Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

సంక్షోభంలో ఆక్వా వ్యవ‘సాయం’!|EDITORIAL

వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతు పండించిన పంట ప్రజల భోజనపట్టికలోకి చేరాలి. అందుకు ఉత్పత్తి పెంపుతో పాటు మార్కెటింగ్, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ రంగాల్లో ప్రభుత్వాలు సమగ్ర విధానాలు రూపొందించాలి. లేకపోతే ఒకసారి టమోటా రైతు, మరోసారి మిర్చి రైతు, ఇప్పుడు ఆక్వా రైతు ఆయా సీజన్లలోనే గాక, ఏడాది పొడవునా సంక్షోభాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. రైతు కష్టానికి గౌరవం రావాలంటే దేశంలో “ఉత్పత్తి నుంచి వినియోగందారుని వరకు” బలమైన వ్యవస్థను నిర్మించడం తప్ప మరో మార్గం లేదు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కీలకమైనవి. రైతు పండించిన పంటను వినియోగదారుడికి సమర్థవంతంగా చేరవేసే మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలపడలేదు. ఫలితంగా ఒక వైపు రైతు గిట్టుబాటు ధర కోసం కుంగుబాటుకు గురవుతూ, ఆవేదన చెందుతుంటే, మరోవైపు వినియోగదారుడు అధిక ధరలు చెల్లించి జేబుకు చిల్లులు పెట్టుకునే పరిస్థితి దాపురించింది. మదనపల్లి టమోటా, నిజామాబాద్ పసుపు, గుంటూరు మిర్చి, తెలంగాణ మక్కజొన్న, ఆంధ్రప్రదేశ్ రొయ్యలు… ఏ ఉత్పత్తిని పరిశీలించినా సమస్య మూలం మార్కెటింగ్ లోపాలే అన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం కూడా ఇదే వాస్తవాన్ని మరోసారి బయటపెడుతోంది.

ఆక్వా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా నిలిచింది. దేశ మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 35–40 శాతం వరకు రాష్ట్రం వాటా కలిగి ఉంది. ప్రతి ఏడాది రూ.25 వేల కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 4.7 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవనాధారం ఈ రంగంపైనే ఆధారపడి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారు. అమెరికా విధించిన దిగుమతి సుంకాలు, అంతర్జాతీయ ధరల పతనం, ఫీడ్ ధరల పెరుగుదల, వ్యాధులు, ఇంధన వ్యయాల పెంపు వంటివన్నీ కలిసి రైతును ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారత రొయ్యలపై విధించిన అధిక సుంకాల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతీయ రొయ్యలపై 60 శాతం వరకు పన్నుల భారం పెరగడంతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో రొయ్యల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పడిపోయాయి. ఎగుమతులపై అధికంగా ఆధారపడిన వ్యవస్థలో విదేశీ మార్కెట్ కుదేలైతే రైతు ఆదాయం కూడా ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అమెరికాతో సమర్థవంతమైన చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన ఫలితాలు కనిపించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు తాత్కాలిక హామీలు ఇవ్వడం తప్ప, దీర్ఘకాలిక మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచిన సందర్భాల్లో రైతుల ఆందోళనలతో ప్రభుత్వం జోక్యం చేసుకున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. ఫిబ్రవరిలో కిలో ఫీడ్‌పై రూ.4 పెంచిన కంపెనీలు, తిరిగి రూ.10 వరకు పెంచేందుకు ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం ప్రకారం రైతులతో సంప్రదింపులు జరపకుండా ధరలు పెంచకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి అమలులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ అసలు సమస్య ఉత్పత్తిలో కాదు, మార్కెటింగ్ వ్యవస్థలో ఉంది. దేశంలో ఏ ప్రాంతంలో ఏ పంట అధికంగా పండినా, అది మరో ప్రాంత వినియోగదారునికి చేరేలా సమర్థవంతమైన సరఫరా వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోలేదు. రైతు వద్ద తక్కువ ధరకు అమ్ముడవుతున్న పంట, నగర మార్కెట్లలో అధిక ధరకు విక్రయమవుతోంది. మధ్యవర్తులే అధిక లాభాలు పొందుతున్నారు. సరైన కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, రిఫ్రిజిరేటెడ్ రవాణా, ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ-మార్కెట్ వేదికలు లేకపోవడం వల్ల రైతు తన ఉత్పత్తిని దేశవ్యాప్తంగా విక్రయించే అవకాశాలు కోల్పోతున్నాడు.

ప్రస్తుతం అత్యవసరంగా అవసరమైనది దేశీయ మార్కెట్‌ను బలపరచడమే. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో చేపలు, రొయ్యలు ఇంకా సాధారణ ప్రజల ఆహారంలో విస్తృత స్థాయిలో భాగం కాలేకపోవడం విచారకరం. ప్రజలలో ప్రోటీన్ ఆహారంపై అవగాహన పెంచుతూ, చేపలు, రొయ్యలను పోషకాహార కార్యక్రమాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. సైన్యం, హాస్టళ్లు, హాస్పిటల్స్, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలలో ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు నేరుగా రైతుల నుంచి రొయ్యలు సరఫరా చేసే శాశ్వత నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలి.
అలాగే వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలి. మన మక్కజొన్నను ‘కార్న్ ఫ్లేక్స్’ గా విదేశీ కంపెనీలు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నట్లే, రొయ్యలను కూడా ఫ్రోజన్ ఫుడ్స్, రెడీ టు కుక్ ఉత్పత్తులు, ప్రాన్ పికిల్స్, డ్రైడ్ ప్రాన్ రూపంలో మార్కెట్ చేయవచ్చు. దీని ద్వారా రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతు పండించిన పంట ప్రజల భోజనపట్టికలోకి చేరాలి. అందుకు ఉత్పత్తి పెంపుతో పాటు మార్కెటింగ్, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ రంగాల్లో ప్రభుత్వాలు సమగ్ర విధానాలు రూపొందించాలి. లేకపోతే ఒకసారి టమోటా రైతు, మరోసారి మిర్చి రైతు, ఇప్పుడు ఆక్వా రైతు ఆయా సీజన్లలోనే గాక, ఏడాది పొడవునా ఇలా సంక్షోభాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. రైతు కష్టానికి గౌరవం రావాలంటే దేశంలో “ఉత్పత్తి నుంచి వినియోగదారుని వరకు” బలమైన వ్యవస్థను నిర్మించడం తప్ప మరో మార్గం లేదు.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News