Friday, March 13, 2026
24.7 C
Hyderabad

సారొస్తారా?|KCR|REVANTH REDDY|CM|POLITICS|TELANGANA

SAVAL|సవాల్ కి నిలుస్తారా?

సీఎం, మాజీ సీఎంల సవాళ్ళతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. “ప్రజల్లోకి వస్తాం, ప్రభుత్వం తోలు తీస్తాం” అని కేసీఆర్, “నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే నా శపథం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపధ్యంలో సహజంగా తలెత్తుతున్న ప్రశ్న: కేసీఆర్ నిజంగానే ప్రజల్లోకి వచ్చి రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తారా? లేక వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తారా?

హైదరాబాద్, డిసెంబర్ 25 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన మాజీ కేసీఆర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్ ప్రకటించారు. రెండేళ్లు ఆగాం. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తా.. తోలు తీస్తామన్నారు. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు.ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబం కాలకూట విషం. కేసీఆర్, బీఆర్ఎస్ చరిత్ర ఖతమే. ఇక గతమే. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. 2029లో రెండింట్ల మూడొంతల మెజార్టీతోని కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఇదే నా సవాల్ అంటూ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వనంటూ శపథం పూనారు.

మారిన రాజకీయ సమీకరణలు
బీఆర్ఎస్ పదేళ్ళ పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారాయి. రేవంత్ రెడ్డి తన సహజ రాజకీయ శైలిలో బీఆర్ఎస్, కేసీఆర్ పై దూకుడు, వాగ్దాడిని ప్రధానాస్త్రాలుగా సంధిస్తున్నారు. కేసీఆర్ పై కుటుంబం పాలన, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ, కేసీఆర్.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత దాదాపు మౌనంగా ఉంటున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఎంపిక చేసుకున్న అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. మాట్లాడుతున్నారు. అయితే ఈ మౌనం బలహీనతా? రాజకీయ వ్యూహమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వ్యూహాత్మక వాగ్దాడి రేవంత్ ఎజెండా
రేవంత్ రెడ్డి సవాళ్ల వెనుక మాత్రం స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. గత పాలనను నిరంతరం ప్రశ్నించడం ద్వారా ప్రజా అజెండాను నియంత్రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులకు, ప్రభుత్వానికి నైతిక బలం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్‌ను ఆత్మ రక్షణలోకి నెడుతున్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ రాజకీయ వర్తమానాన్ని, భవిష్యత్తును నియంత్రిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించకపోతే ‘భయపడుతున్నట్లు’, స్పందిస్తే కాంగ్రెస్ చెప్పే ఆరోపణల చర్చ మరింత విస్తరించే వ్యూహాన్ని సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అపర రాజకీయ నిపుణడిగా పేరున్న కేసీఆర్, ఈ రెండింటి మధ్య చిక్కుకున్నారా?

కేసీఆర్ ముందున్న మూడు మార్గాలు
కేసీఆర్‌ ముందు ప్రస్తుతం మూడు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి.

ఒకటి నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం: కేసీఆర్ రేవంత్ సవాల్‌ను స్వీకరించి నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలి. బహిరంగ సభలు, పర్యటనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి. అయితే, దర్యాప్తులో ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి వంటి కేసులు, రాజకీయ, న్యాయపరమైన ఒత్తిళ్లు కేసీఆర్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రెండు వ్యూహాత్మక ప్రతిస్పందన: రేవంత్ వ్యాఖ్యలకు అదేపనిగా స్పందించకుండా, వ్యూహాత్మక సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ మాట్లాడటం అనేది వ్యూహాత్మక స్పందన. ఇది కేసీఆర్ రాజకీయ పరిపక్వతను ప్రదర్శించినప్పటికీ, రేవంత్ రెడ్డి దూకుడైన, పదునైన వ్యాఖ్యల వాతావరణంలో కేసీఆర్ ప్రభావాన్ని తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది.

మూడు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ముందుకుతేవడం: కేసీఆర్ తెరవెనుకే ఉంటూ, కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ ఇతర నాయకత్వాన్ని రంగంలోకి దింపి పోరాటాలు చేసే పని ఇప్పుడు చేస్తున్నారు. అయితే వారిద్దరి చుట్టూనే మొత్తం బీఆర్ఎస్ నడవడం ప్లస్ కంటే మైనసే ఎక్కువ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ రేవంత్ దూకుడు ముందు నిలువలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. ఈ వ్యూహం పార్టీ పునర్నిర్మాణానికి తోడ్పడవచ్చు. కానీ, ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో, దీర్ఘాకాలిక విజయాలకి కేసీఆర్ స్థాయికి సరిపోతారా? అన్న చర్చా గులాబీల్లో గుబులు రేపుతోంది.

ప్రజాభిప్రాయమే కీలకం
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అంతిమం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆర్థిక పథకాలు, పాలనలో పారదర్శకత, అభివృద్ధి ప్రజలను ఏ మేరకు సంతృప్తిపరుస్తుందన్నదే రేవంత్ దూకుడుకు బలం, బలహీనత. అదే సమయంలో, బీఆర్ఎస్ పాలనలో సాధించిన సంక్షేమం, మౌలిక వసతులు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను కేసీఆర్, ఎంత సమర్థంగా నిర్వహిస్తారన్నదే కీలకం.

సారొస్తారా?
కేసీఆర్ పూర్తిగా ప్రజల్లోకి రాకుండా ఉండటం దీర్ఘకాలంలో బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అయినా, అజెండాను నిరంతరం ప్రత్యర్థి నియంత్రిస్తున్నప్పుడు ఆ మౌనం ప్రభావాన్ని చూపదు. ఇదే సమయంలో కేసీఆర్, దూకుడుగా రంగంలోకి దిగే బదులు, అంశాల వారీగా, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టమైన ప్రత్యామ్నాయంతో ప్రజల్లోకి వెళ్ళడం కేసీఆర్ ముందున్న దారి.

నిజానికి రేవంత్ రెడ్డి సవాళ్ళ లక్ష్యం కేసీఆర్ ను రాజకీయ బరిలోకి లాగడమే. కేసీఆర్ దాన్ని ఏ రూపంలో స్వీకరిస్తారు? ఏ విధంగా స్పందిస్తారన్నదే తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి రావడం అనివార్యమే అయినా, అది భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక స్పష్టతతో జరిగితేనే బీఆర్ఎస్‌కు ప్రయోజనం. ఈ రాజకీయ యుద్ధంలో గెలుపు ఎవరిది అనేది కాదు. ప్రజలకు ఎవరు విశ్వసనీయంగా కనిపిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News