Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

పాక్‌ను కోలుకోకుండా దెబ్బకొట్టాలి!

ముల్లును ముల్లుతోనే తీయాలి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా ఉండాలి. పాక్‌ ఏర్పడడమే మత ఛాందసవాందతో ఏర్పడిరది. తాము భారత్‌ను చీల్చి ఏర్పడ్డామన్న జ్ఞానం వారిలో లేదు. అలాగే భారత్‌ భిక్షతో దేశంగా ఏర్పడ్డామన్న కృతజ్ఞత బంగ్లాదేశీయులకు లేదు. ఈ రెండు దేశాల్లో మిగిలిన అరకొర హిందువులను తన్ని తరిమేయడం..కశ్మీర్‌ సహా భారత్‌లో చిచ్చుపెట్టడం వీరి లక్ష్యంగా ఉంది. అది ఎప్పుడో రుజువయ్యింది. మనం శాంతి వచనాలు పలుకుతూ పోతే సమస్య పరిష్కారంకాదు. భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతులు అన్న విధంగా మన జవాబు ఉండాలి. రష్యా ఉక్రెయిన్‌పై దాడిచేసింది. ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడులు చేస్తూనే ఉంది. ఇలాంటి దెబ్బలు మనం కూడా కొట్టగలగాలి. నష్టం కలిగినా ఫర్వాలేదు. దేశాన్ని పటిష్టం చేసే క్రమంలో మనమంతా త్యాగాలకు సిద్ధపడాలి. ఈ దేశాన్ని వందలాది ఏళ్లుగా ఎందరో దాడులు చేసి ధ్వంసం చేశారు. మనలను బానిసలుగా మార్చారు. ఇవన్నీ మనకు గుణపాఠం కావాలి. ఇంకా దాడులను తట్టుకుంటూ పోదాం అన్న పద్దతి మాత్రం మంచిది కాదు. పహల్గాం దాడి జరిగి వారం రోజులు అవుతోంది. పాక్‌ నుంచి శిక్షణ పొందిన ముష్కరులే దాడికి కారణమని తేలింది. ముంబై దాడులు కావచ్చు..పుల్వామా దాడి కావచ్చు…పహల్గామ్‌ కావచ్చు.. అన్నీ పాక్‌ కుతంత్రాల వల్లనే జరిగిన ఘటనలు. అయినా దాయాది దేశానికి బుద్ది రావడం లేదు. పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్‌ మూసా పాక్‌ సైన్యంలో మాజీ పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. దీనిని బట్టి పాక్‌ సైన్యంలో పనిచేసిన వారు ఆ తరవాత ఎలా ఉగ్రవాదులుగా మారుతున్నారో గమనించాలి. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు వెల్లడిరచాయి. ఆ సంస్థ మాస్టర్‌ మైండ్లే అతడిని కశ్మీర్‌కు పంపినట్లు- పేర్కొన్నాయి. ఇప్పటికే భారత సైన్యం ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో వందల మంది స్థానికులను అదుపులోకి తీసుకొంది. వీరిలో 15 మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌, మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడిరచారు. అతడు పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోందని సైన్యం ధృవీకరించింది. ఇంతకన్నా ఆధారాలు ఇక అవసరం లేదు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ఎత్తేసిన తరవాత అక్కడ శాంతి నెలకొనడమే గాకుండా స్థానికులకు ఉపాధి దక్కుతోంది. పర్యాటకం పెరిగింది. అక్కడి యువతలో కూడా మార్పు వచ్చింది. వారంతా జనజీవన స్రవంతిలో కలిసి పోతున్నారు. దీనిని విచ్చిన్నం చేసే పన్నాగమే ఉగ్రదాడి అని తేలింది. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘటన అమాన వీయమైనదే కాదు…. మనిషన్నవాడు చేసే పని కాదు. ఇది కేవలం రాక్షస జాతి మాత్రమే చేస్తుంది. పాక్‌ పెంచి పోషిస్తున్న రాక్షసులు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందుకుమనం కూడా సన్నద్దం కావాలి. మరణించిన వారి ఆత్మకు శాంతి జరగాలి. ఉగ్రమూకలను చీల్చి చెండాడం ద్వారా మన సత్తా చాటాలి. అలాగే కాశ్మీర్‌లో ఉంటూ…ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న కొందరు పాక్‌ సానుభూతిపరులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాలి. వారిని కూడా ఉగ్రదాడులకు బాధ్యులను చేయాలి. భూతల స్వర్గంగా భావిస్తున్న కశ్మీర్‌ను చూడాలని వెళ్లిన పర్యాటకులను హతమార్చిన ఘటనను ఇప్పటికీ భారతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలు అన్నీ తీవ్రంగా నిరసించాయి. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన విధంగానే ప్రతిస్పందించింది. ఈ దుర్ఘటనకు కారణమైన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టిఆర్‌ఎఫ్‌)ను, దానికి సహకారం అందించిన లష్కర్‌ ఎ తోయిబాను, దీనికి వెన్నుదన్నుగా ఉన్నదను కుంటున్న పాకిస్థాన్‌ను లక్షంగా చేసుకొని తక్షణ చర్యలు చేపట్టింది. తక్షణమే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేయడం, నీటి ఒప్పందాలను వెనక్కు తీసుకోవడంతోపాటు ఇంకా అనేక చర్యలు చేపట్టింది. సరిహద్దులను మూసివేయడం కూడా వెంటనే అమలు చేశారు. అదే విధంగా దాడికి బాధ్యులైన వారి లక్షంగా గాలింపు ముమ్మరం చేశారు. ఇవన్నీ ఊహించినవే అయినా సరిపోవని గుర్తించాలి. ప్రజల్లో వస్తున్న తీవ్ర నిరసన కారణంగా దాడులకు తక్షణ చర్యలు ఉండాలి. ఇప్పటికే కాశ్మీర్‌లో వేలాదిమంది పౌరులు, సైనికులు నేలకొరిగారు. వేలాదిమందిని హత్యలు చేశాలరు. లక్షల మందిని మత మార్పిళ్లు చేశారు. ఇవన్నీ గమనించిన తరవాతనే కేంద్రం 2019లో 370 ఆర్టికల్‌ రద్దు చేసి కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని ఎత్తేసింది. దీంతో సాధారణస్థితికి వచ్చి కాశ్మీర్‌ పర్యాటకంగా మళ్లీ చిగురించింది. దీనిని జీర్ణించుకోలేని పాక్‌ పాపాల భైరవులు దాడులకు తెగించారు. ఈ క్రమంలో అసవరమైతే యుద్ధం దాకా కూడా భారత ప్రభుత్వం వెళ్లవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇక పాక్‌ను ఎంతమాత్రం నమ్మరాదు. పాముకు పాలుపోసి పెంచినట్లుగా మన గత పాలకులు పాక్‌ పాలకులకు చేయూతను ఇచ్చారు. అందువల్ల మనం ఎంతమాత్రం ఉపేక్షించరాదు. కష్టమైనా, నష్టమైనా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకుని రావాలి. రాజకీయపార్టీలు కూడా విభేదాలు పక్కన పెట్టి పాక్‌కు గుణపాఠం చెప్పే ప్రయత్నాలకు బేషరతు మద్దతు పలకాలి. అలాగే పాక్‌ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ప్రతీకార చర్యలు ఉండాలి. అప్పుడే భారత్‌కు శాంతి. గత కొన్నేళ్లుగా మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది.

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News