Sunday, April 12, 2026
27.7 C
Hyderabad

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది.

భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. హార్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా జరుగుతుంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ చమురు రావాణా మార్గాన్ని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత ఏర్పడి, ధరలు అమాంతం పెరుగనున్నాయి. తద్వారా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. దాంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకడం అనివార్యం.

చమురు ధరల పెరుగుదలతో వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇప్పటికే దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు తక్కువగా ఉన్న నేపథ్యంలో డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే దుష్ప్రభావం కలిగిస్తుంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి పెరిగితే సామాన్యుల జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.

భారత్ ప్రతి ఏడాది 5–6 మిలియన్ టన్నుల కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పుదినుసులను మయన్మార్, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే సోయా ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ సరుకులు ఎక్కువగా సూయెజ్ కాలువ, హార్ముజ్ జలసంధి మార్గాల ద్వారా వస్తాయి. ఈ మార్గాల్లో అంతరాయం కలిగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో రవాణా, బీమా ఖర్చులు పెరిగి చివరకు వినియోగదారులపై భారమవుతుంది. అలాగే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్ దిగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం ఖాయం. ఇది మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం వేస్తుంది.

మన దేశ జనాభా 147 కోట్లకు చేరుకుంది. వివిధ నివేదికల ప్రకారం ఇప్పటికీ 28% మంది పేదరికంలో జీవిస్తున్నారు. దేశ సంపదలో సగానికి మించి, కేవలం 10% మంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరల పెరుగుదల పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలను మరింత కష్టాల్లోకి నెడుతుంది.

వ్యవసాయ రంగం బలహీనపడటం, నిరుద్యోగం పెరగడం, విద్యా–వైద్య సేవలు ఖరీదైనవిగా మారడం వంటి అంశాలు ఇప్పటికే సామాజిక ఒత్తిడిని పెంచుతున్నాయి. యుద్ధ ప్రభావంతో ద్రవ్యోల్బణంతో, జీవన వ్యయం పెరగడం వల్ల అప్పుల భారమూ అధికమవుతుంది. ఇది ఆత్మహత్యలు, సామాజిక అస్థిరత వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.

మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చమురు దిగుమతులను తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి. పప్పుదినుసులు, నూనె గింజల ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. రైతులకు కనీస మద్దతు ధర, నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలి. కీలక దిగుమతులపై సమయానుకూల నియంత్రణలు విధించి దేశీయ ఉత్పత్తిదారులను రక్షించాలి. పేదల కోసం నేరుగా నగదు బదిలీలు, ఆహార భద్రత పథకాలు బలోపేతం చేయాలి.

యుద్ధాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కలిగించినా, వాటి ప్రభావాలు దీర్ఘకాలికంగా తీవ్రం. ప్రపంచీకరణ యుగంలో ఒక చోట సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని తక్షణమే ప్రభావితం చేస్తుంది. కాబట్టి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుకోవాలి.

సమయోచిత విధానాలు అమలు చేస్తే దాని ప్రభావాన్ని నియంత్రించడమే కాదు తగ్గించుకోవడం కూడా సాధ్యమే. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఆర్థిక సంస్కరణలకు పూనుకుంటేనే దేశం దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలపడుతుంది.

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News