Saturday, August 22, 2026
22.7 C
Hyderabad

ప్రియాంక-బెటర్ ఛాయిసేనా!?|EDITORIAL

కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని చూపాలి. రాహుల్‌కు ఉన్న జాతీయ రాజకీయ పోరాట సామర్థ్యాన్ని, ప్రియాంకలోని చర్చల నైపుణ్యాన్ని కలిపి ఉపయోగించగలిగితేనే కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రయోజనం. బలమైన ప్రతిపక్షం అంటే బలమైన ఎక్కువ విషయ పరిజ్ఞానం, మెరుగైన వాదన, విశ్వసనీయ ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇదే.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల పనితీరుకు మరోసారి అద్దం పట్టాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన 19 సమావేశాల్లో లోక్‌సభ నిర్ణీత సమయానికి కేవలం 15% మాత్రమే పనిచేయగా, రాజ్యసభ 33% సమయమే పనిచేసింది. ప్రశ్నోత్తరాల సమయం లోక్‌సభలో కేవలం ఒక శాతం, రాజ్యసభలో 12 శాతం మాత్రమే సాగింది. రెండు సభలు కలిపి 12 బిల్లులు ఆమోదించినప్పటికీ, లోక్‌సభలో ఆమోదమైన 11 బిల్లుల్లో తొమ్మిదింటిపై ఒక్క ఎంపీ కూడా చర్చలో పాల్గొనలేదు.

ఇదే పార్లమెంటులో సభ్యురాలైన ప్రియాంక గాంధీ వాద్రా పాత్ర ఇందుకు భిన్నంగా కనబడుతోంది. ఆమె తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం కూడా చిన్నదే. 2024 నవంబర్‌లో లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పటివరకు 84 శాతం హాజరు నమోదు చేసుకున్నారు. వర్షాకాల సమావేశాల్లో ఆమె హాజరు 95 శాతం. ఇప్పటివరకు 11 చర్చల్లో పాల్గొని, 47 ప్రశ్నలు అడిగారు.

ప్రియాంక పాల్గొన్న చర్చల్లో రాజ్యాంగం, డీలిమిటేషన్, ఎన్నికల వ్యవస్థ, వందేమాతరం, ఆపరేషన్ సిందూర్, మైనారిటీలపై దాడులు, వయనాడ్ వరదలు వంటి అంశాలను ఆమె సభలో ప్రస్తావించారు. 2026 జూలై 28న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై కూడా చర్చలో పాల్గొన్నారు. అంటే ఒకే రాజకీయ నినాదానికో, వాదానికో పరిమితం కాకుండా వివిధ అంశాలను పార్లమెంటరీ చర్చలోకి తీసుకురావడానికి ఆమె ప్రయత్నించారు.

ఇక్కడే రాహుల్ గాంధీతో పోలిక మొదలవుతుంది. రాహుల్ 18వ లోక్‌సభలో ఇప్పటివరకు 17 చర్చల్లో పాల్గొన్నారు, 64 ప్రశ్నలు అడిగారు. నిరుద్యోగం, వ్యవసాయం, ఎరువుల కొరత, గిగ్ కార్మికులు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆహార భద్రత, రైల్వేలు వంటి అంశాలపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంస్కరణలపై కూడా ఆయన చర్చలో పాల్గొన్నారు. రాజకీయ నాయకత్వంలో సమస్యల సంఖ్య కంటే వాటిని ప్రజలకు ఎలా వివరించగలుగుతున్నారన్నది ముఖ్యం. రాహుల్ గాంధీ రాజకీయ ప్రచారంలో ఓటు చోరీ, నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నాయకుడి హక్కే. కానీ ఆరోపణతో పాటు ఆధారాలు, ప్రత్యామ్నాయ విధానాలు, సంస్థాగత సంస్కరణల ప్రతిపాదనలు కూడా చూపాలి.

ఎన్నికల వ్యవస్థ విషయంలో ఇదే ప్రధాన సవాల్. ఎన్నికల వ్యవస్థనే పూర్తిగా అనుమానాస్పదంగా చిత్రీకరించడం ప్రతిపక్షానికే ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ. అందువల్ల ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత, నియామక విధానం, ఓటర్ల జాబితాల నిర్వహణ వంటి అంశాలపై స్పష్టమైన సంస్కరణల ప్రతిపాదనలు చేయడం మరింత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహం.

ప్రియాంకలో కనిపిస్తున్న ప్రత్యేకత ఇక్కడే. ఆమె ప్రసంగాల్లో వ్యక్తిగత దూషణల కంటే అంశాల ఆధారంగా సమాధానం చెప్పే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తోంది. వందేమాతరం చర్చ సందర్భంగా నెహ్రూపై విమర్శలను రాజకీయ చరిత్ర చర్చకు మళ్లించడం, అవసరమైతే నెహ్రూపై రోజంతా చర్చిద్దామని చెప్పడం వంటి వ్యూహాత్మక ప్రతిస్పందనలు సభలో ప్రత్యర్థి ఎజెండాను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. ఇది కేవలం వాక్చాతుర్యం కాదు. రాజకీయ చర్చను తనకు అనుకూలంగా మళ్లించే ప్రయత్నం.

అయితే, ప్రియాంకను వెంటనే రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకటించడం కూడా తొందరపాటు. ఆమెకు 11 పార్లమెంటరీ చర్చల అనుభవమే ఉంది. రాహుల్‌కు 17 చర్చల అనుభవం ఉంది. పైగా ప్రతిపక్ష నేతగా రాహుల్‌కు ఉన్న జాతీయ స్థాయి రాజకీయ బాధ్యత, సంస్థాగత అనుభవం, ఎన్నికల పోరాటాల పరిచయం ప్రియాంకకు ఇంకా అంతగా లేదు. కాబట్టి అన్నాచెల్లెళ్ళ మధ్య పోటీగా కాకుండా నాయకత్వ సామర్థ్యాల పోలికగా చూడాలి.

కాంగ్రెస్‌కు ఇప్పుడు రాజకీయాన్ని వికేంద్రీకరించడం అవసరం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, ఎన్నికల సంస్కరణలు, యువత ఉపాధి, రైతుల ఆదాయం, విద్య, ఆరోగ్యం, ధరల పెరుగుదల వంటి అంశాలపై నిరంతర పార్లమెంటరీ వ్యూహం అవసరం. ప్రియాంకను డీలిమిటేషన్, మహిళా ప్రాతినిధ్యం వంటి అంశాల్లో ముందుకు తెస్తే ఆమె సామర్థ్యం మరింత రాటుదేలే అవకాశం ఉంది.

అయితే, కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని చూపాలి. రాహుల్‌కు ఉన్న జాతీయ రాజకీయ పోరాట సామర్థ్యాన్ని, ప్రియాంకలోని చర్చల నైపుణ్యాన్ని కలిపి ఉపయోగించగలిగితేనే కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రయోజనం. బలమైన ప్రతిపక్షం అంటే బలమైన ఎక్కువ విషయ పరిజ్ఞానం, మెరుగైన వాదన, విశ్వసనీయ ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇదే.

Latest News

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

ఆగస్టు 22, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి దశమి రాత్రి 01.18 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ పగలు 03.33 వరకు ఉపరి మూల యోగం వైధృతి ఉదయం 07.15 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల పగలు 12.18 వరకు ఉపరి గరజి రాహుకాలం...

కొండా సురేఖ చుట్టూ రాజకీయ ఉచ్చు..|KONDA SUREKHA|CONGRESS|CM|REVANTH REDDY

పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన...

గిదో కుక్కల కు.ని. పంచాయితీ!?|ADUGU TRENDS

గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ...

వంటింటిపై ధరల దాడీకి బాధ్యులెవరు!?|EDITORIAL

బియ్యం కిలో ధర ఎంతకు చేరిందన్నది కోట్ల కుటుంబాల వంటింటి సమస్య. అందుకే రాజకీయ ఎజెండాల మధ్య ప్రజల ఎజెండా కనుమరుగుకాకూడదు. ధరల పెరుగుదలను “మా పరిధిలో లేదు” అని చెప్పడం కాదు....

ఆగస్టు 21, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శ్రీ వరలక్ష్మి వ్రతం తిధి శు.నవమి రాత్రి 11.20 వరకు ఉపరి దశమి నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 01.03 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం ఐంద్ర ఉదయం 06.49 వరకు ఉపరి వైధృతి కరణం బాలవ ఉదయం 10.28...

అవును..గ వాల్లు మల్లా మనువాడిండ్రు!?|ADUGU TRENDS

గ వాల్లు ఇప్పటికే ఆలుమొగలు. గవాల్లకు పిల్లలు గూడా ఉన్నరు. గా పిల్లలు సదువుకుంటాండ్రు. గివీల్లు సంసారం కూడా శేసుకుంటాండ్రు. అయినా గవాల్లు కొత్తగా మల్లా మనువాడిండ్రు. మూడుమల్లేసుకున్నరు. ఏడడుగులు నడిసిండ్రు. గట్ల...

బీజేపీ ముందున్న సవాళ్ళివే!?|EDITORIAL

బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ప్రచార వ్యూహాలకంటే పాలనా ఫలితాలపై దృష్టి పెట్టాలి. ధరల నియంత్రణ, ఉపాధి సృష్టి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడం,...

ఆగస్టు 20, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.అష్టమి రాత్రి 09.33 వరకు ఉపరి నవమి నక్షత్రం విశాఖ ఉదయం 10.50 వరకు ఉపరి అనురాధ యోగం బ్రహ్మ ఉదయం 06.33 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 08.54 వరకు ఉపరి బవ రాహుకాలం...

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News