరిష్కరించేలా టైమ్‌లైన్ నిర్దేశించాలని సుప్రీం కోర్టును బీఆర్ఎస్ కోరింది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కెపి వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై 2025 మార్చి 4న జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ పిటిషన్‌లపై విచారణ జరిపింది. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, కౌషిక్ రెడ్డి తరపున న్యాయవాది ఆర్యాద సుందరం వాదనలు వినిపించారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్‌కి కోర్టులు సూచనలు చేసే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వు చేసింది. ఇప్పుడు ఆ తుది తీర్పుని గురువారం ఉదయం.10.45 న్యాయమూర్తులు వెలువరించనున్నారు.

అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలపై కోర్టు సీరియస్

ఈ కేసు వాదనలు జరుగుతున్న సందర్భంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఉప ఎన్నికలు రావు. సభా నాయకుడిగా, స్పీకర్ తరపున కూడా నేనే చెబుతున్నా..’నంటూ అసెంబ్లీలో మాట్లాడితే కోర్టు ధిక్కరణ కిందకు రాదనే ధైర్యంతో సీఎం వ్యాఖ్యానించారు. ఈ విషయం సుప్రీం కోర్టులో ప్రస్థావనకు రాగా, సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించకపోతే ఎలా? అంటూ చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి సీఎం క్షమాపణలు చెప్పారు. పైగా ఎదుటి పక్షం నుంచి అంతకు మించిన కామెంట్లు వస్తున్న విషయం కోర్టు ద్రుష్టికి వెళ్ళింది. దీంతో ఈ కేసును తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు ఎంత సీరియస్ గా, ప్రతిష్టత్మకంగా తీసుకుంటున్నాయో అర్థమవుతుంది.

ఇదే ‘కీ’లకం!

స్పీకర్, ఇలాంటి అనర్హత పిటిషన్‌లపై ‘క్వాసి-జుడిషియల్ అధికారి’గా వ్యవహరిస్తారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం ఎటువంటి నిర్దిష్ట గడువును నిర్దేశించలేదు, ఇది ఆలస్యానికి ప్రధాన కారణంగా ఉంది.

తీర్పు ఎలా ఉండే అవకాశముంది?

తీర్పు ఎలా వస్తుందనేది కోర్టు తుది నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ, రాజ్యాంగ పరిధి, ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తీర్పు ముఖ్యమైన మూడు విధాలుగా వెలువడే అవకాశం ఉంది.

1. అనర్హత వేటు

రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ (ఎ) అధికరణం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజ్యాంగ నియమాల ఉల్లంఘన చేసినట్టుగా భావించి కోర్టు వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది స్పీకర్ నిర్ణయాలపై ఆధారపడే అంశం కూడా కావొచ్చు.

2. స్పీకర్ నిర్ణయానికే వదిలేయవచ్చు

ఎంపికైన సభ్యుల అనర్హత నిర్ణయం స్పీకర్ అధికారం కింద వస్తుందని పేర్కొంటూ, కోర్టు వ్యవస్థాపక బాధ్యత స్పీకర్‌దే అని వ్యాఖ్యానించవచ్చు. ఇలాంటి తీర్పులు గతంలో చోటు చేసుకున్నవి. అయితే, తటస్థతపై సందేహాలున్నప్పుడు కోర్టు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది.

3. పిటిషన్ తిరస్కరణ:

పిటిషన్‌లో న్యాయపరమైన లోపాలుంటే లేదా ప్రాసెస్ సమర్థంగా జరగలేదని భావిస్తే కోర్టు పిటిషన్‌ను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే పిటిషన్ ఇప్పటికే విచారణ పూర్తై, తుది తీర్పునుకు వచ్చింది.

సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు సంచలనమై తెలంగాణతోపాటు దేశ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. దేశంలోని మొత్తం రాజకీయ సమీకరణలే మారవచ్చు? మలుపులకు కారణం కావచ్చు. అయితే, స్పీకర్ నిర్ణయానికి సంబంధించి కాల పరిమితి విధించే తీర్పులేవీ ఇప్పటి వరకు వెలువడలేదు. ఇప్పుడు వెలువడితే ఇదే కీలకం మాత్రమే కాదు సంచలనం కానున్నది. ఇంతకీ సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఉండనున్నదన్నది మరికొద్దసేపట్లోనే తేలనుంది. తీర్పేదైనా మన ధ్రుఢమైన రాజ్యాంగానికి బలమైనదిగానే ఉండనుంది.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News