Tuesday, July 14, 2026
26.4 C
Hyderabad

INDIA|దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ!|EMERGENCY|EDITORIAL

దేశ చరిత్రలో EMERGENCY| ఎమర్జెన్సీని చీకటి రోజులుగా అభివర్ణిస్తారు. దేశానికి అంతర్గతంగా, బహిర్గతంగా ముప్పు ఉందని, వాటి నుంచి GOVERNMENT| ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి ఆనాడు అత్యవసర పరిస్థితిని విధించారు. 1975 జూన్ 25న అమలులోకి వచ్చి 1977 మార్చి 21న ముగిసింది. ఈ ఉత్తర్వు PRIME MINISTER| ప్రధానమంత్రికి డిక్రీ ద్వారా పాలించే అధికారాన్ని ఇచ్చింది. ELECTIONS| ఎన్నికలు రద్దు చేయడానికి, పౌర స్వేచ్ఛలను నిలిపివేయడానికి వీలు కల్పించింది. ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్థులలో లక్ష మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులను జైలులో పెట్టారు. పత్రికలను సెన్సార్ చేశారు. నాటి పరిస్థితులను నేటికీ గుర్తు చేసుకుంటున్నాం. కానీ, ఆనాడు ఆ చీకటి రోజులను కేవలం 21 నెలలపాటు అనుభవించారు. కానీ, నేటి ప్రభుత్వాల పాలన ఆసాంతం ఎమర్జెన్సీని మరిపిస్తున్నది. అప్రకటిత ఎమర్జెన్సీని మనమంతా నిత్యం అనుభవిస్తున్నాం. చట్ట సభల్లో బుల్డోజింగ్, సమస్యలపై చర్చ ఉండదు. ప్రభుత్వాల నిర్ణయాలే ఫైనల్. భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగంలో భద్రంగా ఉంటుంది. కానీ, ఏ భావాలను ప్రకటించే స్వేచ్ఛ ప్రజలకు ఉండదు. రాజ్యమే రక్త పిపాసిలా ఇష్టానుసారంగా కరాళ కర్కష నిరంకుశాన్ని నడిపిస్తుంది. తుపాకీ రాజ్యం నడుస్తోంది. విచిత్రంగా విమర్శలను తట్టుకునే స్థితిలో పాలకులు లేరు. విపక్షాలు కూడా ప్రజలను విస్మరించి, పవరే పరమావధిగా పనిచేస్తున్నాయి. ధరలు తగ్గించాలని అడగవద్దు, ఉద్యోగాలు కావాలని రోడ్డెక్కవద్దు. చదువులు కావాలని కోరుకోవద్దు. మంచి ఆరోగ్యం కావాలని డిమాండ్‌ చేయవద్దు. జీఎస్టీ తగ్గించాలని ఎలుగెత్తకూడదు. వారి దయా దాక్షిణ్యాల మేరకు బతకాల్సిన దుస్థితిలో భారత ప్రజాస్వామ్యం నడుస్తుండటం అత్యంత విషాదం.

ఎమర్జెన్సీని సమర్ధించడం కాదు కానీ, నిందిస్తూ మనం సాధించిన ప్రగతి ఏంటి? పేరుకే ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడే, బతికే పరిస్థితే లేదు. ప్రభుత్వాలను విమర్శించే అవకాశం కాదుకదా వేదిక కూడా లేకుండా పోయింది. పత్రికలు ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు బాకాలుగా మారాయి. ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో ఇందిరను మించి పోయారు. కేవలం తన పదవిని కాపాడు కునేందుకు ఇందిర ఎమర్జెన్సీ అస్త్రాన్ని ఉపయోగించింది. అయితే ఆనాడు మనమంతా గుర్తించని మరోకోణం కూడా ఉంది. ఎమర్జెన్సీ లో ఢిల్లీ నుండి గల్లీ దాకా వ్యవస్థలన్నీ పక్కాగా నడిచాయి. ఉద్యోగులు సక్రమంగా పనిచేశారు. లంచం పుచ్చుకోవాలంటే వణికిపోయారు. కల్తీల బెడద తొలగింది. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయి. బ్లాక్‌ మార్కెటీర్ల భరతం పట్టారు. వేళకు బస్సులు, ట్రైన్‌లు నడిచాయి. ఈరోజు అలాంటి పరిస్థితి ఎందకు లేదు?

నిజంగానే ఇందిర తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. జయప్రకాశ్‌ నారాయణ్‌ జనతా పార్టీకి ప్రాణం పోశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారం చేపట్టారు. మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ప్రధాని పదవికి పోటీపడిన వారంతా జనతాపార్టీని విచ్చిన్నం చేశారు. తరవాత ఎన్టీఆర్‌ హయాంలోనూ ఇలాగే జరిగింది. మనదేశంలో ప్రజాస్వామ్యం వల్ల రాజకీయ నేతలు బాగుపడ్డారే తప్ప ప్రజలు బాగుపడలేదని 78 స్వాతంత్య్రం చరిత్ర తేటతెల్లం చేస్తోంది. కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు బాగుపడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ నాయకులను గెలిపించి, ప్రజలు ఓడిపోతున్నారు. వారసత్వ రాజకీయాలు, మళ్లీ మళ్లీ తామే గెలవాలన్న కుటిల వ్యూహాలు, పథకాలు, ప్రయత్నాలు దేశ పురోగతికి కాకుండా, అధోగతికి దారితీస్తున్నాయి. దేశాన్ని మొఘలులు, ఖల్జీలు, నిజాంలు, బ్రిటీషర్లు దోచుకున్నారు. స్వాతంత్రం తర్వాత దోపిడీ కొత్త రూపంలో ప్రవేశించింది. నాడు రాజులు మాత్రమే అయతే, నేడు కొన్ని కుటుంబాలు రాజ్యమేలుతున్నాయి.

నేటి దేశ పాలకులు ప్రజలకు విద్య, వైద్యం వంటి కనీస వసతులు కల్పించడం లేదు. పైగా ప్రైవేట్ పరం చేసి, కాంట్రాక్టర్ల కాళ్ళ మీద సాగిలపాడుతున్నారు. ఉచిత పథకాలతో సోమరులను చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, ఇంకా ఉచిత పథకాలనే అమలు చేస్తున్నారంటే దేశం పురోగమించినట్లా, తిరోగమించినట్లా? పాలకులు ప్రజలకు బొచ్చె చేతికిచ్చి బిచ్చగాళ్ళను చేస్తున్నారు. ప్రజలు చైతన్యం కావడం లేదు. ఓటు బ్యాంక్‌ రాజకీయాల్లో ప్రజలు ఓడిపోతున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ నేతలు రాజ్యమేలు తున్నారు. యాభై సంవత్సరాల క్రితం మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను కదిలించిన అత్యయిక స్థితి నేటి తరానికి చరిత్ర. దీని గురించి తెలుసుకోవాల్సిందే. నేడు జరుగుతున్న పాలనా తీరును కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆనాడు జనతా పార్టీ విజయం అత్యయిక స్థితికి ముగింపు పలికింది. ప్రజాస్వామ్య విలువలు గెలిచాయి.

ఆ చీకటి కాలం నుంచి మనం నేర్చుకున్న పాఠాలను, గుణపాఠాలు, అనుభవాల నేపథ్యోం భారతదేశ ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలి. ఇక ఇది మన రాజకీయ నాయకుల వల్ల కాదని తేలి పోయింది. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడటానికి, పౌర స్వేచ్ఛను రక్షించడానికి, అధికార సమతౌల్యం ఉండేలా పటిష్ఠమైన వ్యవస్థ మనగలగడానికి ప్రజలు గట్టిగా నిలబడాలి. అప్పుడే మనమంతా స్వేచ్ఛగా బతకగలం. పాలకులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేయగలరు. ఎమర్జీన్సీని వ్యతిరేకిస్తూనే, రాజకీయ నేతల అప్రకటిత ఎమెర్జెన్సీ కార్యక్రమాలను నిదీయాలి. అప్పుడే దేశానికి మంచిరోజులు వస్తాయి.

Latest News

పల్లె ప్రగతే రాష్ట్ర, దేశ ప్రగతికి పునాది!|EDITORIAL

ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయగలదనే భావన నుంచి ప్రజలు కూడా బయటపడాలి. "నా ఊరు–నా బాధ్యత" అనే భావన ప్రతి పౌరుడిలో పెంపొందాలి. గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, రైతు, మహిళా,...

జూలై 14, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య సాయంత్రం 04.00 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పునర్వసు రాత్రి 02.07 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.58 వరకు ఉపరి హర్షణ కరణం నాగవ సాయంత్రం 04.00 వరకు ఉపరి...

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News