Saturday, June 20, 2026
37.6 C
Hyderabad

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి రావడానికి వాగ్దానాల వర్షం కురిపించడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. సామాన్యుడి ప్రధాన ప్రయాణ సాధనం, రాష్ట్ర ప్రయాణ ప్రగతి రథ చక్రం, ఎర్రబస్సు ఇందుకతీతమేమీ కాదు. పైగా ఈ పరంపర కొనసాగింపే, ప్రస్తుత ఆర్టీసీ సంక్షోభం!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి రావడానికి వాగ్దానాల వర్షం కురిపించడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. సామాన్యుడి ప్రధాన ప్రయాణ సాధనం, రాష్ట్ర ప్రయాణ ప్రగతి రథ చక్రం, ఎర్రబస్సు ఇందుకతీతమేమీ కాదు. పైగా ఈ పరంపర కొనసాగింపే, ప్రస్తుత ఆర్టీసీ సంక్షోభం.

రాష్ట్ర రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆర్టీసీ ప్రతి రోజు 55 నుండి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. 6 వేలకు పైగా బస్సులు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయి. అయితే కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఈ భారీ వ్యవస్థ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళనకరం. కార్మిక సంఘాల జేఏసీ ప్రస్తావించిన 30కి పైగా డిమాండ్లను పరిశీలిస్తే, ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణ, బకాయిల చెల్లింపు వంటి ప్రధాన సమస్యలు ఎన్నో ఏళ్ళుగా, గత ఏడాదిగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

మరి ఈ సమస్యలపై ఇంతకాలంగా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? సమ్మె ముంచుకొచ్చిన తరుణంలో మాత్రమే అధికారుల కమిటీ ఏర్పాటు చేసి నాలుగు వారాల గడువు కోరడం సమస్యను పరిష్కరించాలన్నదాని కంటే కాలయాపనకే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్య ధోరణే కార్మికులను సమ్మెబాట పట్టించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమై, సాధారణ ప్రయాణీకుల జన జీవనం అస్తవ్యస్తమైంది.

ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న వేళ, ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. విద్యార్థులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు..ఇవే ప్రజా రవాణాపై ఆధారపడే వర్గాలు. వీరి దైనందిన జీవనం నేరుగా దెబ్బతింటోంది. ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదు, సామాజిక-ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని సూచించే అంశం.

ఇక ఆర్థిక పరిమితుల విషయానికి వస్తే, రాష్ట్రం ఇప్పటికే భారీ అప్పుల్లో కూరుకుపోయిందనే విషయాన్ని పదేపదే సీఎం స్వయంగా చెబుతున్నారు. అప్పులు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుని, వార్షిక ఆదాయంలో గణనీయమైన భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలు అమలు చేయడం, ఉన్న సంస్థలను ఆదుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. అయినప్పటికీ, ఇది సమస్యలను నిర్లక్ష్యం చేయడానికి కారణం కావడం సమంజసం కాదు.

“మహాలక్ష్మి” పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ఒక పెద్ద సామాజిక సంక్షేమ చర్యగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ పథకం కారణంగా ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడానికి తగిన నిధులు సమయానికి విడుదల కావడం లేదు. ఒకవైపు ఉచిత సేవలు, మరోవైపు ఆదాయం తగ్గుదల ఈ రెండింటి మధ్య ఆర్టీసీ చిక్కుకుపోయింది.

ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన ప్రకటన యువతలో ఆశలు రేకెత్తించింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీ అమలు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరుద్యోగుల్లో నిరాశను పెంచుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? మొదటిగా, ఆర్టీసీ కార్మికులతో తక్షణ చర్చలు జరిపి, కనీసం ముఖ్యమైన డిమాండ్లపై సమయపాలిత కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. రెండవది, ఉచిత పథకాల వల్ల ఏర్పడే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి పారదర్శక నిధుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మూడవది, హామీల అమలుపై నిర్దిష్ట గడువులు పెట్టి, ప్రజలకు బాధ్యతాయుతమైన నివేదికలు ఇవ్వాలి.
అధికారంలోకి రావడం మాత్రమే కాదు, ఆ అధికారాన్ని బాధ్యతగా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. మాటలు, ఆవేశపూరిత ప్రసంగాలు తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో పాలనలో నిజాయితీ, కార్యాచరణే ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాయి. లేనిపక్షంలో, గతంలో జరిగినట్లుగానే ప్రజలు తమ తీర్పును స్పష్టంగా తెలియజేయడానికి వెనుకాడరు.

ఆర్టీసీ సంక్షోభం ఒక హెచ్చరిక. ఇది కేవలం ఒక సంస్థ సమస్య కాదు, పాలనా వైఫల్యాల ప్రతిబింబం. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా ముందడుగు వేసి, కార్మికుల సమస్యలను పరిష్కరించి, ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం అత్యవసరం.

Latest News

జెర పెండ్లి శేసుకోరా…?!|ADUGU TRENDS

పెండ్లిల్లు సర్గంల అయితయి అని ఎందుకన్నరో గనీ, గీ భూమ్మీద మాత్రం లేటైతానయి. బహు కట్టమైతానయి. ఎవర్నడుగు దుర్బిణి యేసి సూసినా, ఆడి పిల్లలు అసలే దొరుకుతలేరంటాండ్రు. మన దగ్గర గిట్లుంటే, మరి...

సమగ్ర పంటల విధానమే రైతుకు రక్ష!|EDITORIAL

వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో లేదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో మాత్రమే ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్‌కు అవసరమైన...

జూన్ 20, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు షష్ఠి రాత్రి 10.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మఖ మధ్యాహ్నం 02.48 వరకు ఉపరి పుబ్బ యోగం వజ్ర సాయంత్రం 06.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ ఉదయం 09.34...

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News