Friday, July 31, 2026
25.7 C
Hyderabad

కేసీఆర్|KCR ASSEMBLY|అసెంబ్లీకి వస్తారా!?  STRATAGIES|వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంపై కొనసాగుతున్న చర్చ కేవలం ఒక ఎమ్మెల్యే హాజరుకు సంబంధించింది మాత్రమే కాదు. అది ప్రతిపక్ష పాత్ర. ప్రజాస్వామ్య బాధ్యత. కేసీఆర్‌ వస్తే, రాకపోతే ఏమి జరుగుతుంది? ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చర్చలు ఎలా సాగుతాయి? పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులపై చర్చ ఎలా ఉండనుంది?

హైదరాబాద్, డిసెంబర్ 26 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):

అధికారంలో ఉన్నన్నాళ్ళూ కేసీఆర్, సెక్రటేరియట్ కు వస్తారా? రారా? అన్న వాద వివాదాలు, ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా? రారా? అన్న వైపు మళ్ళాయి. కేసీఆర్ మాట్లాడినా, మాట్లాడకపోయినా, అసెంబ్లీకి వచ్చినా, రాకున్నా చర్చల్లో ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్, ఆ పార్టీ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా.. అసెంబ్లీకి రెండంటే రెండే సార్లు వచ్చారు. ఒకటి 2024లో ఆయన తన ప్రమాణ స్వీకారానికి వచ్చినా, అసెంబ్లీ లోపలికి రాలేదు. అదీ స్పీకర్ చాంబర్ లో ముగించి వెళ్ళారు. ఆ తర్వాత 2024 బడ్జెట్ సమావేశానికి ఇలా వచ్చి, అలా వెళ్ళారు. రెండేళ్ళల్లో రెండు సార్లే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్, మూడో ఏట జరుగుతున్న ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? దాదాపు రాకపోవచ్చు. వస్తే గిస్తే, అది సాంకేతికంగా తన ఎమ్మెల్యే పదవికి గండం లేకుండా చూసుకోవడానికేననే వాదన వినిపిస్తున్నది. అయినప్పటికీ, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలని, చర్చల్లో పాల్గొనాలని ప్రభుత్వం పట్టుపడుతున్నది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గమంతా కేసీఆర్ ను రా రమ్మంటున్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి ఆయనకు కొన్ని రాజకీయ, వ్యక్తిగత కోణాలు, వ్యూహాలు ఉండొచ్చు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న నేత ప్రతిపక్షంలో కూర్చోవడం అంత సులువు కాదు. పరిపాలనా శైలి నుంచి ప్రతిపక్ష పాత్రకు మారాల్సిన మానసిక, రాజకీయ సంసిద్ధతకు కొంత సమయం పడుతుంది. సభలో హాజరు కంటే బయట నుంచి రాజకీయ ఒత్తిడి పెంచడం, తమ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే వ్యూహాత్మకతను ఆయన ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రజాస్వామ్యంలో శాసనసభ సభ్యుడిగా సభకు రావడమనే బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారనే విమర్శకు ఆయన గైర్హాజరీ బలం చేకూరుస్తోంది.

ఈసారి ఆయన వస్తారా? వస్తే సాంకేతికంగా సమస్యలు తలెత్తకుండా సంతకం పెట్టి వెళ్ళిపోతారా? చర్చల్లో పాల్గొంటారా? కేసీఆర్ సభకు హాజరైతే అధికార-విపక్షాల మధ్య చర్చలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి, రేవంత్-కేసీఆర్ మధ్య కాదంటే, సీఎం-ప్రతిపక్ష నేతల మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధం జరగొచ్చు. వాద ప్రతివాదనల మధ్య అసలు నిజాలు వెలుగుచూసే అవకాశమూ ఉంది.

అలాగే కేటీఆర్, హరీశ్ రావులకే పరిమితమైన ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ రాకతో ద్విగుణీక్రుతం అవుతుంది. అనుభవజ్ఞుడైన మాజీ సీఎం, సభలో అధికార పార్టీని అదుపు చేయనూ వచ్చు. ఆర్థిక నిర్వహణ, హామీల అమలు, పరిపాలన వంటి అంశాలపై లోతైన చర్చ జరగవచ్చు. ఇది ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉన్నా, ప్రజలకు స్పష్టతనిస్తుంది. అదే సమయంలో, ప్రతిపక్షానికి నాయకత్వ నైతిక బలం, కేసీఆర్ మాటలకు మీడియా ప్రాధాన్యం పెరుగుతుంది. సభలో చర్చలు అర్థవంతంగా, ఆచరణ యోగ్యంగా జరుగుతాయి.

ఒకవేళ కేసీఆర్ సభకు రాకపోతే అసెంబ్లీలో చర్చలు ఏకపక్షమవుతాయి. యథావిధిగా ప్రతిపక్ష విమర్శలు బయటి వేదికలకే పరిమితం అవుతాయి. దీర్ఘకాలంలో ఇది ప్రతిపక్షానికే నష్టం చేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై అధికారిక రికార్డులో ప్రతిపక్ష స్వరం బలహీనపడుతుంది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా మారవచ్చు. కేసీఆర్ సభకు రాకపోవడం రాజకీయ వ్యూహమే అయినా, వ్యూహాత్మక తప్పిదమవుతుంది? ప్రజాభిప్రాయ పరంగా ప్రమాదకరమే.

కేసీఆర్ అసెంబ్లీకి రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన మాజీ సీఎం. కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే. అన్నింటికీ మించి ప్రతిపక్ష నేత. రాజ్యాంగ బద్ధంగా సభో సీఎం తర్వాత స్థానం ప్రపతిపక్ష నేతదే. ఆయన గైర్హాజరీ ప్రభావం వ్యవస్థపై పడుతుంది. కేసీఆర్ సభకు వస్తే, తెలంగాణ రాజకీయాలు చురుగ్గా మారి, మరింత వేడెక్కుతాయి. ఇదంతా కేసీఆర్ కు తెలియంది కాదు. ఎవరో చెప్పాల్సిన అగత్యం ఆయనకు లేదు. కాకపోతే ఆయన ఎవరు చెప్పినా వినరు? ఆచరించరు. తనదైన శైలిలోనే వ్యవహరిస్తారు.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News