Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

నేపాల్ సర్కార్ కి సోషల్ మీడియా ‘పతనశాసనం’!|ESSAY

ఇప్పటి వరకు మీడియా ప్రభుత్వాలను శాసించడం, సంస్కరించడం, కట్టడి చేయడం, కూల్చేయడం వరకే తెలుసు. కానీ, సోషల్ మీడియా ఓ దేశ అత్యున్నత అధికారాన్ని జయించడం ఇప్పటి వరకు ఎక్కడైనా చూశామా!? లేదు. కానీ, నేపాల్ ప్రభుత్వానికి ‘పతనశాసనం’ రాసింది సోషల్ మీడియా.
అసలు నేపాల్ లో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ప్రభుత్వం ఎందుకు కూలింది? దానికి సోషల్ మీడియా ఏ విధంగా కారణమైంది? నేపాల్ లో చెలరేగిన ‘జెన్-జీ ఉద్యమం’, ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ లపై కన్నెకంటి వెంకట రమణ రాసిన ప్రత్యేక వ్యాసం నేపాల్ సర్కార్ కి ‘పతనశాసనం’ రాసిన సోషల్ మీడియా!‘

సోషల్ మీడియా… గత పదేళ్లుగా ప్రారంభమయిన ఈ విస్తృత మీడియా ప్రభావం ఎంతగావుందంటే, ఒక్క సారిగా సోషల్ మీడియాను నేపాల్ ప్రభుత్వం నిలిపి వేయడంతో కోపోద్రిక్తులైన నేపాల్ యువత ఆ దేశ పార్లమెంటును ఆక్రమించారు. దీనితో తప్పనిసరై నేపాల్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నియంత్రించడానికి సైన్యాన్ని రంగంలోకి దించింది. పెద్ద ఎత్తున నిరసనలు, కాల్పులు, 19 మంది మరణం, 100 మందికి పైగా గాయాలు, ఫలితంగా సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేత, ముందుగా నేపాల్ హోం మంత్రి రాజీనామా, అనంతరం ప్రధాని ఓలి రాజీనామా… ఇవి నేపాల్ లో జరిగిన పరిణామాలు.
ఒకవిధంగా, ఇది ప్రపంచంలో మొట్టమొదటి సోషల్ మీడియా ప్రభావిత విప్లవం అని చెప్పవచ్చు.
తమ దేశ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలతో ఎక్స్, ఫేస్ బుక్, వాట్సాప్ లతో సహా 26 సోషల్ మీడియా యాప్ లను నేపాల్ నిషేధించింది. ఇప్పటికే, జెన్-జీ అనే బ్యానర్ పై నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు, నేపాల్ ప్రభుత్వం చేసిన సోషల్ మీడియా బ్యాన్ ఒక ఊతంగా లభించింది. దీంతో వేలాదిగా యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, లాఠీచార్జీలు, మీడియా స్వేచ్చపై దాడులు వంటి చర్యలు కొనసాగాయి. యువత నిర్వహిస్తున్న ఆందోళన, ప్రదర్శనల కారణంగా ఖాట్మండు, విరాట్‌నగర్ తదితర ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు.

నేపాల్ ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ నేపథ్యం ఇదీ…
నేపాల్‌లో ‘జెన్-జీ ఉద్యమం’ ఇటీవల ఆ దేశ యువత ప్రారంభించిన అత్యంత శక్తివంతమైన ఉద్యమం. ప్రధానంగా 1997 తర్వాత జన్మించిన “జెన్-జీ” తరానికి చెందిన యువత ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమం అవినీతిని, ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని, సోషల్ మీడియాపై నిషేధాన్ని, ప్రజాస్వామిక హక్కులపై విధించిన ఆంక్షలను ఈ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొత్తం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా బ్యాన్ చేయడంతో, తమ దైనందిన జీవితంలో ఒకటిగా ఉన్న సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు. ఇప్పటికే, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామ్యమైన ఈ ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ గ్రూప్ నకు, సోషల్ మీడియాపై నిషేధం వీరి ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయి. సమాజంలో మార్పు కోరుతూ పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆందోళనల్లో వేల మంది యువత పాల్గొంటున్నారు. ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నాయి. ఇది ఏ పార్టీ నాయకత్వం లేకుండా, స్వతంత్రంగా యువత ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమం.
ప్రపంచంలో పలు దేశాలు గతంలో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలలో కఠినంగా నిషేధంలో ఉన్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, టర్కీ, సూడాన్ తదితర దేశాలలో ఈ మీడియా ప్లాట్ ఫార్మ్ పాళీ పరిమితులున్నాయి. ఇక మన దేశంలో, జమ్మూ & కశ్మీర్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో శాంతిభద్రతల కారణంగా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ వంటి వాటిని పలు సార్లు బ్లాక్ చేశారు. టిక్ టాక్, పీయుబీజీ మోబైల్ లాంటి చైనా యాప్‌లను కూడా నిషేధించారు. ఏది ఏమైనా, సోషల్ మీడియా ప్రజల దైనందిన జీవితంలో ప్రధాన భాగంగా మారిందనేది సుస్పష్టం.

-కన్నెకంటి వెంకట రమణ

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News