Tuesday, June 9, 2026
26.6 C
Hyderabad

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 543 నుండి 816కి పెంచే ప్రతిపాదన ఉంది. ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలు 4,123 నుండి 6,185కు పెరగవచ్చని అంచనా. అంటే 50 శాతం సీట్ల పెంపు జరగనున్నదన్న మాట.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 37 లేదా 38కి పెరగవచ్చు. అసెంబ్లీ స్థానాలు 175 నుండి 262–263 వరకు పెరుగుతాయి. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుండి 25 లేదా 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుండి 178–179 వరకు పెరిగే సూచనలున్నాయి. ఈ మార్పులు 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలులోకి వచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాలు రాజకీయ పార్టీలకు నిజంగా పండగే. మరిన్ని ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు పెరుగుతుండటంతో, ఆ మేరకు అన్ని పార్టీల నాయకులకు ఆ అవకాశాలు దక్కుతాయి. పార్టీల విస్తరణకు మార్గం సుగమమవుతుంది. ఎన్నికల రాజకీయాల్లో ఓట్లు, సీట్ల లెక్కలే కీలకం. గనక అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నాయి.

అయితే, ఈ సీట్ల పెంపు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది? నియోజకవర్గాల భౌగోళిక పరిమాణం తగ్గడం వల్ల ప్రజలకు ప్రతినిధులు మరింత చేరువవుతారు. స్థానిక సమస్యలను నేతలు మరింతగా పట్టించుకునే అవకాశముంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే, లోక్‌సభలో 816 స్థానాల్లో 273 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోతుంది.

నియోజకవర్గాల పెంపు ప్రభుత్వంపై పెను ఆర్థిక భారంగా పరిణమించనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, పెన్షన్లు వంటి పెరిగే అన్ని వ్యయాలను ప్రజలే పన్నుల ద్వారా భరించాల్సి ఉంటుంది. పరిపాలన నాణ్యత పెరుగుతుందనే హామీ లేకపోగా, ఖర్చులు పెరగడం ప్రజలలో అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.

ఇక రాజకీయాల్లో, నేతల్లో పదవులపై ఆసక్తి అధికం. ఒకసారి ప్రజాప్రాతినిధ్యంలోకి వచ్చిన నాయకులు పదేపదే అవే స్థానాలకు పోటీ చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో “రెండు టర్మ్ లు మాత్రమే అనే పరిమితి” వంటి సంస్కరణలు అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. అదే విధంగా పదవీ విరమణ తర్వాత భారీ పెన్షన్లు పొందే విధానాన్ని కూడా పునస్సమీక్షించాలి. ఈ అంశాలు చట్టసభల్లో చర్చకు రావాల్సినవే అయినప్పటికీ, వాటిని అమలు చేసే బాధ్యత ఉన్నవారే రాజకీయ నాయకులు కావడంతో ఆచరణలోకి రావడం కష్టసాధ్యంగా మారుతోంది.

డిలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు, జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని సమతౌల్యం చేయడానికి అన్ని రాష్ట్రాల్లో సమానంగా ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం సీట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కొంతవరకు సమస్యను తగ్గించగలిగినా, పూర్తి పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీల స్థానాల సంఖ్య దక్షిణాది కంటే ఎక్కువగానే ఉన్నాయి. అదే నిష్పత్తిలో మళ్ళీ దేశంలో ఉత్తరాది రాష్ట్రాల ఆధిక్యం కొనసాగనున్నది.

సీట్ల పెంపు అవసరమైనే మార్పే అయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో నాణ్యమైన మార్పులు రావాలంటే కేవలం స్థానాల సంఖ్య పెరగడం సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు, నాయకులకు పారదర్శకత, బాధ్యతాయుత పాలన, ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి అవసరం. మహిళా రిజర్వేషన్ వంటి మార్పులు సమాజంలో మహిళల ప్రాధాన్యాన్ని, ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచగలవు. అయితే అదే సమయంలో ఖర్చుల నియంత్రణ, పదవుల పరిమితి వంటి సంస్కరణలు కూడా సమానంగా అవసరం.
డిలిమిటేషన్ వల్ల రాజకీయ పార్టీలకు అవకాశాలు విస్తరించడం అనివార్యం. కానీ ప్రజలకు నిజమైన లాభం అందాలంటే, ఈ మార్పులు వ్యవస్థలో గుణాత్మక సంస్కరణలతో కలిసివచ్చినప్పుడే సార్థకత. లేదంటే సీట్లు పెరిగినా ప్రజాస్వామ్యం బలపడిందని చెప్పడం కష్టమే.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News