Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

పాఠాలు, గుణపాఠాలు నేర్పిన PLANE ACCIDENT|విమాన ప్రమాదం!|EDITORIAL

AHMEDABAD| అహ్మదాబాద్‌ AEROPLANE| విమాన దుర్ఘటన నుంచి మనం ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపమో, మానవ తప్పిదమో కానీ, మారణహోమం జరిగిపోయింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఆ విమానాన్ని ఎక్కిన వారు గమ్యాన్ని ముద్దాడక ముందే మృత్యువుని ముద్దాడారు. ఎంతో నమ్మకమైన, భద్రంగా పేరున్న AIR INDIA| ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా ఎయిర్ లోకి వెళ్ళక ముందే కుప్పకూలిపోయింది. విమానాన్ని గమ్యానికి చేర్చే ట్యాంక్ నిండా ఉన్న ఫ్యూయల్ అందులోని వాళ్ళని మంటల్లో మాడ్చి మసి చేసింది. ఒకేసారి వెయ్యి డిగ్రీల వేడిని రగిల్చిన ఆ మంటలకు అందులోని ప్రయాణీకులు, సిబ్బంది, పైలట్ సహా అంతా కాలిబూడిదైపోయారు. ఒకే ఒక్కడు మృత్యుంజయుడైయ్యాడు. తనను తానే నమ్మలేని విధంగా బతికి బట్టకట్టాడు.

గగన ప్రయాణం గరళ ప్రయాణంగా మారిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం పౌర విమాణ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చింది. విమానం ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే నేలకొరిగింది. మంటల్లో మాడిపోయింది. యంత్రాలు పని చేయలేదో? మరెదో? కానీ, పైలట్ ఇచ్చిన సమాచారానికి, సమాధానం కూడా వినలేని దీన స్థితిలో అది కూలిపోయింది. బహుషా జనావాసాల్లో కూలిపోకుండా పైలట్ తీసుకున్న జాగ్రత్త వల్లనో ఏమో పక్కకు తప్పించబోయినా, అది పైలట్ చేతిలో లేకుండా పోయి, మెడికల్ కాలేజీ భవనంలోకి దూసుకుపోయింది. దీంతో డాక్టర్లు, మెడికోలు ఈ ప్రమాదంలో మరణించారు. జానవాసాల్లోని కొందరు మృత్యువాతపడ్డారు. మొత్తానికి ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. విమానంలోని 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది మొత్తం 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు బతికారు. విమానం కూలిన వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం ధ్వంసమై 33 మంది వరకూ మృతి చెందడటంతో మృతుల సంఖ్య 274కు చేరింది.

2009లో 787-8 డ్రీమ్‌ లైనర్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే కావడం విశేషం. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని చెప్పారట. ఆ సమస్యే ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం కావచ్చని అన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని కూడా తన వాంగూల్మంలో పేర్కొన్నారు. ఇప్పుడు సలోహ్‌పోర్ అనుమానమే నిజమైందా?

ఇక విమానం కూలిన ప్రదేశంలో దొరికిన బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాద కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్, సిస్టమ్ డాటాను విశ్లేషిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విమానం కూలిపోయే సమయంలో పరిస్థితిని ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలెట్ మాట్లాడిన మాటలు అర్థం చేస్తున్నాయి. ‘విమానంలో పవర్ లేదు. నో థ్రస్ట్. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..’ అని పైలెట్ సుమత్ చెప్పారు. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్‌లు లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. థ్రస్ట్ అంటే నెట్టడం అనే అర్థం కూడా ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజిన్ లేదా ప్రొపెల్లర్ల వైఫల్యం కారణమని భావించవచ్చా? ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది.

ఈ ఘటన మనకు ప్రధానంగా విమాన యానంలోని సాంకేతికత నైపుణ్యాలని మరింత సాధించాలన్న సత్యాన్ని చాటింది. సాధారణంగా విమనాలు బయలుదేరే ముందు దాని సామర్థ్యం, యంత్రాల పనితీరు, సాంకేతికతలు, లోపాలను పరిశీలించిన తరవాతనే ప్రయాణానికి సంసిద్ధమవుతారు. అలా జరిగిందా? లేదా? అలాగే ఆ ఎయిరిండియా విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళుతున్నది. అహ్మదాబాద్ వరకు బాగానే వచ్చిన విమానం ఒక్కసారిగా ఎందుకలా అయ్యింది? మరే కోణమైనా ఉందా? అన్నవి తేలాల్సిన అంశాలు. 146 కోట్లు ఉన్న దేశ జనాభాకు తగ్గట్లుగా ఇప్పటికీ విమానయానం లేదు, విమానాలు లేవు, విమానాశ్రయాలు లేవన్న విమర్శలను ఒకసారి ఆలోచించుకోవాలి. తాజా ఘటనపై సునిశిత పరిశోధన జరగాలి.

నిజానికి అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన ఒళ్ళు జలదరింప చేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను పిండేస్తున్నది. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎందరో కలలను చిదిమేసింది. తప్పెవరిదైనా వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కొన్ని బతుకులు ఛిద్రం అయ్యాయి. విమనాల ఉత్పత్తి మొదలు సాంకేతికత వరకు సమగ్ర అధ్యయనం చేయాలి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా తన విమానాల సంపూర్ణ ప్రక్షాళనకు సిద్ధపడాలి. దేశీయ విమానయాన సంస్థల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. సాంకేతిక వైఫల్యాల నుంచి మానవ నిర్లక్ష్యం వరకూ ఈ ప్రమాదానికి దోహదం చేసిన అన్ని అంశాలను గుర్తించి, అవసరమైన చర్యలను చేపట్టాలి.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News