Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

హలో!|HELLO|BRS|CONGRESS

మీ ఫోన్ ని మరెవరో వింటున్నారు!
చాటుమాటేసి మీ మాటల్ని వింటున్నారు
సాక్షాత్తు మంత్రే ఈ మాటలంటున్నారు
నాలుగ్గోడల మధ్య జరిగితే మాకేంటని..
స్వయంగా సీఎమ్మే అంటున్నారు|CM|REVANTH REDDY|PONGULETI
ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమా?
చేతగాని తనమా? రాజకీయ వ్యూహమా?

సంచలనంగా సీఎం, మంత్రుల వ్యాఖ్యలు

విచారణ జరుగుతుండగానే పేలిన తూటాలు
అనధికార ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలు
ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై అనేక ప్రశ్నలు

ఈ ట్యాపింగ్ కు ఫుల్ స్టాపింగ్ లేదా?

ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతోందా? అధికారికంగానా? అనధికారికంగానా? ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుండగానే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ‘నేను అధికారులతో మాట్లాడిన టెలి కాన్ఫరెన్స్ విషయాలు బయటకు వస్తున్నాయంటే, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఏ ఫామ్ హౌస్ నుండి ఇది జరుగుతుందో ఆధారాలు ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించడం సంచలనమైంది. నిర్ణీత నిబంధనల ప్రకారం. పరిమితంగా అధికారిక ఫోన్ ట్యాపింగ్ ఆక్షేపణీయం కాదని, అది చట్టబద్ధమేనని తెలిసిందే. అయితే, ఆ అధికారిక ఫోన్ ట్యాపింగ్ పరిధులు దాటి అనేకమంది ఫోన్లు విని, బ్లాక్ మెయిల్ చేసి, అధికారానికి తిరిగి రావడానికి, కోట్లు కొల్లగొట్టిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది? కానీ, అనధికారికంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినా, దానిపై విచారణ జరగకపోగా, చర్చ కూడా లేకుండాపోయిన తరుణంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ఇప్పుడు అంత్యంత ప్రాధాన్యంతను సంతరించుకున్నాయి. నాలుగ్గోడల మధ్య జరిగితే మాకేంటని..స్వయంగా సీఎమ్మే ఢిల్లీలో అంటున్నారు.*
*నిజంగానే అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా? జరిగితే ఎక్కడెక్కడి నుండి జరుగుతోంది? ఎంత కాలంగా జరుగుతోంది? ఆ పరికాలు ఇంకా భద్రంగా పని చేస్తూనే ఉన్నాయా? అది ఏ ఫాం హౌస్ నుండి జరుగుతోందో తెలుసన్న మంత్రి ప్రభుత్వ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? చట్టపరంగా ఎందుకు అరికట్టలేదు? మంత్రి మాటలు ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమా? చేతగాని తనమా? రాజకీయ వ్యూహమా? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విచారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

✍🏻-డా.మార్గం లక్ష్మీనారాయణ

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత రెండున్నరేళ్ళుగా రచ్చరచ్చగా మారింది. అధికారిక ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను బట్టి, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అర్థమవుతోంది. ఏ ఫామ్ హౌస్ నుంచి ఇది జరుగుతుందో ఆధారాలు ఉన్నాయంటున్న దాన్ని బట్టి తగిన సాక్ష్యాధారాలున్నట్లుగా తేలిపోతోంది.

జాతీయ భద్రత, తీవ్రమైన నేరాల విచారణ వంటి పరిమిత సందర్భాల్లో, చట్టబద్ధమైన అనుమతులతో మాత్రమే పోలీసు నిఘా విభాగం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. గత కొంతకాలంగా బయటకు వచ్చిన లీకులు, రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టుల సంభాషణలు అనధికారికంగా రికార్డ్ అయ్యాయన్న ఆరోపణలు ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్ ను నియమించింది. కొంత విచారణ పూర్తయ్యాక మరో సిట్ ను వేసింది. ఇప్పటికే వందల మంది బాధితులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ ను సైతం విచారించారు.

రకరకాల పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక నిర్ణయాలు కూడా లీకవుతున్నాయని భావించి, అధికారుల శాఖలు సమూలంగా మార్చారు. ఏకంగా సీఎంఓనే ప్రక్షాళన చేశారు. నిర్ణయాలు తీసుకోకముందే అవి లీకవడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు వాటిని పట్టుకుని నానా యాగీ చేయడం మాములైపోయింది. ఇదే విషయమై అనేక మంది మంత్రులతోపాటు సీఎం కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, చివరకు కల్వకుంట్ల కవిత కూడా తన, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయండంటూ సవాళ్ళు విసురుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ను కాపాడుతున్నారని బీజేపీ, లేదు బీజేపే కేసీఆర్ ను కాపాడుతోందని సీఎం ఆరోపించకుంటుంటే, తమనేమీ చేయలేరని బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. విచారణాధికారులను సైతం బహాటంగానే బెదిరిస్తూనే ఉన్నారు.

విచారణ చివరి దశకు చేరిందని కూడా అంటున్న ఈ దశలో ఒక కేబినెట్ మంత్రి “ఫోన్ ట్యాపింగ్ ఆగలేదు. ఇంకా జరుగుతూనే ఉంది” అనడం, ఏ ఫాం హౌస్ నుంచో తెలుసని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ఆందోళనపరుస్తోంది. ఆలోచింప చేస్తోంది. మంత్రి వ్యాఖ్యలు నిజమైతే, అనధికారంగా ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుంటే, అది తీవ్రమైన చట్ట వ్యతిరేక చర్య. నేరం. మరి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అలాంటి నేరాన్ని, నేరగాళ్ళను ఎందుకు అదుపు చేయలేకపోతోంది?
మంత్రి వ్యాఖ్యలు వ్యూహాత్మకమైనవా? ప్రత్యర్థులను కట్టడి చేసే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలైతే, అవి విచారణ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. విచారణలో ఉన్న అంశాలపై వ్యాఖ్యలు విచారణ తీరుపైనే అనుమానాలను కలిగిస్తున్నాయి.

మంత్రి ప్రస్తావించిన “ఫామ్ హౌస్” వ్యాఖ్య మరింత సంచలనాత్మకం. ఇది గత పాలనలోని ఆరోపణలను గుర్తుకు తేవడమే కాదు, తెరమీదకు తెస్తోంది. అయితే, ఏ ఆరోపణలకైనా ఆధారాలే కీలకం. మంత్రి వ్యాఖ్యలకు మంత్రే సమాధానం చెప్పాలి. లేదంటే మంత్రి వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారం రేపే ప్రమాదం ఉంది.

నాయకత్వం వహించే పాలకులే తమ ప్రభుత్వ యంత్రాంగం తమ మాటల్నే లీక్ చేస్తోందని అనుమానిస్తే, బహిరంగంగా ప్రకటిస్తే, పరిపాలన ఎలా సాగుతున్నట్లు? అది పాలనపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఫోన్ ట్యాపింగ్ విచారణ నిజంగా విశ్వసనీయంగా సాగాలంటే, రాజకీయ వ్యాఖ్యలకంటే సంస్థాగత చర్యలు ముఖ్యం. స్వతంత్ర దర్యాప్తు, కాలపరిమితిలో స్పష్టంగా జరగాలి. ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే, అది ఎంతటి వ్యక్తి అయినా చట్టం ముందు సమానమేనని ప్రజలకు తెలిసేలా శిక్షించాలి.
మరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పై విచారణ పారదర్శకంగా సాగుతుందా? లేక రాజకీయ వ్యాఖ్యల తుఫానులో కొట్టుకుపోతుందా? తేలాల్సి ఉంది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News