Wednesday, June 10, 2026
23.8 C
Hyderabad

కన్నడనాట అత్యాచార కరాళం!|EDITORIAL

‘రాతి హృదయంలో ఇమడని కన్నీటి పువ్వులా జాతి గుండెల్లో రగిలే శోక దీపంలా ఎవరమ్మా నువ్వు?’ అని ప్రశ్నించాడు అలిశెట్టి ప్రభాకర్. ఆయన కవితా వాక్యాలు నేటికీ అక్షర సత్యాలై ఆవిష్కరింప పడుతుండటం విచాకరం. విషాదకరం. కన్నడనాట వెలుగు చూస్తున్న అత్యాచార కాండ యావత్ దేశాన్ని నివ్వెపరుస్తున్నది. జాతి నిర్ఘాంతపోతున్నది.

కర్ణాటకలోని ధర్మస్థలి, ప్రజ్వల్‌ రేవణ్ణ ఈ రెండు పేర్లకు ఇప్పుడు పరిచయం అక్కరలేదు. దేశానికి బాగా తెలిసిపోయన ఈ రెండు పేర్లు జనం నోళ్ళల్లో నానుతున్నాయి. ఆడవాళ్ళపై అత్యాచారాలకు, హత్యాచారాలకు సాక్షిగా ధర్మస్థలి నిలిస్తే, వాటిలో ప్రయేయం ఉన్న దోషిగా ప్రజ్వల్ రేవణ్ణ నిలిచాడు. ధ్మస్థలిలో అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేస్తున్నారని, అదృశ్యం అయిన కేసుల్లో ఇప్పటికీ ఆచూకీ దక్కలేదని, సంబంధిత పోలీసు స్టేషన్ లో రికార్డులే గల్లతయ్యాయని గుర్తించారు. ఒకరిద్దరు ఫిర్యాదు చేసినా, వాటిపై చర్యలు తీసుకోలేదు. ధర్మస్థలి వ్యవహారంలో పెద్ద తలకాయల మాఫియా ఉందని అంటున్నారు. అందుకే అసలు నిజాలు బయటకు రావడం లేదని తెలుస్తోంది. అయితే ఈ అ(హ)త్యాచార కుంభస్థలం ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కాక తప్పదు. మాజీ సానిటేషన్‌ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదులుతోంది.

ప్రజ్వల్‌ రేవణ్ణ సాగించిన అత్యాచారకాండ అంతాఇంతా కాదు. ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక దాడి కేసులు నమోదైనప్పుడు కనీస మాత్రంగా కూడా నేతలు స్పందించలేదు. ప్రజల్వల్‌ తీర్పును స్వాగతించలేదు. న్యాయస్థానం శిక్ష విధించాక కూడా ఎవరూ స్పందించలేదు. మరిన్ని కేసులు విచారణలో ఉన్నాయి. రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్న ప్రజ్వల్‌ పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.

ప్రజ్వల్‌ రేవణ్ణ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారం జరిపిన కేసులో అభియోగాలు రుజువు కావడంతో ప్రజ్వల్‌కు బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రూ.11.35 లక్షలు జరిమానా విధించి, దానిలో రూ.11 లక్షలు బాధితురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మహిళలను కట్టుబానిసలుగా, సెక్స్‌ వర్కర్లుగా చూస్తున్న ప్రస్తుత సమయంలో న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పు మహిళలకు ఆశాకిరణం. ఆత్మవిశ్వాసం పెంచేదే.

ప్రజ్వల్‌పై మూడు లైంగిక దాడి కేసులు, ఒక లైంగిక వేధింపుల కేసు నమోదుకాగా ఒక్క మొదటి కేసులోనే శిక్ష పడింది. మైసూర్‌ ఆర్‌కె నగర్‌కు చెందిన ఒక మహిళ తనపై ఫాంహౌస్‌లో ప్రజ్వల్‌ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో తొలికేసు నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండవసారి హసన్‌ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్‌ ఎంపీగా పోటీ చేశారు. పోలింగ్‌ ముగిశాక కేసు నమోదు కావడంతో జర్మనీకి పారిపోయాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని స్వదేశానికి రప్పించి గతేడాది మే 31న అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి రిమాండ్‌ ఖైదీగా ప్రజ్వల్‌ జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అయితే, కేసు దర్యాప్తు సమయంలో సిట్‌ కనుగొన్న విషయాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రజాప్రతినిధిగా సమస్యలపై తన దగ్గరకొచ్చే మహిళలపై లైంగికదాడికి ఒడిగట్టాడు. బెదిరించి, బలవంతంగా, లోబరుచుకుని లైంగిక దాడులకు బరితెగించాడు. అత్యాచారం చేసిన ప్రతిసారీ తన ఐ-ఫోన్‌లో ఆ దృశ్యాలను తానే రికార్డు చేసుకున్నాడు. అటువంటి రెండు వేలకు పైచిలుకు వీడియోలను దర్యాప్తు సందర్భంగా ప్రజ్వల్‌ ఫోన్‌లో కనుగొన్నారు. అవి మార్ఫింగ్‌ వీడియోలుగా, రాజకీయ కుట్రగా ప్రజ్వల్‌ బుకాయించి, తప్పించుకోచూశాడు. కానీ, ఆ వీడియోలను విదేశాలకు పంపించి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయించి నిజమైనవేనని నిర్ధారించారు. కేవలం 14 నెలల్లోనే కేసు ఛేదించడం వెనుక దర్యాప్తు అధికారుల కృషి, కోర్టులో వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్‌ కనబరిచిన చాకచక్యం అభినందించాల్సిందే.

అన్నింటికీ మించి న్యాయం కోసం, దోషికి శిక్ష పడాలని బాధితురాలు కనబర్చిన పట్టుదల మహిళాలోకానికి స్ఫూర్తినిస్తుంది. ప్రజ్వల్‌ రేవణ్ణ సాదాసీదా యువకుడు కాదు. కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్న కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ. ఆయన తాత దేవెగౌడ మాజీ ప్రధాని, పినతండ్రి కుమార స్వామి కేంద్ర మంత్రి, తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్‌ఎ హెచ్‌డి రేవణ్ణ, తల్లి భవానీ గతంలో కార్పొరేటర్‌, సోదరుడు సూరజ్‌ ఎంఎల్‌ఎ. ఇంతమంది రాజకీయ కుటుంబంలో ఉన్న ప్రజల్వల్‌ తనకు తిరుగులేదని భావించాడు. అత్యాచార బాధితురాలిని అపహరించిన ప్రజ్వల్‌ తల్లి భవానీపైనా కేసు నమోదైంది. ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌డి రేవణ్ణపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదయ్యాయంటే బాధితులను ప్రజ్వల్‌ కుటుంబం తమ రాజకీయ పలుకుబడితో ఏ స్థాయిలో భయబ్రాంతులకు గురి చేసిందో తెలుస్తుంది. పాపం పండింది. ప్రజ్వల్ ఎంతగా మొత్తుకున్నా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అత్యాచారాలు చేసి పైశాచికానందం పొంది, వాటిని సెల్‌ ఫోన్లలో వీడియోలు తీసి మురిసి పోయిన ప్రజ్వల్‌ లాంటి వాళ్ళకి ఏ శిక్ష విధించినా తక్కువే.

అలాగే ధర్మస్థలిపైనా నిజాయితీగా విచారణ జరగాలి. అప్పుడే ప్రజల్లో భరోసా వస్తుంది. కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఇదో మంచి అవకాశం. ప్రతిపక్ష నేత రాహుల్‌ ఈ విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ధర్మస్థలి విషయంలోనూ నిగ్గు తేలేలా చేస్తే మంచిది. లేదంటే అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్లుగానే ‘నాగరిక ప్రపంచం అంటూ అనాగరికంగా స్త్రీల పట్ల ప్రవర్తిస్తున్న లోకంలో సోయితో మహిళలు కత్తులా మెరవాలి.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News