Sunday, August 9, 2026
26.1 C
Hyderabad

అమెరికాలోనూ ట్రంప్‌ కు వ్యతిరేకత!|EDITORIAL

అధికారాంతమున చూడవలె అయ్యవారల ఆగడములు.. అన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అధికారంలో ఉండగానే చూడకూడనివి కూడా చూసేస్తున్నారు. ఇంటా బయటా భయంకరమైన వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నారు. ఏడాది తిరగక ముందే ఆయనకు, ఆయన రిపబ్లకన్ పార్టీకి అమెరికాలోనే వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం ఆయన వ్యవహార శైలికి నిదర్శనం. ట్రంప్ తీరుపై అసహనం అమెరికా ప్రజల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రపంచ నాయకత్వం వహించాల్సిన స్థితిలో ఆయన దేశాన్ని అంతర్గతంగా విభజించి, అంతర్జాతీయంగా ఒంటరిని చేశాడు. అమెరికా ‘ప్రపంచానికి పెద్దన్న’ పాత్రను కోల్పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు, ట్రంప్‌కు వ్యతిరేకంగా గట్టిగా పలికిన ప్రజా స్వరం.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

అధికారాంతమున చూడవలె అయ్యవారల ఆగడములు.. అన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అధికారంలో ఉండగానే చూడకూడనివి కూడా చూసేస్తున్నారు. ఇంటా బయటా భయంకరమైన వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నారు. ఏడాది తిరగక ముందే ఆయనకు, ఆయన రిపబ్లకన్ పార్టీకి అమెరికాలోనే వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం ఆయన వ్యవహార శైలికి నిదర్శనం.
అమెరికా రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా కుడి పక్ష రాజకీయాల పరాకాష్టగా ఉండేది. కానీ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత ఏడాదిలోనే తన తీరు, వ్యాఖ్యలు, ఆగ్రహపూరిత వైఖరితో, యుద్ధ కాంక్షతో, శాంతి ప్రవచనాలతో విస్తృతమైన వ్యతిరేకతను సంపాదించుకున్నారు. ఇప్పుడీ వ్యతిరేకత అమెరికా స్థానిక ఎన్నికల్లో ప్రస్ఫుటించింది. అమెరికాలో కొత్త రాజకీయ శకం ప్రారంభమవుతోందా?

ట్రంప్ తీరుపై అసహనం అమెరికా ప్రజల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రపంచ నాయకత్వం వహించాల్సిన స్థితిలో ఆయన దేశాన్ని అంతర్గతంగా విభజించి, అంతర్జాతీయంగా ఒంటరిని చేశాడు. అమెరికా ‘ప్రపంచానికి పెద్దన్న’ పాత్రను కోల్పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు, ట్రంప్‌కు వ్యతిరేకంగా గట్టిగా పలికిన ప్రజా స్వరం.
మొన్న అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ గెలుపులు రిపబ్లికన్ శిబిరంలో కలకలం రేపాయి. న్యూయార్క్, వర్జీనియా, న్యూజెర్సీ వంటి కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆసియా, ఆఫ్రికా సంతతికి చెందిన పౌరులు ప్రజల మద్దతుతో గెలవడం జాత్యహంకారం, వర్ణవివక్షపై ప్రజాస్వామ్య విలువల విజయగీతంలా మారింది.

న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ మమ్దానీ విజయం ట్రంప్‌కు నైతికంగా పెద్ద ఎదురుదెబ్బ. వలసల వ్యతిరేకత, ముస్లింలపై విరోధం, సంపన్నులపై సానుకూలత కలగలిసిన ట్రంప్ రాజకీయాలు మమ్దానీ ఓ ప్రజా నాయకుడిగా ఎదగడంలో మరింత బలంగా పనిచేశాయి.

న్యూయార్క్ మహానగరం. అమెరికా ఆర్థిక, సాంస్కృతిక గుండెకాయ. 90 లక్షల జనాభా, 254 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఉన్న ఈ నగర మేయర్ పదవికి యువ నాయకుడు మమ్దానీ ఎన్నికవడం చారిత్రాత్మకం. డెమోక్రాటిక్ సోషలిజం సిద్ధాంతాన్ని నమ్మిన ఆయన, ‘అమెరికాకు కుబేరులు కాదు, ప్రజలే బలం’ అని ధైర్యంగా ప్రకటించారు.అతని వైఖరి సంపన్న వర్గాలను అసహనానికి గురి చేసింది. పెద్ద వ్యాపారవేత్తలు కోట్ల డాలర్లతో ప్రచారాన్ని నడిపి ఆయనను ఓడించాలనుకున్నారు. కానీ పేద ప్రజల చిన్నచిన్న విరాళాలతో మమ్దానీ ప్రచారం జరిపి, చివరకు విజయం సాధించారు.

ఎన్నికల సమయంలో ట్రంప్ మమ్దానీని ‘కమ్యూనిస్టు ముప్పు’గా వర్ణించి, ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించారు. ‘మమ్దానీ గెలిస్తే నగరానికి నిధులు ఇవ్వను’ అని బెదిరించారు. కానీ ప్రజలు ఈ భయోత్పాత రాజకీయాన్ని తిప్పికొట్టారు. ట్రంప్ జాతీయవాద నినాదాలకు బదులుగా మమ్దానీ ప్రజాస్వామ్య, సంక్షేమ వాగ్దానాలను విశ్వసించారు.

‘అణ్వస్త్రాల కన్నా ప్రజలకు అన్నవస్త్రాలు ముఖ్యం’ అన్న మమ్దానీ నినాదం ప్రజల్లో ప్రగాఢ నమ్మకాన్ని రేకెత్తించింది. వలసదారుల హక్కులు, విద్య, వైద్య సదుపాయాలు, గృహవసతి వంటి అంశాలను ఆయన ప్రధాన అజెండాగా పెట్టుకోవడం, వలస వర్గాల్లోనూ, యువతలోనూ విస్తృత మద్దతు లభించింది.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక వలస వ్యతిరేక విధానాలు కఠినంగా అమలయ్యాయి. ముస్లిం దేశాల పౌరులపై వీసా నిషేధాలు, వలసదారుల శిబిరాలపై దారుణ చర్యలు, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం వంటి నిర్ణయాలు బయటి దేశాల్లోనేగాక సొంత దేశంలోనూ విపరీతమైన అసహనాన్ని కలిగించాయి.
ఈ నేపథ్యంలో మమ్దానీ, గజాలా హష్మీ, ఆఫ్తాబ్ పురేవాల్ వంటి వలస సంతతికి చెందిన నాయకుల విజయాలు అమెరికా సమాజంలో మారుతున్న ఆలోచనా ధోరణికి సంకేతం. ఇది కేవలం వ్యక్తిగత విజయమేగాక, వలసదారుల గౌరవం, సమాన హక్కుల సాధనలో ప్రజాస్వామ్య విజయగీతం.
న్యూయార్క్ లో మమ్దానీతో పాటు వర్జీనియాలో గజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, సిన్‌సినాటీలో ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి మేయర్‌గా గెలవడం డెమోక్రాట్లలో కొత్త ఉత్సాహానికి నాందీ పలికింది. వీరంతా మధ్యతరగతి, వలసదారుల వర్గాల నుండి ఎదిగిన నేతలు కావడం, ప్రజా శ్రేయస్సు, సంక్షేమంపై ఆధారపడి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం.

ఒకరకంగా ఇది అమెరికా రాజకీయాల్లో ‘డబ్బు ఆధిపత్యం’పై మొదలైన ప్రజాస్వామ్య తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు. “బెర్నీ శాండర్స్” తరహా మితవాద సామాజిక సిద్ధాంతాలు మళ్లీ ప్రాముఖ్యం పొందుతున్నాయని భావించవచ్చు. మమ్దానీ కూడా తన విజయాన్ని ‘చీకటిలో కాంతిరేఖ’గా అభివర్ణించడం ఈ మార్పుకు ప్రతీక.

మమ్దానీ విజయం కేవలం న్యూయార్క్ కే పరిమితం కాలేదు. అమెరికా రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రిపబ్లికన్ పార్టీ ఉడుం పట్టులో బిగుసుకుపోయిన రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని మళ్లీ వెలిగించింది. ట్రంప్ విద్వేష రాజకీయాల పరాకాష్టపై ప్రజల తీర్పు ఇది.
సామాన్యుల సమస్యలే దేశ బలం అని చాటిన మమ్దానీ, ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అనే ట్రంప్ నినాదాన్ని తలకిందులు చేశారు. ‘అమెరికా గొప్పది అవ్వాలంటే, ప్రజల జీవితాలు గొప్పవిగా మారాల’ని మమ్దానీ అంటున్నారు.

అమెరికాలో మమ్దానీ, హష్మీ, పురేవాల్ విజయాలు ట్రంప్ రాజకీయాలకు చెంపపెట్టు లాంటివి. ఈ విజయాలు అమెరికా సమాజంలో వలసదారుల, మైనారిటీల, యువత యొక్క కొత్త ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న వలస, ముస్లిం వ్యతిరేక రాజకీయాలు ఎంతో కాలం మనజాలవని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు.

అమెరికా ప్రజాస్వామ్యంలో విభజన, విద్వేషం కాదు, ఐక్యత, మానవతా విలువలే ముఖ్యమని, ట్రంప్‌ రాజకీయాలను తిప్పికొట్టి, మమ్దానీ వంటి నేతలు ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని తిరిగి ప్రజల హృదయాల్లో నాటుతున్నారు. అమెరికా రాజకీయాల్లో ఈ కొత్త ఆలోచనలు ఒక చరిత్రాత్మక మలుపు. మమ్దానీ విజయంతో ప్రారంభమైన ఈ మార్పు, అమెరికా మాత్రమే కాదు ప్రపంచ ప్రజాస్వామ్యాలకు కూడా ప్రేరణగా నిలుస్తోంది.

Latest News

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News