Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

భారతీయ ‘ఆత్మ’ను ఆవిష్కరిద్దామా!?|EDITORIAL

‘మహాత్మా గాంధీ ఉపాధి హామీ’ పథకాన్ని ‘బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజన’ పథకంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. భారతదేశంలో ఊళ్ళు, పట్టణాలు, ప్రభుత్వ పథకాలు, వీధుల పేర్లు మారుస్తూ ఉండటం ఇటీవలి కాలంలో ఒక ప్రధాన రాజకీయ, సామాజిక అంశంగా మారింది.

భారతదేశంలో పేర్ల మార్పు కొత్తేమీ కాదు. ఇంతకుముందు. 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌ను కేరళగా, 1996లో మద్రాస్ ను చెన్నైగా, 2001లో కలకత్తా ను కోల్‌కతా గా, 2011లో ఒరిస్సాను ఒడిషాగా, 2006లో పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు. 2016లో ప్రధాని అధికారిక నివాసం పేరును ‘లోక్ కళ్యాణ్ మార్గ్’గా, ‘రాజ్‌పథ్‌’ను ‘కర్తవ్య పథ్’గా, తాజాగా ప్రధాని కార్యాలయానికి ‘సేవాతీర్థ్’గా, రాష్ట్ర గవర్నర్ల నివాసాలు ‘రాజ్‌భవన్‌’లను ‘లోక్ భవన్’గా మార్చడం తెలిసిందే. ఇదే కోవలో ఉపాధి హామీ పథకానికి కూడా పేరు మార్చారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చిన పేర్లే ఎక్కువ వివాదాస్పదమవుతున్నాయి.
ఈ ప్రక్రియ కొందరికి చరిత్ర పునరుద్ధరణగా అనిపిస్తే, మరికొందరికి రాజకీయ దురుద్దేశంగా, ప్రజాధన దుర్వినియోగంగా కనిపిస్తోంది. పేరు కేవలం ఒక గుర్తింపేనా, లేక ప్రజల భావోద్వేగాలకు, చరిత్ర జ్ఞాపకాలకు, ప్రాధాన్యాలకు ప్రతీకనా? పేర్ల మార్పు సమంజసమా? నిజంగా మార్చాల్సిన అవసరం ఉందా? ఉంటే ఏ మేరకు?

దేశం సహా, రాష్ట్రాలు, ప్రాంతాలు, ఊర్లు, పట్టణాలు, గ్రామాలు, వీధులు, మనుషుల పేర్లకు భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంటుంది. వాటన్నింటి ప్రభావం ఆయా పేర్లపై ఉంటుంది. ఆర్యులు, ముస్లింలు, బ్రిటీషర్లు మొదలైన వలస పాలనల కాలంలో, అనేక పేర్లు మార్పు జరిగింది. ఆ పేర్లు ఇప్పుడు స్థానిక సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను ప్రతిబింబించవు అనే వాదన ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రాచీన చరిత్రను, స్థానిక గుర్తింపును ప్రతిఫలించే పేర్లను పునరుద్ధరించడం అవసరమా? ఇది నిజంగా ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించి, సాంస్కృతిక అవగాహనను బలపరుస్తుందా? అయితే, పేర్ల మార్పు అన్నది కేవలం రాజకీయ ప్రేరేపిత భావోద్వేగాల ఎజెంగా జరిగితే సమస్యలు తలెత్తుతాయి.
పేరు చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఊరు, వీధి పేర్లు తరతరాలుగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. పేరు ద్వారా ఆ ప్రాంత చరిత్ర, సామాజిక పరిణామాలు, సాంస్కృతిక నేపథ్యం వెల్లడవుతాయి. అలాంటి పేర్లను తరచూ మారిస్తే చరిత్రను చెరిపేయడమేనా? చరిత్రలోని తప్పులను సరిదిద్దడమే లక్ష్యమైతే, పేర్ల మార్పు కంటే చరిత్రపై అవగాహన పెంపొందించడం, విద్య ద్వారా నిజాలను ప్రజలకు తెలియజేయడం ఉత్తమ మార్గం కాదా?

ప్రభుత్వాలు తమ భావజాలానికి అనుగుణంగా పేర్లు మార్చడం ద్వారా తమ రాజకీయ అజెండాను అమలుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో సహజమేనని కొందరు వాదిస్తే, మరికొందరు దీనిని అధికార దుర్వినియోగంగా చూస్తారు. ప్రజల ప్రాథమిక సమస్యలు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు. వీటిని విస్మరించి, పేర్ల మార్పులపై దృష్టి పెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమనే విమర్శ బలంగా వినిపిస్తోంది.

పేర్ల మార్పు పరిపాలనా వ్యయభారం. ఒక ఊరు లేదా పట్టణం పేరు మారితే, ప్రభుత్వ పత్రాలు, మ్యాపులు, బోర్డులు, రికార్డులు, డిజిటల్ డేటాబేసులు అన్నీ మార్చాల్సి వస్తుంది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతుంది. ఆ ఖర్చు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. పేరు మార్పు వల్ల ప్రయోజనం లేకపోతే, ఆ వ్యయం న్యాయసమ్మతమా? ఆలోచించాలి.

సాధారణంగా ప్రభుత్వ పథకాల పేర్లు ప్రజలకు గుర్తుండేలా, ఆకర్షణీయంగా పెడతారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పథకాల పేర్లు మారితే, ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. అసలు సమస్య పథకం పేరు కాదు, ఆ పథకం అమలు. పేర్లు మారుస్తూ పాత పథకాలను కొత్తవిగా చూపించడం వల్ల ప్రజలకు వాస్తవ ప్రయోజనం కలగదు. ఇదంతా ‘పేర్ల రాజకీయం’గా మాత్రమే మిగిలిపోతుంది.
అదేవిధంగా, చరిత్రను పూర్తిగా తిరస్కరించడం కూడా సరైనది కాదు. చరిత్రలో మంచి, చెడులుంటాయి. పేర్ల మార్పు ద్వారా చరిత్రను సరిదిద్దగలమనే భావన భ్రమ మాత్రమే. బదులుగా, చరిత్రను విమర్శనాత్మకంగా అధ్యయనం చేసి, ప్రజలకు అవగాహన కల్పించడమే మేలైన మార్గం.

పేర్లు మార్చడం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమంజసమే అయినా, అది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం కాదు. పేర్ల మార్పు కన్నా విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలు రాజకీయ లాభనష్టాలకంటే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News