Thursday, March 12, 2026
26.8 C
Hyderabad

కోర్టుల వ్యాఖ్యలు వ్యవస్థల లోపాలకు హెచ్చరికలు!|EDITORIAL

దేశంలో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందనల, ఈ రెండు సందర్భాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఒక కేసులో కోర్టు వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. హెచ్చరిక కూడా.

కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయ-న్యాయ పరిణామాల్లో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు దేశ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఒకటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు కాగా, మరొకటి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందన. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ప్రశ్నార్థకంగానే మిగిలింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖులను అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దర్యాప్తు చేసిన సీబీఐ, ఈడిల చర్యలపై మొదటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వెలుబుచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు న్యాయ పరమైన బలాన్ని చేకూర్చాయి.

కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కచ్చితమైన సాక్ష్యాధారాలతో జరగాలి. లేకపోతే అది వ్యక్తుల స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, మాజీ ఉపముఖ్యమంత్రిని జైలులో పెట్టేంత తీవ్ర ఆరోపణలు ఉంటే, వాటికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. ముందస్తు పర్మీషన్లు తీసుకోవాలి. అలా జరగకపోవడం వల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయతకే భంగం కలిగింది. రాజకీయ కక్షసాధింపుల ఆరోపణలు మరింత బలపడ్డాయి.

అవినీతి, ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత సీబీఐ, ఈడిలదే. అదే సమయంలో నిష్పాక్షికత, చట్టపరమైన కట్టుదిట్టత, సాక్ష్యాలాధారిత దర్యాప్తు అత్యవసరం. లేకపోతే దర్యాప్తు సంస్థలు రాజకీయ ఆయుధాలుగా మారాయన్న అపవాదుకు జవాబివ్వడం కష్టమే. ఒక కేసులో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. ఒక హెచ్చరిక కూడా.
ఇక ఎన్సీఈఆర్‌టి పాఠ్యాంశ వివాదం మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ప్రచురించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశం చేర్చడం వివాదమైంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థ గౌరవం పోయేలా, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించేలా పాఠ్యాంశాలు ఉండకూడదని కోర్టు ఆగ్రహించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చినప్పటికీ, ఆ అధ్యాయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించడం ప్రభుత్వ పర్యవేక్షణ లోపాలను ఎత్తి చూపింది.

ఈ రెండు ఘటనల సారాంశమేంటంటే, దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా ఉండాలి. విద్యా సంస్థలు సున్నిత అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలపై ఆధిపత్యం కాకుండా సమగ్ర పర్యవేక్షణ కలిగి ఉండాలి. లేకపోతే కోర్టుల జోక్యం తప్పదు.
ఇక అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం ఉండకూడదు. కానీ ఆధారాల్లేకుండా కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, తర్వాత కోర్టులో నిలబడలేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. అలాగే విద్యా రంగంలో సున్నిత అంశాలను చేర్చేటప్పుడు సమగ్ర చర్చ, నిపుణుల సలహాలు అవసరం.

ప్రజాస్వామ్యంలో న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య పరస్పర నియంత్రణ అత్యంత కీలకం. కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.
ఇప్పటికైనా కేంద్రం సహా అన్ని ప్రభుత్వాలు సంస్థల స్వతంత్రతను కాపాడాలి, పారదర్శకతను పెంపొందించాలి. చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. వ్యక్తులు కాదు, వ్యవస్థలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది.

Latest News

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం|EDITORIAL

పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ లో తిరుగులేని విజేతగా నిలవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ సాధన మాత్రమే కాదు. గత విశ్వకప్ ఆటల అనుభవాల...

10-03-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి సప్తమి రాత్రి 12.05 వరకు ఉపరి అష్టమి నక్షత్రం అనురాధ సాయంత్రం 05.42 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం హర్షణ ఉదయం 07.24 వరకు ఉపరి వజ్ర కరణం భద్ర ఉదయం 11.04...

09-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి షష్టి రాత్రి 10.03 వరకు ఉపరి సప్తమి నక్షత్రం విశాఖ పగలు 03.10 వరకు ఉపరి అనురాధ యోగం వ్యాఘాత ఉదయం 06.54 వరకు ఉపరి హర్షణ కరణం గరజి ఉదయం 09.04...

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN 3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News