Saturday, March 14, 2026
24.2 C
Hyderabad

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి

షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రిజర్వేషన్లను పెంచడానికి సహేతుకమైన విధానం పాటించాల్సి ఉన్నందున 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి మేరకు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.

మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టిన ‘షెడ్యూల్డు కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్’ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. రిజర్వేషన్లను పెంచడంతో పాటు దామాషా ప్రకారం గ్రూపు 1, 2, 3 కేటగిరీల వర్గీకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

“ప్రస్తుత రిజర్వేషన్లను పెంచాలంటే సహేతుకమైన విధానం పాటించాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కలు మాత్రమే అధికారికంగా అందుబాటులో ఉన్నాయి. చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక 2026 జనాభా లెక్కలు చేపడితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి వీలవుతుంది” అని వివరించారు.

షెడ్యూల్డు కులాలకు మరింత ప్రయోజనం చేకూర్చే విషయంలో ప్రభుత్వం పారదర్శకమైన కార్యాచరణ చేపడుతుందని, ఇలాంటి విషయాల్లో భేషజాలు లేకుండా అందరినీ సంప్రదించి వారి అభిప్రాయాల మేరకు ముందుకు వెళుతామని వివరించారు.

షెడ్యూల్డు ఉప కులాల వర్గీకరణ బిల్లు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియకు శాసనసభ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో మద్దతు పలికినందుకు సభ్యులందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వర్గీకరణ సమస్యకు శాసనసభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా అభివర్ణించారు.

వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. కృష్ణమాదిగతో పాటు చాలా మంది 30, 35 ఏండ్లపాటు జరిగిన వర్గీకరణ పోరాటంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వడం, ఆ కుటుంబాల్లో విద్యావంతులుంటే రాజీవ్ యువ వికాసం పథకం కింద చేయూతనందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఎస్సీల్లో రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ జరగాలని 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం, ఆ తర్వాత జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నియామకం, ఆ కమిషన్ నివేదిక, తదుపరి అంశం సుప్రీంకోర్టుకు చేరడం వంటి ఎస్సీ వర్గీకరణ అంశంలో చోటుచేసుకున్న సంఘటనల పరిణామ క్రమాన్ని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఎస్సీ శాసనసభ్యులందరూ ఒక కమిటీగా ఢిల్లీ వెళ్లి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనను బలంగా వినిపించడం, సుప్రీంకోర్టు తీర్పు వెలువడటం, ఆ వెంటనే వంద శాతం అమలు చేస్తామంటూ శాసనసభలో ప్రకటన చేసిన పరిణామాలను వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, లోక్ సభ సభ్యుడు డాక్టర్ మల్లు రవి తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, ఆ ఉపసంఘం సూచన మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ నియమాకం, కమిషన్ పనిచేసిన విధానం, నివేదిక వంటి అంశాలన్నీ ముఖ్యమంత్రి సభలో వివరించారు.

కమిషన్ 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం, సామాజిక, విద్య, ఆర్థిక పరంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను పరిగణలోకి తీసుకుని వారికి 1 శాతం రిజర్వేషన్, మధ్యస్థంగా లబ్దిపొందిన కులాలను గ్రూపు 2 కింద 18 ఉపకులాలను పరిగణలోకి తీసుకుని వారికి 9 శాతం రిజర్వేషన్, గణనీయంగా ప్రయోజనం పొందిన కులాలను గ్రూపు 3 కింద పరిగణిస్తూ వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసిన అంశాలను తెలియజేశారు. ఈ అంశంపై శాసనసభ చర్చలో పాల్గొన్న సభ్యులకు, పార్టీలకు ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News