వరంగల్, జూలై 2(అడుగు న్యూస్): WARANGAL| ఓరుగల్లు POLITICS| రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎవరైనా సరే వాళ్ళు ఎర్రబల్లులేనని EX MLC| మాజీ ఎమ్మెల్సీ KONDA MURALIDHAR RAO| కొండా మురళీధర్ రావు విమర్శించారు. వరంగల్ ఓసిటీ MINISTER| మంత్రి కొండా సురేఖ |KONDA SUREKHA క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొండా మురళీధర్రావు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం వరంగల్ PARLIAMENT| పార్లమెంటు నియోజకవర్గ CONGRESS PARTY| కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చిట్ల సత్యనారాయణ, ఇతర CARPORETORS| కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని, LB STADIUM| ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు WARANGAL EAST| వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. BRS| భారాస నేత ఎర్రబెల్లి దయాకర్రావు, BJP| భాజపా నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, DCC| డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ఉద్దేశించి కొండా మురళీ తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రబెల్లి ఇంటి పేరు ఉన్నోళ్లు ఎర్ర బల్లులేనన్నారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి సురేఖమ్మను గెలిపించిన విషయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని కులాలకు భవనాలు కట్టిస్తామన్నారు. డివిజన్ల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులు, స్థానిక కార్పొరేటర్ల చేతుల మీదుగా తీసుకోవాలని సూచించారు.

