Friday, July 17, 2026
24.5 C
Hyderabad

కాళేశ్వరం కథ కంచికి చేరేనా!?|EDITORIAL

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రజా పెట్టుబడుల్లో ఒకటి. దాన్ని పూర్తిగా విస్మరించడం కూడా మరింత నష్టం. జరిగిన లోపాలను విస్మరించడం అంతకంటే పెద్ద తప్పు. అందువల్ల ఒకవైపు అవినీతి, నిర్మాణ లోపాలపై నిర్దాక్షిణ్య విచారణ. దోషులకు శిక్షలు వేయడం. మరోవైపు నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టును సాధ్యమైనంత మేర ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం సమాంతరంగా జరగాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా ప్రచారం పొందిన ఈ ప్రాజెక్టు, నేడు రాజకీయ ఆరోపణలు, సాంకేతిక వివాదాలు, అవినీతి అనుమానాలకు ప్రధాన సాధనంగా మారింది. కాళేశ్వరం కూలేశ్వరమైందని అధికార కాంగ్రెస్, కుంగిన బ్యారేజీలను బాగు చేసి పునరుద్ధరించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పరం నిరంతరం నిందారోపణలకు దిగుతున్నాయి. ఈ రాజకీయ పోరులో అసలు సమస్యలు కొట్టుకుపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలేంటి? అయిన ఖర్చెంత? ప్రణాళిక, డిజైన్లు ఎవరివి? లోపాలేంటి? అప్పు ఎక్కడ? ఎంత తెచ్చారు? అనుమతులున్నాయా? నిపుణులేం చెప్పారు? అవినీతి జరిగిందా? ఏ మేరకు? బాధ్యులెవరు? కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణాలేంటి? దోషులెవరు? శిక్షలేంటి? విచారణలో తేల్చాల్సి ఉంది. మరోవైపు ఆ ప్రాజెక్టను పునరుద్ధరించడమెలా?
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ అంచనాలు రూ.38 వేల కోట్లు. తర్వాత సవరణలు, విస్తరణలు, అదనపు పనులు, భూసేకరణ, పంప్‌హౌస్‌లు, విద్యుత్ మౌలిక వసతులతో కలిపి వ్యయం రూ.లక్ష కోట్లకు పైగా చేరింది. ఈ సంఖ్యలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రాజెక్టుపై అసాధారణ స్థాయిలో ప్రజాధనం ఖర్చు చేసిన విషయం మాత్రం నిర్వివాదం. అంత భారీ పెట్టుబడితో నిర్మించిన ప్రాజెక్టు నిష్ఫలంగా నిలవడం ఆందోళనకరం.

2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థిరత్వంపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ)తో పాటు పలువురు నిపుణుల కమిటీలు సాంకేతిక పరిశీలనలు నిర్వహించాయి. వాటి నివేదికల ఆధారంగా మరమ్మతులు, భద్రతా చర్యలు, భవిష్యత్ నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. నివేదికలను పూర్తిగా ప్రజల ముందుంచడం ద్వారా మాత్రమే అనుమానాలకు తెరపడుతుంది.

ఇక అవినీతి జరిగిందా? ఏ మేరకు? నిర్మాణ ప్రమాణాల్లో లోపాలు జరిగాయా? వ్యయభారం ఎందుకు పెరిగింది? ఇవన్నీంటిపైనా విచారణ జరగాల్సిందే. ప్రజాధనం దుర్వినియోగమైందని తేలితే బాధ్యులు ఎంత పెద్దవారైనా చట్టం ముందు జవాబుదారీ కావాల్సిందే. శిక్ష అనుభవించాల్సిందే. అయితే విచారణ పేరుతో ప్రాజెక్టును నిరవధికంగా నిరుపయోగంగా మార్చడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. అవినీతి విచారణ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి ఎంత ప్రయోజనం పొందవచ్చో ప్రభుత్వం నిపుణుల సలహాలతో నిర్ణయించాలి.

గత రెండున్నరేళ్లుగా “తప్పు ఎవరిది?” అన్న రాజకీయ చర్చే తప్ప దోషులను నిర్ధారించింది లేదు. కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని నిందిస్తోంది. బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తోంది. కానీ రైతుకు నీరు అందిందా? చెరువులు నిండాయా? సాగునీటి విస్తీర్ణం పెరిగిందా? సమాధానాలే లేని ప్రశ్నలివి.

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, నిపుణుల కమిటీ సూచనల మేరకు బ్యారేజీల భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ప్రజలు ఇంకా ఇప్పుడు ఆరోపణలు వినాలనుకోవడం లేదు. నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పరిష్కారం కోరుకుంటున్నారు. ప్రభుత్వం నిజంగా నిపుణుల సూచనలకే కట్టుబడి ఉంటే, ఆ నివేదికలను పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచి, మరమ్మతుల ఖర్చు, కాలపట్టిక, సాంకేతిక సాధ్యత వంటి అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

ఇలాంటి సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి పునుకోవడం ఆచరణ సాధ్యమేనా? ఆలోచించాలి. మహారాష్ట్రలో ముంపు సమస్యలు, అంతర్రాష్ట్ర అనుమతుల వివాదాల కారణంగా ఆ ప్రతిపాదన గతంలోనే నిలిచిపోయింది. ఈ దశలో మరో భారీ ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని వెచ్చించే కంటే, ఇప్పటికే నిర్మించిన వ్యవస్థను సురక్షితంగా ఉపయోగించుకునే మార్గాలపై దృష్టి పెట్టడం సమంజసం.

తెలంగాణ ఇప్పటికే భారీ అప్పుల భారం ఎదుర్కొంటోంది. రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లు దాటాయని ప్రభుత్వ ఆర్థిక లెక్కలు సూచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయల కొత్త ప్రాజెక్టుల కంటే, ఉన్న ఆస్తులను సంరక్షించడం, వాటి ద్వారా ప్రయోజనం పొందడం ఆర్థికంగా కూడా వివేకవంతమైన నిర్ణయం.

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరిలోకి వచ్చే ప్రతి టీఎంసీ నీటిని సమర్థంగా వినియోగించడం అత్యవసరం. చెరువులు, రిజర్వాయర్లు నింపి సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఈ సమయంలో రాజకీయ వివాదాల కంటే నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం మరింత పెరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రజా పెట్టుబడుల్లో ఒకటి. దాన్ని పూర్తిగా విస్మరించడం కూడా మరింత నష్టం. జరిగిన లోపాలను విస్మరించడం అంతకంటే పెద్ద తప్పు. అందువల్ల ఒకవైపు అవినీతి, నిర్మాణ లోపాలపై నిర్దాక్షిణ్య విచారణ. దోషులకు శిక్షలు వేయడం. మరోవైపు నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టును సాధ్యమైనంత మేర ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం సమాంతరంగా జరగాలి.

ప్రజలకు ఇప్పుడు కావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదు, ఫలితాలు. కాళేశ్వరం చుట్టూ అంతులేని చర్చలకు ముగింపు పలికి, పారదర్శకత, జవాబుదారీతనం, శాస్త్రీయ నిర్ణయాలతో ముందుకు సాగితేనే లక్షలాది రైతులు, కోట్లాది రూపాయల ప్రజాధనం, తెలంగాణ భవిష్యత్తు రక్షించబడతాయి. అదే కాళేశ్వరం కథకు నిజమైన ముగింపు అవుతుంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News