Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

కోర్టుల వ్యాఖ్యలు వ్యవస్థల లోపాలకు హెచ్చరికలు!|EDITORIAL

దేశంలో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందనల, ఈ రెండు సందర్భాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఒక కేసులో కోర్టు వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. హెచ్చరిక కూడా.

కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయ-న్యాయ పరిణామాల్లో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు దేశ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఒకటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు కాగా, మరొకటి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందన. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ప్రశ్నార్థకంగానే మిగిలింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖులను అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దర్యాప్తు చేసిన సీబీఐ, ఈడిల చర్యలపై మొదటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వెలుబుచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు న్యాయ పరమైన బలాన్ని చేకూర్చాయి.

కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కచ్చితమైన సాక్ష్యాధారాలతో జరగాలి. లేకపోతే అది వ్యక్తుల స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, మాజీ ఉపముఖ్యమంత్రిని జైలులో పెట్టేంత తీవ్ర ఆరోపణలు ఉంటే, వాటికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. ముందస్తు పర్మీషన్లు తీసుకోవాలి. అలా జరగకపోవడం వల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయతకే భంగం కలిగింది. రాజకీయ కక్షసాధింపుల ఆరోపణలు మరింత బలపడ్డాయి.

అవినీతి, ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత సీబీఐ, ఈడిలదే. అదే సమయంలో నిష్పాక్షికత, చట్టపరమైన కట్టుదిట్టత, సాక్ష్యాలాధారిత దర్యాప్తు అత్యవసరం. లేకపోతే దర్యాప్తు సంస్థలు రాజకీయ ఆయుధాలుగా మారాయన్న అపవాదుకు జవాబివ్వడం కష్టమే. ఒక కేసులో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. ఒక హెచ్చరిక కూడా.
ఇక ఎన్సీఈఆర్‌టి పాఠ్యాంశ వివాదం మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ప్రచురించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశం చేర్చడం వివాదమైంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థ గౌరవం పోయేలా, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించేలా పాఠ్యాంశాలు ఉండకూడదని కోర్టు ఆగ్రహించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చినప్పటికీ, ఆ అధ్యాయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించడం ప్రభుత్వ పర్యవేక్షణ లోపాలను ఎత్తి చూపింది.

ఈ రెండు ఘటనల సారాంశమేంటంటే, దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా ఉండాలి. విద్యా సంస్థలు సున్నిత అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలపై ఆధిపత్యం కాకుండా సమగ్ర పర్యవేక్షణ కలిగి ఉండాలి. లేకపోతే కోర్టుల జోక్యం తప్పదు.
ఇక అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం ఉండకూడదు. కానీ ఆధారాల్లేకుండా కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, తర్వాత కోర్టులో నిలబడలేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. అలాగే విద్యా రంగంలో సున్నిత అంశాలను చేర్చేటప్పుడు సమగ్ర చర్చ, నిపుణుల సలహాలు అవసరం.

ప్రజాస్వామ్యంలో న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య పరస్పర నియంత్రణ అత్యంత కీలకం. కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.
ఇప్పటికైనా కేంద్రం సహా అన్ని ప్రభుత్వాలు సంస్థల స్వతంత్రతను కాపాడాలి, పారదర్శకతను పెంపొందించాలి. చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. వ్యక్తులు కాదు, వ్యవస్థలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News