Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి రావడానికి వాగ్దానాల వర్షం కురిపించడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. సామాన్యుడి ప్రధాన ప్రయాణ సాధనం, రాష్ట్ర ప్రయాణ ప్రగతి రథ చక్రం, ఎర్రబస్సు ఇందుకతీతమేమీ కాదు. పైగా ఈ పరంపర కొనసాగింపే, ప్రస్తుత ఆర్టీసీ సంక్షోభం!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి రావడానికి వాగ్దానాల వర్షం కురిపించడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. సామాన్యుడి ప్రధాన ప్రయాణ సాధనం, రాష్ట్ర ప్రయాణ ప్రగతి రథ చక్రం, ఎర్రబస్సు ఇందుకతీతమేమీ కాదు. పైగా ఈ పరంపర కొనసాగింపే, ప్రస్తుత ఆర్టీసీ సంక్షోభం.

రాష్ట్ర రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆర్టీసీ ప్రతి రోజు 55 నుండి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. 6 వేలకు పైగా బస్సులు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయి. అయితే కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఈ భారీ వ్యవస్థ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళనకరం. కార్మిక సంఘాల జేఏసీ ప్రస్తావించిన 30కి పైగా డిమాండ్లను పరిశీలిస్తే, ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణ, బకాయిల చెల్లింపు వంటి ప్రధాన సమస్యలు ఎన్నో ఏళ్ళుగా, గత ఏడాదిగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

మరి ఈ సమస్యలపై ఇంతకాలంగా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? సమ్మె ముంచుకొచ్చిన తరుణంలో మాత్రమే అధికారుల కమిటీ ఏర్పాటు చేసి నాలుగు వారాల గడువు కోరడం సమస్యను పరిష్కరించాలన్నదాని కంటే కాలయాపనకే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్య ధోరణే కార్మికులను సమ్మెబాట పట్టించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమై, సాధారణ ప్రయాణీకుల జన జీవనం అస్తవ్యస్తమైంది.

ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న వేళ, ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. విద్యార్థులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు..ఇవే ప్రజా రవాణాపై ఆధారపడే వర్గాలు. వీరి దైనందిన జీవనం నేరుగా దెబ్బతింటోంది. ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదు, సామాజిక-ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని సూచించే అంశం.

ఇక ఆర్థిక పరిమితుల విషయానికి వస్తే, రాష్ట్రం ఇప్పటికే భారీ అప్పుల్లో కూరుకుపోయిందనే విషయాన్ని పదేపదే సీఎం స్వయంగా చెబుతున్నారు. అప్పులు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుని, వార్షిక ఆదాయంలో గణనీయమైన భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలు అమలు చేయడం, ఉన్న సంస్థలను ఆదుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. అయినప్పటికీ, ఇది సమస్యలను నిర్లక్ష్యం చేయడానికి కారణం కావడం సమంజసం కాదు.

“మహాలక్ష్మి” పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ఒక పెద్ద సామాజిక సంక్షేమ చర్యగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ పథకం కారణంగా ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడానికి తగిన నిధులు సమయానికి విడుదల కావడం లేదు. ఒకవైపు ఉచిత సేవలు, మరోవైపు ఆదాయం తగ్గుదల ఈ రెండింటి మధ్య ఆర్టీసీ చిక్కుకుపోయింది.

ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన ప్రకటన యువతలో ఆశలు రేకెత్తించింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీ అమలు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరుద్యోగుల్లో నిరాశను పెంచుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? మొదటిగా, ఆర్టీసీ కార్మికులతో తక్షణ చర్చలు జరిపి, కనీసం ముఖ్యమైన డిమాండ్లపై సమయపాలిత కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. రెండవది, ఉచిత పథకాల వల్ల ఏర్పడే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి పారదర్శక నిధుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మూడవది, హామీల అమలుపై నిర్దిష్ట గడువులు పెట్టి, ప్రజలకు బాధ్యతాయుతమైన నివేదికలు ఇవ్వాలి.
అధికారంలోకి రావడం మాత్రమే కాదు, ఆ అధికారాన్ని బాధ్యతగా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. మాటలు, ఆవేశపూరిత ప్రసంగాలు తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో పాలనలో నిజాయితీ, కార్యాచరణే ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాయి. లేనిపక్షంలో, గతంలో జరిగినట్లుగానే ప్రజలు తమ తీర్పును స్పష్టంగా తెలియజేయడానికి వెనుకాడరు.

ఆర్టీసీ సంక్షోభం ఒక హెచ్చరిక. ఇది కేవలం ఒక సంస్థ సమస్య కాదు, పాలనా వైఫల్యాల ప్రతిబింబం. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా ముందడుగు వేసి, కార్మికుల సమస్యలను పరిష్కరించి, ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం అత్యవసరం.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News