Friday, April 10, 2026
26.7 C
Hyderabad

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 543 నుండి 816కి పెంచే ప్రతిపాదన ఉంది. ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలు 4,123 నుండి 6,185కు పెరగవచ్చని అంచనా. అంటే 50 శాతం సీట్ల పెంపు జరగనున్నదన్న మాట.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 37 లేదా 38కి పెరగవచ్చు. అసెంబ్లీ స్థానాలు 175 నుండి 262–263 వరకు పెరుగుతాయి. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుండి 25 లేదా 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుండి 178–179 వరకు పెరిగే సూచనలున్నాయి. ఈ మార్పులు 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలులోకి వచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాలు రాజకీయ పార్టీలకు నిజంగా పండగే. మరిన్ని ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు పెరుగుతుండటంతో, ఆ మేరకు అన్ని పార్టీల నాయకులకు ఆ అవకాశాలు దక్కుతాయి. పార్టీల విస్తరణకు మార్గం సుగమమవుతుంది. ఎన్నికల రాజకీయాల్లో ఓట్లు, సీట్ల లెక్కలే కీలకం. గనక అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నాయి.

అయితే, ఈ సీట్ల పెంపు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది? నియోజకవర్గాల భౌగోళిక పరిమాణం తగ్గడం వల్ల ప్రజలకు ప్రతినిధులు మరింత చేరువవుతారు. స్థానిక సమస్యలను నేతలు మరింతగా పట్టించుకునే అవకాశముంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే, లోక్‌సభలో 816 స్థానాల్లో 273 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోతుంది.

నియోజకవర్గాల పెంపు ప్రభుత్వంపై పెను ఆర్థిక భారంగా పరిణమించనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, పెన్షన్లు వంటి పెరిగే అన్ని వ్యయాలను ప్రజలే పన్నుల ద్వారా భరించాల్సి ఉంటుంది. పరిపాలన నాణ్యత పెరుగుతుందనే హామీ లేకపోగా, ఖర్చులు పెరగడం ప్రజలలో అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.

ఇక రాజకీయాల్లో, నేతల్లో పదవులపై ఆసక్తి అధికం. ఒకసారి ప్రజాప్రాతినిధ్యంలోకి వచ్చిన నాయకులు పదేపదే అవే స్థానాలకు పోటీ చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో “రెండు టర్మ్ లు మాత్రమే అనే పరిమితి” వంటి సంస్కరణలు అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. అదే విధంగా పదవీ విరమణ తర్వాత భారీ పెన్షన్లు పొందే విధానాన్ని కూడా పునస్సమీక్షించాలి. ఈ అంశాలు చట్టసభల్లో చర్చకు రావాల్సినవే అయినప్పటికీ, వాటిని అమలు చేసే బాధ్యత ఉన్నవారే రాజకీయ నాయకులు కావడంతో ఆచరణలోకి రావడం కష్టసాధ్యంగా మారుతోంది.

డిలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు, జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని సమతౌల్యం చేయడానికి అన్ని రాష్ట్రాల్లో సమానంగా ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం సీట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కొంతవరకు సమస్యను తగ్గించగలిగినా, పూర్తి పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీల స్థానాల సంఖ్య దక్షిణాది కంటే ఎక్కువగానే ఉన్నాయి. అదే నిష్పత్తిలో మళ్ళీ దేశంలో ఉత్తరాది రాష్ట్రాల ఆధిక్యం కొనసాగనున్నది.

సీట్ల పెంపు అవసరమైనే మార్పే అయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో నాణ్యమైన మార్పులు రావాలంటే కేవలం స్థానాల సంఖ్య పెరగడం సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు, నాయకులకు పారదర్శకత, బాధ్యతాయుత పాలన, ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి అవసరం. మహిళా రిజర్వేషన్ వంటి మార్పులు సమాజంలో మహిళల ప్రాధాన్యాన్ని, ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచగలవు. అయితే అదే సమయంలో ఖర్చుల నియంత్రణ, పదవుల పరిమితి వంటి సంస్కరణలు కూడా సమానంగా అవసరం.
డిలిమిటేషన్ వల్ల రాజకీయ పార్టీలకు అవకాశాలు విస్తరించడం అనివార్యం. కానీ ప్రజలకు నిజమైన లాభం అందాలంటే, ఈ మార్పులు వ్యవస్థలో గుణాత్మక సంస్కరణలతో కలిసివచ్చినప్పుడే సార్థకత. లేదంటే సీట్లు పెరిగినా ప్రజాస్వామ్యం బలపడిందని చెప్పడం కష్టమే.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News