Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

ప్రజా చైతన్యం, భాగస్వామ్యంతోనే.. ప్రగతిపథంలో చైనా|ESSAY

‘పనిచేయి, సంపాదించు, అనుభవించు’ అనే సూత్రాన్నే పాటిస్తుంటారు. ఎవరి పని వారిదే, ఎవరి జీవితం, ఎవరి సౌఖ్యం వారిదే. ప్రజలందరికీ చేతినిండా పని ఉంటుంది. ప్రభుత్వం తమకేదో చేస్తుందని ప్రజలెవరూ ఎదురు చూడరు. ఉచిత పథకాలేవీ ఉండవు. విద్య, వైద్యం, నీటి సరఫరా వంటివేవీ కూడా ఉచితం కాదు. మతం, దేవుళ్లు, గుళ్లు, గోపురాలు, విగ్రహాలు లేవు. ప్రజలంతా ఒకే భాష, ఒకే జాతి సూత్రాన్ని అనుసరిస్తుంటారు. ప్రజలు స్వేచ్ఛా ప్రియులు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధమే ఉండదు. బయట ప్రచారంమే తప్ప ఎక్కడా నిరంకుశత్వం కనిపించదు. భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానివే. కూడబెట్టి, దాచుకునే అవకాశమే లేదు. సువిశాలమైన భూభాగం, అపారమైన ఖనిజ సంపద, కష్టించి పనిచేసే ప్రజానీకం, అంతులేని దేశభక్తి, సుస్థిర ప్రభుత్వం ఉంటే, అనతికాలంలోనే అనూహ్యమైన అభివృద్ధి సాధించి, ప్రపంచంలో అగ్రపథానికి దూసుకుపోవచ్చనడానికి చైనాయే నిదర్శనం.
చైనా స్టడీ టూర్, స్టడీపై ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవిందర్ రావు ప్రత్యేక వ్యాసం 

స్టడీ టూర్ స్టడీ

ప్రజా చైతన్యం, భాగస్వామ్యంతోనే.. ప్రగతిపథంలో చైనా

(మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సీనియర్ సంపాదకులు టంకశాల అశోక్, ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్త బిక్షం, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావులు స్టడీ టూర్ లో భాగంగా ఇటీవలే చైనాలో 13 రోజులు పర్యటించారు. చైనాలోని బీజింగ్, షియాంగ్, షాంగై నగరాల్లో పర్యటించి, పరిశీలించిన అంశాల సంక్షిప్త సమాచారమే ఈ వ్యాసం)

సుభూభాగం, అపారమైన ఖనిజ సంపద, కష్టించి పనిచేసే ప్రజానీకం, అంతులేని దేశభక్తి, సుస్థిర ప్రభుత్వం ఉంటే, అనతికాలంలోనే అనూహ్యమైన అభివృద్ధి సాధించి, ప్రపంచంలో అగ్రపథానికి ఎదగవచ్చు అనడానికి చైనాయే నిదర్శనం. చైనా ప్రజలు స్వేచ్ఛా ప్రియులు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధమే ఉండదు. బయట ప్రచారంమే తప్ప చైనాలో ఎక్కడా నిరంకుశత్వం కనిపించలేదు. భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానివే. కూడబెట్టి, దాచుకునే అవకాశమే లేదు. గ్రామాలు, పట్టణ వాతావరణంతో కలగలిసి సెమీ అర్బనైజ్డ్ గా ఉంటాయి. అంతటా విశాలమైన రోడ్లు, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఒక్కో మనిషికి 10 గుంటల చొప్పున భూమి ఇస్తారు. తమ భూమిని చాలామంది కంపెనీలకు లీజుకిస్తారు. ఆ కంపెనీలు ఈ భూముల్లో పండ్లు, కూరగాయలు, ఇతరత్రా పండిస్తుంటాయి. పంటలు పాడైపోకుండా, ప్రతిచోటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేశారు. పరిశ్రమల్లో మానవ వనరులు సరిపోక, రోబోలు కూడా పనిచేస్తుంటే మాకందరికీ ఆశ్చర్యమేసింది. ప్రభుత్వానికి రాబడి ఎక్కువ. దీంతో ప్రభుత్వమే పెద్ద ఎత్తున 50 ఏళ్లకు సరిపడా మౌలిక వసతులను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగింది. చైనాలో ఎక్కడ చూసినా మాకు అందమైన గ్రామాలు, రోడ్లు, డ్రైనేజీలు, పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా కనిపించాయి.

ప్రజలు తమ సంపాదనంతా ఖర్చు పెడుతుంటారు. బ్లాక్ మనీకి ఆస్కారం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి కనిపించలేదు. ‘పనిచేయి, సంపాదించు, అనుభవించు’ అనే సూత్రాన్నే పాటిస్తుంటారు. ఎవరి పని వారిదే, ఎవరి జీవితం, ఎవరి సౌఖ్యం వారిదే. ప్రజలందరికీ చేతినిండా పని ఉంటుంది. ప్రభుత్వం తమకేదో చేస్తుందని ప్రజలెవరూ ఎదురు చూడరు. ఉచిత పథకాలేవీ ఉండవు. విద్య, వైద్యం, నీటి సరఫరా వంటివేవీ కూడా ఉచితం కాదు. మతం, దేవుళ్లు, గుళ్లు, గోపురాలు, విగ్రహాలు లేవు. ప్రజలంతా ఒకే భాష, ఒకే జాతి సూత్రాన్ని అనుసరిస్తుంటారు.

తియాన్మెన్ స్క్వేర్ లో రోజుకు రెండుసార్లు ఆ దేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుంటారు. అక్కడ ప్రెస్, మీడియా ఉండదు. ప్రభుత్వమే సమాచారం కోసం వార్తలను, ఫొటోలను విడుదల చేస్తుంటుంది. చైనాలో ప్రభుత్వ అధికార కార్యక్రమాలే వార్తలు. మరే వార్తలూ ఉండవు. రాజకీయాలు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు అనే రీతిలో ప్రజలు ఉన్నారు. అన్ని పరిపాలనా విభాగాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రాతినిథ్యం ఉంటుంది. పార్టీ నుంచి ఎన్నికైన ప్రతినిధులే ఫుల్ టైమ్ వర్కర్లుగా పాలనా విభాగాల్లో సభ్యులుగా ఉంటారు. అవినీతి, అక్రమాలకు తావుండదు. పోలీసులు ఎక్కడా కనిపించరు. కానీ, కార్లు, టాక్సీలు, బస్సులు, రైల్వేల్లో మొత్తం సీసీ కెమెరాలతో మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. అక్కడ నేరాలు చాలా తక్కువనే చెప్పాలి.

చైనాలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. కుటుంబంలో అందరూ పనిచేస్తేనే గడుస్తుందని భావిస్తుంటారు. మహిళలెవరూ పనిచేయకుండా ఇంట్లో విశ్రాంతిగా ఉండరు. మహిళలే కుటుంబాలను నడుపుతుంటారు. ప్రజలకు సరిపోను సంపాదన ఉంది. ఒక్కో కుటుంబానికి నెలకు సగటున రూ.50 వేల ఆదాయం వస్తుంది. దీంతో వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రజలు పాషనేట్ గా అందమైన జీవితాన్ని గడుపుతారు.
చైనా మహిళలు అలంకార ప్రియులు. ఆడపిల్లలను కన్న కుటుంబాలకు అమితమైన గౌరవం ఇస్తుంటారు. ఆశ్చర్యకరమేమిటంటే చైనాలో కన్యాశుల్కం కూడా అమల్లో ఉంది. నగరాల్లో పబ్ కల్చర్ ఉన్నప్పటికీ ఎక్కడా అశ్లీలత కనిపించదు. స్టాండర్డైజ్ హాస్పిటల్ ట్రీట్ మెంట్. ఇక్కడిలాగా భయంకరమైన ఫీజులుండవు. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. ఒకే దేశం చైనా, ఒకే భాష అనే చైనీస్ సూత్రాన్ని ప్రజలంతా ఆచరిస్తున్నారు.

ఇతర దేశాల్లో పర్యటించే చైనీయులు వ్యాపార పనుల్లోనే వెళ్తారు. టూరిజం ప్యాకేజీలతో రావడం అరుదు. ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన చైనీయులకు కూడా అమితమైన దేశభక్తి ఉంటుంది. చైనాకు వచ్చే పర్యాటకులపై కూడా నిరంతరం ప్రభుత్వ నిఘా ఉంటుంది.

చైనా ప్రజలంతా కఠినమై క్రమశిక్షణతో చైతన్యవంతంగా ఉంటారు. మా 13 రోజుల పర్యటనలో వేలాది మందిని కలిశాం. ఎందరితోనో మాట్లాడాం, కానీ, ఒక్క క్రమశిక్షణా రాహిత్య సంఘటనను మేం చూడలేదు. ఎవరిలోనూ ఆవేశం, అసహనం, ఆగ్రహం కనిపించలేదు. చైనాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ జీరో క్రైమ్ రేట్ నమోదవుతున్నది. ప్రభుత్వ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు సకల, సౌకర్యాలతో, అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. నిరంతరం అప్ డేటెడ్ తాజా సమాచారంతో, వినూత్న ఆవిష్కరణలతో అవి విద్యనందిస్తుంటాయి.

చైనాలో వ్యవసాయ సుక్షేత్రాలు ఎక్కువ. రిచ్ టవర్స్, రిచ్ పీపుల్ కనిపిస్తారు. ఇక్కడ 1990లో మొదలైన అభివృద్ధి 2000 లనాటికే వేగం పుంజుకుంది. 2025 నాటికి అనూహ్యమైన ప్రగతిని సాధించింది. షాంగై నగరంలో వెయ్యి కిలో మీటర్ల మెట్రోను, 500 మెట్రో స్టేషన్లతో నెలకొల్పారు. ప్రజలంతా మెట్రోలోనే ప్రయాణిస్తారు. ప్రభుత్వమే 51శాతం వాటాతో ప్రజలతో కలిసి వ్యాపారం నిర్వహిస్తుండటం మరో విశేషం. కంపెనీలు వ్యవసాయం సహా అన్ని వ్యాపారాలు నిర్వహిస్తాయి. యావత్ దేశం మీద భయంకరమైన నిఘా కనిపించకుండానే ఉంటుంది. తియాన్మెన్ స్వ్కేర్ సంఘటనను చైనా ప్రజలు ఒక పీడకలగా అభివర్ణిస్తుంటారు.

చైనాలోని షియాంగ్ నగరం 11వ శతాబ్దానికి చెందిన ప్రాచీన నగరమైతే, అభివృద్ధి చెందిన నగరం బీజింగ్. అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్న షాంగై నగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తుంటారు. భౌగోళికంగా త్రిభుజాకార దిక్కుల్లో ఉండే ఈ మూడు నగరాలూ మానవ నిర్మిత అద్భుతాలు. భూగర్భ రైలు మార్గం ఉంది. దానిపైన రోడ్లు ఉన్నాయి, ఆపైన ఎటు చూసినా ఫ్లై ఓవర్లు. దీంతో ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. ఇక్కడ మేం గంటకు 350 కి. మీ. వేగంతో 1200 కి.మీ. ప్రయాణించాం. చైనా వాల్, టెర్రాకోట్ మ్యూజియం, లైవ్ షోస్, షియాంగ్ సిటీలో 14 కి. మీ. గోడ, ఇండస్ట్రీస్, ఫీల్డ్స్, బీజింగ్ ఫారెస్ట్, తియాన్ మెన్ స్వ్కేర్, యూనివర్సిటీలు, స్కూల్స్ ఇలా ఎన్నెన్నో చూశాం. ప్రజలంతా చైనా భాషలోనే మాట్లాడారు. ఒక్కరూ ఇంగ్లీష్ పదాన్ని కూడా ఉచ్ఛరించకపోవడం మాకే ఆశ్చర్యమేసింది.

చైనాలో విద్యావ్యవస్థను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పాఠశాలలన్నీ సకల సౌకర్యాలతో ఉంటాయి. ప్రజలు, ప్రభుత్వం మార్షల్ ఆర్ట్స్ కు ప్రాధాన్యతనిస్తారు. పబ్లిక్ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి.

అత్యధిక పోషక విలువలున్న ఆరోగ్యకరమైన తిండి ఇక్కడి ప్రజల ప్రత్యేకత. చైనా పర్యటనలో మేం మూడు పూటలా 15 వంటకాలు తిన్నా మాకు ఏనాడూ కడుపు నిండినట్లుగా అనిపించలేదు. ఆకలీ కాలేదు. రకరకాల రుచులతో వండే సీ ఫుడ్స్ నోరూరిస్తాయి. స్ట్రీట్ ఫుడ్స్ కు ఆదరణ ఎక్కువ. ప్రజలు ఎక్కువగా వేడి నీళ్లు, ఆకులు, ఔషధ మొక్కల వేర్లు, నిమ్మకాయ ముక్కలు వేసుకొని మంచినీరు తాగుతారు. చైనాలో ప్రభుత్వం ఏనాడూ ఓట్ల కోసం పనిచేసేది ఉండదు, ఉచిత పథకాలు ఉండవు కాబట్టి, ఆర్థిక భారం ఉండదు. చైనా ప్రజలకు సంప్రదాయ పద్ధతులే తప్ప, భక్తి, పూజలు, పునస్కారాలు ఉండవు. ప్రతి వ్యక్తీ ఉత్పాదక రంగంలోనే పనిచేస్తారు. చైనాలో మేం చూసిన పర్యాటకుల్లో 99శాతం మంది చైనీయులే కావడం మరో విశేషం. ప్రభుత్వ విధానాలు, ప్రజల జీవనశైలికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండానే ఉంటాయి. ప్రస్తుతం చైనా దేశ ప్రజలంతా కొత్త సంస్కరణలను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు. 2040 నాటికి అమెరికా డాలర్ ద్రవ్య విలువను అధిగమించే లక్ష్యంతో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. కచ్చితంగా ఆ లక్ష్యాన్ని చైనా చేరుకుంటుంది.

వ్యాసకర్త :

–తక్కెళ్లపల్లి రవీందర్ రావు
శాసనమండలి సభ్యులు
ఫోన్: 950 580 6666

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News