Monday, July 13, 2026
29.3 C
Hyderabad

సారొస్తారా?|KCR|REVANTH REDDY|CM|POLITICS|TELANGANA

SAVAL|సవాల్ కి నిలుస్తారా?

సీఎం, మాజీ సీఎంల సవాళ్ళతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. “ప్రజల్లోకి వస్తాం, ప్రభుత్వం తోలు తీస్తాం” అని కేసీఆర్, “నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే నా శపథం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపధ్యంలో సహజంగా తలెత్తుతున్న ప్రశ్న: కేసీఆర్ నిజంగానే ప్రజల్లోకి వచ్చి రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తారా? లేక వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తారా?

హైదరాబాద్, డిసెంబర్ 25 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన మాజీ కేసీఆర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్ ప్రకటించారు. రెండేళ్లు ఆగాం. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తా.. తోలు తీస్తామన్నారు. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు.ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబం కాలకూట విషం. కేసీఆర్, బీఆర్ఎస్ చరిత్ర ఖతమే. ఇక గతమే. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. 2029లో రెండింట్ల మూడొంతల మెజార్టీతోని కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఇదే నా సవాల్ అంటూ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వనంటూ శపథం పూనారు.

మారిన రాజకీయ సమీకరణలు
బీఆర్ఎస్ పదేళ్ళ పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారాయి. రేవంత్ రెడ్డి తన సహజ రాజకీయ శైలిలో బీఆర్ఎస్, కేసీఆర్ పై దూకుడు, వాగ్దాడిని ప్రధానాస్త్రాలుగా సంధిస్తున్నారు. కేసీఆర్ పై కుటుంబం పాలన, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ, కేసీఆర్.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత దాదాపు మౌనంగా ఉంటున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఎంపిక చేసుకున్న అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. మాట్లాడుతున్నారు. అయితే ఈ మౌనం బలహీనతా? రాజకీయ వ్యూహమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వ్యూహాత్మక వాగ్దాడి రేవంత్ ఎజెండా
రేవంత్ రెడ్డి సవాళ్ల వెనుక మాత్రం స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. గత పాలనను నిరంతరం ప్రశ్నించడం ద్వారా ప్రజా అజెండాను నియంత్రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులకు, ప్రభుత్వానికి నైతిక బలం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్‌ను ఆత్మ రక్షణలోకి నెడుతున్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ రాజకీయ వర్తమానాన్ని, భవిష్యత్తును నియంత్రిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించకపోతే ‘భయపడుతున్నట్లు’, స్పందిస్తే కాంగ్రెస్ చెప్పే ఆరోపణల చర్చ మరింత విస్తరించే వ్యూహాన్ని సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అపర రాజకీయ నిపుణడిగా పేరున్న కేసీఆర్, ఈ రెండింటి మధ్య చిక్కుకున్నారా?

కేసీఆర్ ముందున్న మూడు మార్గాలు
కేసీఆర్‌ ముందు ప్రస్తుతం మూడు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి.

ఒకటి నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం: కేసీఆర్ రేవంత్ సవాల్‌ను స్వీకరించి నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలి. బహిరంగ సభలు, పర్యటనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి. అయితే, దర్యాప్తులో ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి వంటి కేసులు, రాజకీయ, న్యాయపరమైన ఒత్తిళ్లు కేసీఆర్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రెండు వ్యూహాత్మక ప్రతిస్పందన: రేవంత్ వ్యాఖ్యలకు అదేపనిగా స్పందించకుండా, వ్యూహాత్మక సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ మాట్లాడటం అనేది వ్యూహాత్మక స్పందన. ఇది కేసీఆర్ రాజకీయ పరిపక్వతను ప్రదర్శించినప్పటికీ, రేవంత్ రెడ్డి దూకుడైన, పదునైన వ్యాఖ్యల వాతావరణంలో కేసీఆర్ ప్రభావాన్ని తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది.

మూడు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ముందుకుతేవడం: కేసీఆర్ తెరవెనుకే ఉంటూ, కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ ఇతర నాయకత్వాన్ని రంగంలోకి దింపి పోరాటాలు చేసే పని ఇప్పుడు చేస్తున్నారు. అయితే వారిద్దరి చుట్టూనే మొత్తం బీఆర్ఎస్ నడవడం ప్లస్ కంటే మైనసే ఎక్కువ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ రేవంత్ దూకుడు ముందు నిలువలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. ఈ వ్యూహం పార్టీ పునర్నిర్మాణానికి తోడ్పడవచ్చు. కానీ, ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో, దీర్ఘాకాలిక విజయాలకి కేసీఆర్ స్థాయికి సరిపోతారా? అన్న చర్చా గులాబీల్లో గుబులు రేపుతోంది.

ప్రజాభిప్రాయమే కీలకం
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అంతిమం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆర్థిక పథకాలు, పాలనలో పారదర్శకత, అభివృద్ధి ప్రజలను ఏ మేరకు సంతృప్తిపరుస్తుందన్నదే రేవంత్ దూకుడుకు బలం, బలహీనత. అదే సమయంలో, బీఆర్ఎస్ పాలనలో సాధించిన సంక్షేమం, మౌలిక వసతులు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను కేసీఆర్, ఎంత సమర్థంగా నిర్వహిస్తారన్నదే కీలకం.

సారొస్తారా?
కేసీఆర్ పూర్తిగా ప్రజల్లోకి రాకుండా ఉండటం దీర్ఘకాలంలో బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అయినా, అజెండాను నిరంతరం ప్రత్యర్థి నియంత్రిస్తున్నప్పుడు ఆ మౌనం ప్రభావాన్ని చూపదు. ఇదే సమయంలో కేసీఆర్, దూకుడుగా రంగంలోకి దిగే బదులు, అంశాల వారీగా, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టమైన ప్రత్యామ్నాయంతో ప్రజల్లోకి వెళ్ళడం కేసీఆర్ ముందున్న దారి.

నిజానికి రేవంత్ రెడ్డి సవాళ్ళ లక్ష్యం కేసీఆర్ ను రాజకీయ బరిలోకి లాగడమే. కేసీఆర్ దాన్ని ఏ రూపంలో స్వీకరిస్తారు? ఏ విధంగా స్పందిస్తారన్నదే తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి రావడం అనివార్యమే అయినా, అది భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక స్పష్టతతో జరిగితేనే బీఆర్ఎస్‌కు ప్రయోజనం. ఈ రాజకీయ యుద్ధంలో గెలుపు ఎవరిది అనేది కాదు. ప్రజలకు ఎవరు విశ్వసనీయంగా కనిపిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News