Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

నిబద్ధ, నిస్వార్థ రాజకీయ నేత సురవరం!|EDITORIAL

నేటి స్వార్థ రాజకీయాల్లో నిస్వార్థంగా నేనున్నానని చెప్పుకోదగిన ఉదాత్త రాజకీయవేత్త సురవరం సుధాకర్‌ రెడ్డి. ఆజన్మాంతం సామాన్యుడిగానే ఉంటూ, అసామాన్య రాజకీయ ప్రతిభను ప్రదర్శించిన వ్యక్తి ఆయన. దేశం గర్వించదగ్గ సురవరం మన తెలుగువాడు, తెలంగాణవాడు కావడం మనకు గర్వకారణం.

కమ్యూనిస్టు రాజకీయాల్లో ఉంటూనే సురవరం సుధాకర్ రెడ్డి, దేశ రాజకీయాల్లో ప్రభావశీలమైన ముద్రవేశారు. అయితే, కమ్యూనిస్టులు ఏకం కావాలన్న ఆయన కోరిక మాత్రం తీరకుండానే పోయారు. ఎప్పుడూ ప్రజా సమస్యలతోనే ఆయన జీవితం ముడిపడి ఉండేది. తెలంగాణ కమ్యూనిస్టు దిగ్గజాలలో గతేడాది సీతారాం ఏచూరిని కోల్పోయాం. ఏడాదిలోపే ఇప్పుడు సురవరంను కోల్పోయాం. జాతీయ రాజకీయాల్లో తెలుగువారు కనుమరుగు అవుతున్నారు. గట్టిగా నిలబడే నేతలు లేకుండా పోతున్నారు. ఈ క్రమంలోనే సురవం, వృధ్ధాప్య అనారోగ్య కారణాలతో మనలను వీడిపోయారు.

ఆయన రాజకీయాల్లో అజాతశత్రువు. అంతకు మించిన నిస్వార్థం ఆయనకు ఆభరణం. పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ ముద్దుబిడ్డ. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌ రెడ్డి సమస్యలు ఎక్కడున్నా వాటి పరిష్కారానికై పోరాడేందుకు ఎప్పుడూ ముందుండే వారు. సమస్యలపై ఎంత గట్టిగా పోరాడేవారో ఆయన అంతకుమంచి సౌమ్యుడు. ఆయన సౌమ్యత్వానికి, పోరాటానికి పొంతన ఉండేది కాదు. కానీ జన్మతః వచ్చిన మృదు స్వభావం కారణంగా ఆయన అజాత శతృవు అయ్యారేమో అనిపిస్తుంది. ఆయన మాట్లాడినంత సేపు ఇంకా వినాలనిపిస్తుంది. సాదాసీదాగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో చెలామణి కావడం చాలా కష్టం. కానీ అది సాధ్యమని రుజువు చేసిన దిగ్గజనేత సురవం. తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి తమ్ముడు స్వాతంత్ర్య సమరయోధుడు వెంకటరామిరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి. అటు తండ్రి, ఇటు పెదనాన్న వారసత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు. ఒకవైపు పెదనాన్న సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను, మరోవైపు తండ్రి స్వాతంత్య పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సుధాకర్‌రెడ్డి, చిన్న వయసులోనే సమస్యలపై పోరుబాట పట్టిన తీరు అమోఘం. కర్నూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్‌ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు. అది ఉద్యమంగా మారి, నగరంలోని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది. అన్ని స్కూల్స్ కి అవి సమకూరాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు. దివంగత జైపాల్‌ రెడ్డితో పాటు ఆయన కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో రాటుదేలారు. ఎన్నో వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారు. రెండుసార్లు నల్గొండ పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైన సురవరం సుధాకర్‌ రెడ్డి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడనిపించుకున్నారు. పోరాటలు, ప్రజా ఉద్యమాల పట్ల ఉన్న నిబద్దత కారణంగా ప్రజానేతగా సురవరం గొప్ప పేరు సంపాదించుకున్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేశారు.

తెలంగాణ ఉద్యమంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ఏఐఎస్‌ఎఫ్‌ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. మూడు దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2000లో విద్యుత్‌ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం ది ముఖ్యమైన పాత్ర. చండ్రరాజేశ్వరరావు తరువాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 1960లో ఏఐఎస్‌ఎఫ్‌ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ- 62రోజుల పాటు- చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యారు. దీంతో ఆయన దిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్‌ఎఫ్‌, 1972లో ఏఐవైఎఫ్‌నకు జాతీయ అధ్యక్షుడయ్యారు. 1971లో కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో జాతీయ కమిటీ- సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధప్రదేశ్‌కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985, 90లో కొల్లాపూర్‌ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్‌ రెడ్డి పోటీ- చేసి ఓడిపోయారు. 1994లో కర్నూలులోని డోన్‌లో అప్పటి సీఎం విజయ భాస్కర్‌రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. 1998లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కినా, ఒదిగే ఉన్నారు. ఇంతటి ఉన్నత లక్షణాలు, ఉదాత్త ఆశయాలు కలిగిన సురవరం మనవాడు కావడం మన అదృష్టం అయితే, మనకు లేకుండా పోవడం మన దురదృష్టం.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News