Friday, March 13, 2026
24.7 C
Hyderabad

ఎన్నికల సంస్కరణలపై చిత్తశుద్ధేది?|EDITORIAL

భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ పారదర్శక ఎన్నికలు. ఇది రాజకీయాలతో కూడిన సున్నిత అంశం. అయితే, ‘ఎన్నికల సంస్కరణల’పై పార్లమెంటులో జరుగుతున్న చర్చ రాజకీయ రచ్చగా మారిపోయింది. పాలక బీజేపీ, ఎన్డీఏ పూర్తి స్థాయి సంస్కరణల ముసాయిదా ప్రకటించకపోవడం ఒక సమస్య కాగా, ఆ ముసాయిదానేగాక, ఎన్నికల పాదర్శకతపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అధికార, విపక్ష కూటములు రాజకీయ ఎజెండాలకే ప్రాధాన్యమివ్వడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలం అవుతున్నది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ పారదర్శక ఎన్నికలు. ఇది రాజకీయాలతో కూడిన సున్నిత అంశం. అయితే, ‘ఎన్నికల సంస్కరణల’పై పార్లమెంటులో జరుగుతున్న చర్చ రాజకీయ రచ్చగా మారిపోయింది. పాలక బీజేపీ, ఎన్డీఏ పూర్తి స్థాయి సంస్కరణల ముసాయిదా ప్రకటించకపోవడం ఒక సమస్య కాగా, ఆ ముసాయిదానేగాక, ఎన్నికల పాదర్శకతపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అధికార, విపక్ష కూటములు రాజకీయ ఎజెండాలకే ప్రాధాన్యమివ్వడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలం అవుతున్నది.

“ఎన్నికల పారదర్శకత, ఖర్చుల నియంత్రణ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం” ప్రతిపాదిక సంస్కరణల లక్ష్యమని పాలకపార్టీ పేర్కొంటోంది. ఓటర్ల జాబితాల సమీక్ష, డిజిటల్ ధృవీకరణ, పార్టీ నిధులపై పర్యవేక్షణ వంటి అంశాలను ఇది ముందుకు తెచ్చింది. ప్రభుత్వం దీన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే “సిస్టమ్ అప్‌గ్రేడ్”గా అభివర్ణించింది. అయితే ప్రతిపక్షం, ఈ సంస్కరణల వెనుక రాజకీయ లాభనష్టాల ‘హిడెన్ ఎజెండా’ దాగి ఉందని అనుమానిస్తోంది.

ప్రతిపక్షం ముఖ్యంగా రెండు అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒకటి, ఈ సంస్కరణలు ఓటర్ల గోప్యతను ప్రభావితం చేస్తాయా? రెండవది, ఇవి అధికార వ్యవస్థకే ఎక్కువ నియంత్రణను అందిస్తాయా? ప్రత్యేకంగా, డిజిటల్ ధృవీకరణ ప్రక్రియలో ఆడిట్, పారదర్శకత లేకుంటే, అధికార యంత్రాంగం ఎన్నికలపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. పాలకపక్షం దీనిని “అసత్య ప్రచారం”గా కొట్టి పారేసినా, చర్చలో ఈ అనుమానం ప్రధాన బిందువుగా నిలిచింది.

ఈ వాదోపవాదాలు రాజకీయ భిన్నాభిప్రాయాలకు బలం చేకూర్చాయి. చిన్న పార్టీల నుండి వచ్చిన ప్రతిస్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెద్ద పార్టీల రాజకీయ సమీకరణల్లో తాము అడుగంటిపోతామనే ఆందోళనతో వారు ఈ సంస్కరణలను మళ్లీ సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలకు, కేంద్ర ఎన్నికల సంస్కరణ అంటే ఎప్పుడూ భయమే. అయితే, వారు పాలకపక్షంతో నేరుగా విభేదించకపోయినా, బలహీన ప్రతిపక్షాలపై సానుభూతి వ్యక్తం చేస్తూ, తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ చర్చలో మరో ముఖ్యాంశం రాజకీయ నిధులు. నిధుల వ్యవస్థను పారదర్శకంగా మారుస్తామని పాలకపక్షం చెప్పినా, ప్రతిపక్షం మాత్రం ఇది కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా మారుతుందని విమర్శిస్తోంది. నిధులపై పారదర్శకత వెనుక రాజకీయ, ఆర్థిక సమీకరణలు దాగి ఉన్నాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దీనిపై సమగ్ర చర్చ లేకపోవడం, విషయాన్ని మరింత అనుమానాస్పదంగా మార్చింది.

ఇక, ఎన్నికల్లో ధన ప్రవాహం, రాజకీయాలు, ఎన్నికలు ఖరీదైనవిగా మారడం, వంశపారంపర్యం, జీవితాంతం కొందరు చట్టసభల్లో తిష్ట వేయడం, దొంగ ఓట్లు, ఓట్లకు నోట్లు వంటి అంశాలను చర్చించి, సంస్కరించాల్సి ఉంది.

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం ఆందోళనకరం. వరుస ఎన్నికలు ప్రజలకు, ప్రభుత్వాలకు, యంత్రాంగానికి, భారంగా మారుతున్నాయి. జన గణన, కులగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్లు కూడా తప్పనిసరి. పక్కాగా ఓటర్ల జాబితా, ఎప్పటికప్పుడు సవరణలు అవసరం, అన్నింటికంటే ఎన్నికల సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమేగాక, స్వతంత్రంగా తీర్చిదిద్దాలి.

ఎన్నికల్లో రెండు పర్యాయాలకంటే మించి పోటీ చేసే అవకాశం లేకుండా చేయడం, ఎన్నికల్లో ధనబలం, కండబలం ప్రభావం తగ్గించేందుకు చట్టాలను బలోపేతం చేయడం అత్యవసరం. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల వ్యవస్థకు పటిష్ఠమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన బాధ్యతను పార్లమెంటు నిర్వర్తించాలి.

పేదలకు చట్టసభల్లో ప్రవేశం లభించేలా విధి, విధానాలు, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వంటి విస్తృత మార్పులు దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. నిరంతరం కొత్త నాయకులు ఎన్నికవుతేనే అవినీతి, బంధుప్రీతి, కొన్ని వర్గాల పాలన, ఏకస్వామ్యం, నిరంకుశ రాజకీయాలు అంతమవుతాయి. ఓటు వేసే బాధ్యతను తప్పనిసరి చేయడం, ఓటు వేయని వారిపై చర్యలు తీసుకోవడం కూడా చర్చించదగిన అంశాలు. అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కలిగిన ఎన్నికల విధానం ఉంటేనే భారతదేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News